తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు ఒక నిర్ణయాత్మక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై దాఖలైన పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం తుది విచారణను పూర్తి చేశారు. సుప్రీంకోర్టు విధించిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో, స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారింది. విచారణ అనంతరం స్పీకర్ వెలువరించిన ప్రాథమిక నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మొత్తం పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మందికి స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చారు. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లలో సరైన ఆధారాలు లేవనో లేదా సాంకేతిక కారణాల వల్లనో ఆ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.
IPS Love Stroy: ఐపీఎస్ అధికారుల లవ్ స్టోరీ.. బిష్ణోయ్, అన్షిక వర్మలు ఎవరు.?
దీనితో ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు పెద్ద ఊరట లభించినట్లయింది. అయితే, అందరి దృష్టి ఇప్పుడు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లపైనే ఉంది. వీరిద్దరి కేసుల్లో మాత్రం స్పీకర్ తన తీర్పును వెల్లడించకుండా రిజర్వ్ చేశారు. వీరి విషయంలో ఫిర్యాదులు , ఆధారాలు బలంగా ఉన్నాయా లేక మరేదైనా కారణమా అన్నది తెలియాల్సి ఉంది. వీరిద్దరి భవితవ్యంపై స్పీకర్ ఏ క్షణమైనా తుది తీర్పు వెలువరించే అవకాశం ఉండటంతో, వారి ఎమ్మెల్యే పదవులు ఉంటాయా లేదా అనే ఉత్కంఠ తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్టకు చేరుకుంది.