గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం పాకిస్థాన్పై ప్రతీకారంగా మే 7న భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు నాలుగు రోజులు తర్వాత కాల్పుల విరమణ జరిగింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో 100 మంది ఉగ్రవాదులు చనిపోగా.. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకోవడంపై ఆ దేశ ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి గ్రహీత మారియా మచాడో హర్షం వ్యక్తం చేసింది.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్నాక అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటనలు చేశారు. చమురు, ఎన్నికలు, ఇన్ఛార్జ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. వెనిజులా భవిష్యత్ ప్రణాళికను ట్రంప్ వెల్లడించారు.
ట్రంప్-ఎలాన్ మస్క్ మరోసారి కలిసి ప్రత్యక్షమయ్యారు. ఫ్లోరిడాలోని అధ్యక్షుడికి చెందిన మార్-ఎ-లాగో రిసార్ట్లో శనివారం సాయంత్రం జరిగిన ఒక ప్రత్యేక విందుకు ఎలాన్ మస్క్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్యను అమెరికా సైన్యం అరెస్ట్ చేసింది. శనివారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున సైనిక దాడి చేసి అందుపులోకి తీసుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై దాడి అంశాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి చేసిందంటూ ఇటీవల రష్యా సైనిక అధికారులు.. అమెరికాకు ఆధారాలు సమర్పించింది. తాజాగా ఇదే అంశంపై ఆదివారం ఎయిర్ఫోర్స్ వన్లో ట్రంప్ స్పందించారు.
వెనిజులా వ్యవహారం ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. శనివారం వెనిజులాపై అమెరికా భీకరమైన సైనిక చర్యకు దిగి ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను.. అతని భార్య సిలియా ఫ్లోర్స్ను కారకాస్లో బంధించి అమెరికా తరలించింది.
అమెరికాలో భారతీయ యువతి నిఖితా గోడిశాల (27) దారుణ హత్యకు గురైంది. మేరీల్యాండ్లోని మాజీ ప్రియుడి అపార్ట్మెంట్లో విగతజీవిగా పడి ఉంది. నూతన సంవత్సర వేడుకల తర్వాత మహిళ కత్తిపోట్లకు గురై చనిపోయి ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అగ్ర రాజ్యం అమెరికాలో న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఐఎస్ఐఎస్ ప్రేరేపిత కుట్రను ఎఫ్బీఐ భగ్నం చేసింది. నార్త్ కరోలినాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దాడులకు పాల్పడాలని ఐసిస్ కుట్ర చేసినట్లుగా అధికారులు గుర్తించారు. 18 ఏళ్ల క్రిస్టియన్ స్టర్డివాంట్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూయార్క్ మేయర్గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ (34) ప్రమాణస్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో తొలి ముస్లిం మేయర్గా ప్రమాణం చేశారు. గతేడాది జరిగిన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు.