India-US: భారతీయులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పిన అమెరికా
- నేడు భారతదేశంలో గణతంత్ర దినోత్సవం
- భారతీయులకు శుభాకాంక్షలు చెప్పిన అమెరికా
- ప్రత్యేక సందేశాన్ని పంపించిన మార్కో రూబియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులకు అమెరికా ప్రత్యేక సందేశాన్ని పంపించింది. రిపబ్లిక్ డే సందర్భంగా భారతీయులకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రక్షణ, ఇంధనం, ఖనిజాలు, సాంకేతిక రంగాల్లో అమెరికా-భారతదేశం లోతైన, బహుముఖ సహకారన్ని కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం జనవరి 26న అమల్లోకి వచ్చినందుకు జరుపుకుంటున్న రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలు అని చెప్పారు.
ఇది కూడా చదవండి: Trump-Canada: ట్రంప్ వార్నింగ్ ఎఫెక్ట్.. చైనాతో వాణిజ్య ఒప్పందం రద్దు చేసుకున్న కెనడా!
Also Read
- China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
- Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
- China: జిన్పింగ్ పీఠానికే ఎసరు? చైనా మాజీ రక్షణ మంత్రుల మరణశిక్ష వెనుక 'అసలు' మిస్టరీ ఇదేనా!
- Bangladesh: ‘‘మమతా బెనర్జీ వెంట 17 కోట్ల మంది ముస్లింలు’’.. బంగ్లాదేశ్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
‘‘అమెరికా ప్రజల తరపున.. మీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.’’ అని ఎక్స్లో రాసుకొచ్చారు. ‘‘యునైటెడ్ స్టేట్స్-భారతదేశం చారిత్రాత్మక సంబంధాన్ని పంచుకుంటున్నాయి. రక్షణ, శక్తి, కీలకమైన ఖనిజాలు, సాంకేతిక సహకారం. రాబోయే సంవత్సరాల్లో మా భాగస్వామ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి పని చేయాలని నేను ఎదురుచూస్తున్నాను.’’ అని రూబియో పేర్కొన్నారు. అమెరికా-భారతదేశం మధ్య ద్వైపాక్షిక సంబంధం వివిధ రంగాల్లో సన్నిహిత సహకారం ద్వారా నిజమైన ఫలితాలను ఇస్తుందని ఆకాంక్షించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ సహకారం ఉంటుందని వెల్లడించారు.
భారతదేశం సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో గ్రాండ్ కవాతు జరగనుంది. ఈ వేడుకలకు అతిథులుగా యూరోపియన్ నాయకులు హాజరుకానున్నారు. ప్రస్తుతం భారతదేశం-యూరోపియన్ దేశాలతో సంబంధాలు బలపడుతున్నాయి.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!