అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ఈ మధ్య తీవ్ర వివాదాస్పదమవుతోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మోనార్క్లా ప్రవర్తిస్తు్న్నారు. ఇప్పటికే ఎలాన్ మస్క్ దూరం అయ్యారు. అదే కోవలో పలువురు ఉన్నారు.
Russia vs America: రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ వార్నింగ్ కు ప్రతిస్పందనగా.. ఆ దేశానికి చేరువలో సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను అగ్రరాజ్యం మోహరించింది. దీనిపై తాజాగా రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్స్కీ మాట్లాడుతూ.. అమెరికాను ఎదుర్కొనేందుకు తమ వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
రష్యా-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
భారత్పై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారతదేశం చమురు కొనుగోలు చేయడం ఏ మాత్రం బాగోలేదని.. ఈ పరిణామం కచ్చితంగా చికాకు కలిగించే అంశం అని రూబియో పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడి నిర్ణయం ఇపుడు ఆక్వారంగంపై పిడుగు పడినట్టు చేస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ పై విధించిన 25 శాతం సుంకాలు అమల్లోకి రావడంతో ఆ ప్రభావం ఆక్వారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతోంది. నిన్నమొన్నటి వరకు రొయ్యలపై 3 నుంచి 4 శాతంగా ఉన్న సుంకాన్ని .. అమెరికా 25 శాతానికి పెంచడంతో ఎగుమతి చేయాలంటే ఇకపై భారీగా పన్నులు చెల్లించాలి.
కాలిఫోర్నియాలోని నావల్ ఎయిర్ స్టేషన్ సమీపంలో ఎఫ్-35 ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు అంటుకుని దట్టంగా పొగలు అలుముకున్నాయి. అయితే పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు.
Indian Oil Companies: భారత్పై అగ్రరాజ్యం అమెరికా 25 శాతం టారీఫ్స్ విధించిన వేళ మరో కీలక పరిణామం జరిగింది. ఇండియాకు చెందిన చమురు కంపెనీలపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు విధించింది.
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 8.8తో భూకంపం సంభవించింది. దీంతో రష్యాలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం రష్యాతో పాటు అమెరికా, జపాన్, కెనడా, న్యూజిలాండ్లకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
సుంకాలపై ట్రంప్ విధించిన డెడ్లైన్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఆగస్టు 1తో డెడ్లైన్ ముగుస్తుంది. కానీ ఇప్పటి వరకు భారత్-అమెరికా మధ్య మాత్రం ఒప్పందం ఖరారు కాలేదు.