గత నెల 28న అకస్మాత్తుగా ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసి అత్యున్నత పదవిలో ఉన్న అయతుల్లా ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, అధికార పెద్దలను అంతమొందించింది.
ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేకుండా చేయడమే తమ లక్ష్యం అని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ ప్రకటించారు. తాజా పరిణామాలపై పీట్ హెగ్సేత్ మీడియాతో మాట్లాడారు.
అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఇరాక్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, జోర్డాన్ దేశాలపై ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తోంది. పెద్ద ఎత్తున బిల్డింగ్లు ధ్వంసం అయ్యాయి.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. క్షిపణులు, రాకెట్లు, డ్రోన్ దాడులతో దద్దరిల్లుతోంది. అయితే ఇరాన్ ప్రతీకార దాడులు అల్లకల్లోలం చేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ మిత్ర దేశాలపై గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఎక్కుపెట్టింది.
మరోసారి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా హెచ్చరించినట్లుగానే ఇరాన్పై యుద్ధం మొదలైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది.
భారతదేశం టార్గెట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. గతేడాది ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన గ్లోబల్ టారిఫ్లను ఇటీవలే అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది
తాను ఎంత కాలం ఉంటానో తెలియదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఫ్లోరిడాలోని నివాసంలోకి సాయుధ చొరబాటుదారుడు ప్రవేశంపై మాట్లాడారు. అనుమానితుడు తుపాకీ, ఇంధన డబ్బాను తీసుకుని మార్-ఎ-లాగోలోకి అక్రమంగా ప్రవేశించాడని తెలిపారు. చొరబాటుదారుడిని భద్రతా దళాలు కాల్చి చంపాయని పేర్కొన్నారు. షూటర్లు సాధారణ అధ్యక్షుల జోలికి వెళ్లరని.. కేవలం అసాధారణ విజయాలు సాధించే అధ్యక్షులనే లక్ష్యంగా చేసుకుంటారని తెలిపారు. మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్, జాన్ ఎఫ్. కెన్నడీ హత్యలే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు.…
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డ్రగ్స్ మాఫియా డాన్ నెమెసియో రుబ్న్ ఒసెగుయెరా అలియాస్ ఎల్ మెన్చో (60) భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యాడు. ఆదివారం ఎల్ మెన్చో చనిపోయినట్లుగా మెక్సికో రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.