Trump-Modi: ట్రంప్ సుంకాలతో వచ్చే నష్టమేంటి? భారత్ ప్లాన్ ఏంటి?
- ట్రంప్ సుంకాలతో వచ్చే నష్టమేంటి?
- అంచనా వేసిన ఆర్థిక శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్పై ఏదో కోపం పెట్టుకున్నట్లుగానే ట్రంప్ వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కక్ష సాధింపులో భాగంగానే భారత్పై భారీగా సుంకాలు విధించినట్లుగా తెలుస్తోంది. ఆసియాలో ఒక్క భారత్పైనే భారీగా సుంకం విధించారు. దీంతో ఇది ఉద్దేశపూర్వకంగానే ట్రంప్ ఇలా వ్యవహరిస్తున్నట్లుగా నిపుణులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆగస్టు 27 నుంచి భారత్పై 50 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. అయితే రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తామని భారత ప్రభుత్వం చెబుతున్నా.. ప్రభావం మాత్రం ఎక్కువగానే ఉంటుందని ఆర్థిక శాఖ అంచనాకు వచ్చింది. దీంతో అమెరికాతో వాణిజ్య చర్చలు జరగాల్సి ఉందని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఇది కూడా చదవండి: US: ట్రంప్ను చంపేయండి.. విద్యార్థులపై కాల్పులు జరిపిన నిందితుడి తుపాకీపై రాతలు
భారత ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలు ప్రస్తుతం పరిమితంగా అనిపించవచ్చు కానీ ఆర్థిక వ్యవస్థపై మాత్రం ప్రభావం ఎక్కువగానే ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఒక నివేదికలో తెలిపింది. తప్పనిసరిగా ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరగాల్సి ఉంటుందని పేర్కొంది. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నెలవారీ ఆర్థిక సమీక్ష తెలిపింది. 50 శాతం భారీ సుంకం కారణంగా 48 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఎగుమతులపై ప్రభావం చూపునున్నట్లు తెలుస్తోంది. వస్త్రాలు/దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యలు, తోలు, పాదరక్షలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్, యాంత్రిక యంత్రాలపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్లో అరుదైన సంఘటన.. 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
భారత్పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం మరో బాంబ్ పేల్చారు. రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆగస్టు 27 నుంచి 50 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోడీ కారణంగానే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆపడం లేదని అమెరికా పదే పదే ఆరోపిస్తోంది. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడం ఆపేస్తే.. రష్యా దిగొస్తుందని అంటోంది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!