US: భారత్-ఈయూ ఒప్పందం వేళ అమెరికా షాక్.. డీల్పై హాట్ కామెంట్స్
- భారత్-ఈయూ ఒప్పందం వేళ అమెరికా అభ్యంతం
- డీల్పై అమెరికా ఆర్థిక మంత్రి హాట్ కామెంట్స్
- యూరోపియన్ మిత్ర ధర్మాన్ని మీరుతోందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరుగుతున్న వేళ అగ్ర రాజ్యం అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యూరప్ తనకు వ్యతిరేకంగా యుద్ధానికి నిధులు సమకూర్చుతోందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Off The Record: పబ్లిసిటీ కోసం వెళ్లి హోంమంత్రి ఇరుకునపడ్డారా..?
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఢిల్లీకి వచ్చారు. జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు అతిథిగా కూడా హాజరయ్యారు. మంగళవారం భారత్తో వాణిజ్య ఒప్పందంపై కీలక ప్రకటన రానుంది. దాదాపు 18 ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ చర్చలు చివరి దిశగా చేరుకున్నాయి. ఒప్పందం జరిగాక చట్టపరంగా పరిశీలించడానికి 5-6 నెలల సమయం పడుతుందని.. అనంతరం ఇరు పక్షాలు సంతకాలు జరుగుతాయని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ అన్నారు. సంతకాలు పూర్తయ్యాక వచ్చే ఏడాది నుంచి ఒప్పందం అమల్లోకి రానుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Tragedy : చైనా మాంజాకు ఐదేళ్ల చిన్నారి బలి.. తండ్రి కళ్ల ముందే ఘోరం.!
అయితే యూరోపియన్ యూనియన్తో కీలక ఒప్పందం జరుగుతున్న వేళ అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏబీసీ న్యూస్తో స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. భారతదేశం రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయడంతో 25 శాతం సుంకం విధించామని.. కానీ గతం వారం ఏం జరిగిందో తెలిసిందే కదా? యూరోపియన్లు భారతదేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నారన్నారు. అంటే స్పష్టంగా చెప్పాలంటే.. రష్యన్ చమురు భారతదేశంలోకి వెళ్తుందని.. అక్కడ నుంచి శుద్ధి చేసిన ఉత్పత్తులు బయటకు వస్తాయని.. ఆ శుద్ధి చేసిన ఉత్పత్తులను యూరోపియన్లు కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. అంటే వారు తమపై యుద్ధానికి నిధులు సమకూర్చుతున్నారని వ్యాఖ్యానించారు. భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడం ద్వారా మిత్ర ధర్మాన్ని మీరుతున్నాయని ఆరోపించారు. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడంతోనే.. దాని ద్వారా వచ్చే నిధులతో ఉక్రెయిన్పై యుద్ధం చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు భారత్ దగ్గర ఐరోపా శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు కొనుగోలు చేసి యుద్ధానికి నిధులు సమకూరుస్తుందని ధ్వజమెత్తారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ ఎంతగానో కృషి చేశారని ప్రశంసించారు. యూరోపియన్ల కంటే చాలా పెద్ద త్యాగమే చేశారని కొనియాడారు. నాలుగేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధానికి ముగించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని.. చివరికి ముగించేస్తామని స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!