గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించిన దగ్గర మిత్రులైన ఐరోపా దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అమెరికా నిర్ణయంపై భగ్గుమన్నాయి. దీంతో మిత్ర దేశాల మధ్య ప్రస్తుతం సఖ్యత చెడింది. గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ ఆధ్వర్యంలో ఉంది.
భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరుగుతున్న వేళ అగ్ర రాజ్యం అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యూరప్ తనకు వ్యతిరేకంగా యుద్ధానికి నిధులు సమకూర్చుతోందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఆరోపించారు.
వెనిజులా అధ్యక్ష భవనంపై అమెరికా దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్యను కిడ్నాప్ చేసుకుని వెళ్లిపోయారు. నిమిషాల వ్యవధిలోనే అమెరికా ఆపరేషన్ ముగించేసింది. ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 8 మందితో వెళ్తున్న ప్రైవేటు జెట్ ఈశాన్య రాష్ట్రమైన మైనేలోని బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలిపోయింది. ప్రమాదం జరగగానే మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులకు అమెరికా ప్రత్యేక సందేశాన్ని పంపించింది. రిపబ్లిక్ డే సందర్భంగా భారతీయులకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చైనాతో కెనడా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ట్రంప్ హెచ్చరికల తర్వాత చైనాతో వాణిజ్య ఒప్పందం కొనసాగించడం ఉద్దేశం లేదని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రకటించారు. ఈ వ్యవహారం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది.
అగ్ర రాజ్యం అమెరికాను తుఫాన్ గజగజలాడిస్తోంది. గత మూడు రోజుల నుంచి కుండపోతగా మంచు కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్థం అయిపోయింది. నిత్యావసర వస్తువులు దొరకకా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కెనడా లక్ష్యంగా మరోసారి ట్రంప్ విరుచుకుపడ్డారు. గ్రీన్లాండ్పై గోల్డెన్ డోమ్ నిర్మించడాన్ని కెనడా వ్యతిరేకిస్తోంది. అదే సమయంలో చైనాతో సంబంధాలు పెట్టుకోవాలని భావిస్తోంది. ఈ వ్యవహారం ట్రంప్కు భారీ కోపం తెప్పించింది.
అమెరికాలో దారుణం జరిగింది. భారతీయ వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డాడు. కుటుంబ వివాదాల్లో అదుపు తప్పి తుఫాకీతో కాల్పులు జరపగడంతో భార్య, ముగ్గురు బంధువులు ప్రాణాలు కోల్పోయారు. పిల్లలు వేరే గదిలో తలదాచుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
అగ్ర రాజ్యం అమెరికాను మంచు తుఫాన్ గజగజలాడిస్తోంది. శుక్రవారం సాయంత్రం నుంచి కుండపోతగా కురుస్తున్న మంచుతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. ఇక గడ్డ కట్టే చలిలో ప్రజలు వణికిపోతున్నారు. దాదాపు 15 కోట్ల మందికి పైగా ప్రజలు నరకయాతన పడుతున్నారు.