అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు కురిపించారు. మే నెలలో భారత్-పాకిస్థాన్ మధ్య వినాశకరమైన యుద్ధాన్ని ట్రంప్ నిలిపివేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి.
న్యూయార్క్లో జరుగుతున్న 80వ ఐక్యరాజ్యసమతి శిఖరాగ్ర సమావేశాలకు అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి ట్రంప్ సుదీర్ఘ ప్రసంగం కూడా చేశారు. ఇక అరబ్-ఇస్లామిక్ సమ్మిట్లో ట్రంప్ పాల్గొన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియాకు ఐక్యరాజ్యసమితిలో షాకింగ్ పరిణామం ఎదురైంది. యాదృచ్ఛికమో.. లేదంటే కావాలనే జరిగిందో తెలియదు గానీ.. యూఎన్ కార్యాలయంలో ట్రంప్, మెలానియా ఎస్కలేటర్ ఎక్కగానే హఠాత్తుగా ఆగిపోయింది
టారిఫ్ ఉద్రిక్తతల వేళ భారత్-అమెరికా మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. సుంకాలు కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ సమావేశం శుభపరిణామంగా భావించొచ్చు.
ఐక్యరాజ్యసమితి కౌన్సిల్ సమావేశాల కోసం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆయన బృందం నేటి నుంచి ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. న్యూయార్క్లో 80వ ఐరాస కౌన్సిల్ సమావేశం జరుగుతోంది.
ఇకపై పాలస్తీనా రాజ్యం ఉండబోదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. పాలస్తీనా రాజ్య స్థాపనకు ఆయా దేశాలు మద్దతు పలుకుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలో తీర్మానం చేస్తామంటూ వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి ఈ ప్రకటన రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తన భర్తను కాల్చి చంపిన వ్యక్తిని తాను క్షమించేశానని చార్లీ కిర్క్ భార్య ఎరికా ప్రకటించారు. దీంతో సంతాప కార్యక్రమానికి హాజరైన వారంతా స్టాండింగ్ ఒవేషన్ చేశారు. ఎరికా ప్రకటనను అందరూ స్వాగతించారు. చార్లీ కిర్క్ను జ్ఞాపకం చేసుకుంటూ ఆదివారం అరిజోనాలోని గ్లెండేల్లోని స్టేట్ ఫార్మ్ స్టేడియంలో స్మారక కార్యక్రమం నిర్వహించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చాలా రోజుల తర్వాత పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఇందుకు చార్లీ కిర్క్ సంతాప కార్యక్రమం వేదిక అయిది. ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ను గుర్తు చేసుకుంటూ ఆదివారం స్మారక మెమోరియల్ సర్వీస్ జరిగింది.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సముద్రం ద్వారా దేశంలోకి ప్రవేశించే డ్రగ్స్పై అమెరికా వేట సాగిస్తోంది. తాజా దాడిలో ముగ్గురు చనిపోయినట్లు ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. వీడియోలో వేగంగా దూసుకుపోతున్న బోటుపై ఒక్కసారిగా బాంబ్ దాడి జరగడంతో ధ్వంసమైంది.