ఆరోజుల్లో డబ్బులు తెలియవు.. రెక్కాడితే కానీ డొక్కాడవు.. అలాంటిది ఇప్పుడు కరెన్సీ విలువ పెరిగిపోయింది.. ఒక్కో దేశానికీ ఒక్కో రకమైన కరెన్సీ నోట్లు ఉంటాయి.. దేశ ఆర్థిక శక్తిని ప్రతిబింబిస్తుంది. కరెన్సీ దేశ స్థిరత్వం, బలమైన ఆర్థిక వ్యవస్థకు నిదర్శనం. కరెన్సీ విలువ పెరిగే కొద్దీ, ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది.పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అంతేకాదు అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తుంది.. కరెన్సీకి డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ దేశం ఆర్థిక పరిస్థితులు బాగుంటాయని నిపుణులు చెబుతున్నారు..…
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి అమెరికాలో అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకున్నారు. ఈ బయోటెక్ వ్యవస్థాపకుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు అక్కడ అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని వనపర్తికి చెందిన ఒకరు, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చెందిన మరొక విద్యార్థి అమెరికాలోని వారి కనెక్టికట్ వసతి గృహంలో చనిపోయారని కుటుంబసభ్యులు సోమవారం వెల్లడించారు. విద్యార్థులను తెలంగాణలోని వనపర్తికి చెందిన జి దినేష్ (22), ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చెందిన నికేష్ (21)గా గుర్తించారు.
ఉత్తర కొరియా ఒక ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అది కొరియా ద్వీపకల్పంతో పాటు జపాన్ మధ్య సముద్రంలో పడిపోయింది. ఈ క్షిపణి ఈ ప్రాంతంలోని రిమోట్ ద్వారా అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేకుని ప్రయోగించింది.
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి మృతి చెందాడు. రూమ్లో నిద్రపోయిన అతడు.. నిద్రలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలి రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కొందరు అమెరికాలో చనిపోయారు. Also Read: Rohit vs Hardik: ఇద్దరి మధ్య ఇగో సమస్యలు…
అగ్రరాజ్యం అమెరికాపై మంచు తీఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ శీతాకాలపు తుఫాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా మిడ్వెస్ట్ చుట్టు పక్కల రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నాయి.
ఎర్ర సముద్రంలో యుద్ధం జరిగే అవకాశం ఉంది. హౌతీలపై అమెరికా దాడి కొనసాగుతుంది. యెమెన్లో హౌతీ బలగాలపై అమెరికా బలగాలు అదనపు దాడిని జరుపుతున్నాయని అమెరికా అధికారులు తెలిపారు.
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్న హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, బ్రిటన్ బలగాలు ఎదురుదాడికి దిగాయి. రెండు దేశాల సైన్యాలు హౌతీ తిరుగుబాటుదారులు ఉపయోగించే డజన్ల కొద్దీ స్థావరాలపై బాంబు దాడులు చేశాయి.