Trump: అలాగైతే అమెరికా నాశనమే.. టారిఫ్ తీర్పుపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- అలాగైతే అమెరికా నాశనమే
- టారిఫ్ తీర్పుపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుంకాలు చట్ట విరుద్ధం అంటూ ఫెడరల్ అప్పీల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అలాగైతే అమెరికా పూర్తిగా నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. సుంకాలను తొలగించడం అమెరికా వినాశనానికి దారి తీస్తుందని తెలిపారు. తీర్పు వెలువరించిన న్యాయమూర్తులపై ధ్వజమెత్తారు. వారంతా ‘రాడికల్ లెఫ్ట్ గ్రూప్’ అంటూ ముద్ర వేశారు. ఇక భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన న్యాయమూర్తి ధైర్యంపై మాత్రం ప్రశంసలు కురిపించారు. ఆ న్యాయమూర్తి ఒబామా నియమించిన డెమొక్రాట్ అని అభివర్ణించారు. ఆ జడ్జి యూఎస్ను ప్రేమిస్తున్నారని.. అంతేకాకుండా గౌరవిస్తున్నారని.. ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: SCO Summit: నేడే మోడీ-పుతిన్ కీలక భేటీ.. కీలకంగా మారనున్న అమెరికా టారిఫ్!
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
ఆయా దేశాలపై ట్రంప్ సుంకాలు విధించారు. దీంతో సుంకాలు కారణంగా ఆయా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ విధించిన సుంకాలు చట్ట విరుద్ధమని శుక్రవారం అమెరికా ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు తీర్పు వెలువరిచింది. 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. ఓపెన్-ఎండ్ సుంకాలను అమలు చేసే అధికారం ట్రంప్కు లేదని న్యాయస్థానం పేర్కొంది. ఇక సుంకాలను రద్దు చేసినప్పటికీ.. అక్టోబర్ 14 వరకు మాత్రం కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. అయితే దీనిపై ట్రంప్కు అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: GAMA Awards : ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ చిత్రంగా పుష్ప 2
భారత్పై తొలుత ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. అంతలోనే మరో బాంబ్ పేల్చారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో భారత్పై 50 శాతం సుంకం విధించినట్లైంది. ఆసియాలో భారత్పైనే మాత్రమే 50 శాతం సుంకం విధించారు. చైనా మీద మాత్రం ప్రేమ చూపించారు. చైనా కూడా రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తోంది. కానీ చైనా మీద మాత్రం విధించలేదు.

- Tags
- america
- Court Ruling
- india
- tariffs
- trump
తాజావార్తలు
-
Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
-
MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
-
LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
-
Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
-
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!