US: భారత్-ఈయూ ఒప్పందం వేళ అమెరికా షాక్.. డీల్పై హాట్ కామెంట్స్
- భారత్-ఈయూ ఒప్పందం వేళ అమెరికా అభ్యంతం
- డీల్పై అమెరికా ఆర్థిక మంత్రి హాట్ కామెంట్స్
- యూరోపియన్ మిత్ర ధర్మాన్ని మీరుతోందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరుగుతున్న వేళ అగ్ర రాజ్యం అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యూరప్ తనకు వ్యతిరేకంగా యుద్ధానికి నిధులు సమకూర్చుతోందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Off The Record: పబ్లిసిటీ కోసం వెళ్లి హోంమంత్రి ఇరుకునపడ్డారా..?
Also Read
- Giorgia Meloni: జీ 7 సదస్సుకు కుమార్తెతో హాజరైన మెలోని.. ఫొటోలు వైరల్
- India-Bangladesh: ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు’’.. భారత్కు బంగ్లా ప్రధాని సలహాదారు ఘాటు సందేశం
- Trump: హార్ముజ్ శాశ్వతంగా టోల్ ఫ్రీగా ఉంటుంది.. జీ 7 సదస్సులో ట్రంప్ ప్రకటన
- US-Iran Peace Deal: ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ టీమ్లో చీలిక.. CIA హెచ్చరికలతో ఉద్రిక్తత
భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఢిల్లీకి వచ్చారు. జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు అతిథిగా కూడా హాజరయ్యారు. మంగళవారం భారత్తో వాణిజ్య ఒప్పందంపై కీలక ప్రకటన రానుంది. దాదాపు 18 ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ చర్చలు చివరి దిశగా చేరుకున్నాయి. ఒప్పందం జరిగాక చట్టపరంగా పరిశీలించడానికి 5-6 నెలల సమయం పడుతుందని.. అనంతరం ఇరు పక్షాలు సంతకాలు జరుగుతాయని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ అన్నారు. సంతకాలు పూర్తయ్యాక వచ్చే ఏడాది నుంచి ఒప్పందం అమల్లోకి రానుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Tragedy : చైనా మాంజాకు ఐదేళ్ల చిన్నారి బలి.. తండ్రి కళ్ల ముందే ఘోరం.!
అయితే యూరోపియన్ యూనియన్తో కీలక ఒప్పందం జరుగుతున్న వేళ అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏబీసీ న్యూస్తో స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. భారతదేశం రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయడంతో 25 శాతం సుంకం విధించామని.. కానీ గతం వారం ఏం జరిగిందో తెలిసిందే కదా? యూరోపియన్లు భారతదేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నారన్నారు. అంటే స్పష్టంగా చెప్పాలంటే.. రష్యన్ చమురు భారతదేశంలోకి వెళ్తుందని.. అక్కడ నుంచి శుద్ధి చేసిన ఉత్పత్తులు బయటకు వస్తాయని.. ఆ శుద్ధి చేసిన ఉత్పత్తులను యూరోపియన్లు కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. అంటే వారు తమపై యుద్ధానికి నిధులు సమకూర్చుతున్నారని వ్యాఖ్యానించారు. భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడం ద్వారా మిత్ర ధర్మాన్ని మీరుతున్నాయని ఆరోపించారు. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడంతోనే.. దాని ద్వారా వచ్చే నిధులతో ఉక్రెయిన్పై యుద్ధం చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు భారత్ దగ్గర ఐరోపా శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు కొనుగోలు చేసి యుద్ధానికి నిధులు సమకూరుస్తుందని ధ్వజమెత్తారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ ఎంతగానో కృషి చేశారని ప్రశంసించారు. యూరోపియన్ల కంటే చాలా పెద్ద త్యాగమే చేశారని కొనియాడారు. నాలుగేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధానికి ముగించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని.. చివరికి ముగించేస్తామని స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?