రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై దాడి అంశాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి చేసిందంటూ ఇటీవల రష్యా సైనిక అధికారులు.. అమెరికాకు ఆధారాలు సమర్పించింది. తాజాగా ఇదే అంశంపై ఆదివారం ఎయిర్ఫోర్స్ వన్లో ట్రంప్ స్పందించారు.
వెనిజులా వ్యవహారం ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. శనివారం వెనిజులాపై అమెరికా భీకరమైన సైనిక చర్యకు దిగి ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను.. అతని భార్య సిలియా ఫ్లోర్స్ను కారకాస్లో బంధించి అమెరికా తరలించింది.
అమెరికాలో భారతీయ యువతి నిఖితా గోడిశాల (27) దారుణ హత్యకు గురైంది. మేరీల్యాండ్లోని మాజీ ప్రియుడి అపార్ట్మెంట్లో విగతజీవిగా పడి ఉంది. నూతన సంవత్సర వేడుకల తర్వాత మహిళ కత్తిపోట్లకు గురై చనిపోయి ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అగ్ర రాజ్యం అమెరికాలో న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఐఎస్ఐఎస్ ప్రేరేపిత కుట్రను ఎఫ్బీఐ భగ్నం చేసింది. నార్త్ కరోలినాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దాడులకు పాల్పడాలని ఐసిస్ కుట్ర చేసినట్లుగా అధికారులు గుర్తించారు. 18 ఏళ్ల క్రిస్టియన్ స్టర్డివాంట్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూయార్క్ మేయర్గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ (34) ప్రమాణస్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో తొలి ముస్లిం మేయర్గా ప్రమాణం చేశారు. గతేడాది జరిగిన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు.
న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మమ్దానీ ప్రమాణస్వీకారం చేశారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ప్రమాణ స్వీకారం చేయించారు. అమెరికా చరిత్రలో తొలిసారిగా ఖురాన్పై చేయి వేసి ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. న్యూయార్క్లోని మాన్హట్టన్లోని సబ్వే స్టేషన్లో జరిగిన చారిత్రాత్మక కార్యక్రమంలో మమ్దానీ ప్రమాణ స్వీకారం చేశారు. ‘‘ఇది నిజంగా జీవితకాల గౌరవం, ప్రత్యేకత’’ అని మమ్దానీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Gold Rates: న్యూఇయర్ వేళ బంగారం, సిల్వర్ ధరలు ఇలా! భారత…
2025 సంవత్సరం కొన్ని గంటల్లో ముగియనుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాది అంతర్జాతీయంగా అనేక ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు దేశాల మధ్య యుద్ధాలు.. ఇంకోవైపు ట్రంప్ ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించడం. ఇలా ఏడాది పొడవునా గందరగోళమే నెలకొంది. ఈ సంవత్సరం హైలెట్గా నిలిచిన వార్తలపై ఒకసారి లుక్కేద్దాం. ట్రంప్ వాణిజ్యం యుద్ధం ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ పదవీ…
అమెరికాలో ఓ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. గర్భంలో శిశువు మరణించినందుకు ఓ మహిళకు ఏకంగా 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు ఇప్పుడు అగ్ర రాజ్యంంలో సంచలనంగా మారింది.
భారత్-పాకిస్థాన్ యుద్ధం విషయాన్ని ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపితే సరైన క్రెడిట్ దక్కలేదని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో నెతన్యాహును కలిసిన సందర్భంగా మరోసారి ట్రంప్ గుర్తుచేశారు.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలిఫోర్నియాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు రూమ్మేట్స్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.