Trump-Modi: ట్రంప్ సుంకాలతో వచ్చే నష్టమేంటి? భారత్ ప్లాన్ ఏంటి?
- ట్రంప్ సుంకాలతో వచ్చే నష్టమేంటి?
- అంచనా వేసిన ఆర్థిక శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్పై ఏదో కోపం పెట్టుకున్నట్లుగానే ట్రంప్ వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కక్ష సాధింపులో భాగంగానే భారత్పై భారీగా సుంకాలు విధించినట్లుగా తెలుస్తోంది. ఆసియాలో ఒక్క భారత్పైనే భారీగా సుంకం విధించారు. దీంతో ఇది ఉద్దేశపూర్వకంగానే ట్రంప్ ఇలా వ్యవహరిస్తున్నట్లుగా నిపుణులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆగస్టు 27 నుంచి భారత్పై 50 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. అయితే రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తామని భారత ప్రభుత్వం చెబుతున్నా.. ప్రభావం మాత్రం ఎక్కువగానే ఉంటుందని ఆర్థిక శాఖ అంచనాకు వచ్చింది. దీంతో అమెరికాతో వాణిజ్య చర్చలు జరగాల్సి ఉందని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది.
Also Read
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
ఇది కూడా చదవండి: US: ట్రంప్ను చంపేయండి.. విద్యార్థులపై కాల్పులు జరిపిన నిందితుడి తుపాకీపై రాతలు
భారత ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలు ప్రస్తుతం పరిమితంగా అనిపించవచ్చు కానీ ఆర్థిక వ్యవస్థపై మాత్రం ప్రభావం ఎక్కువగానే ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఒక నివేదికలో తెలిపింది. తప్పనిసరిగా ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరగాల్సి ఉంటుందని పేర్కొంది. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నెలవారీ ఆర్థిక సమీక్ష తెలిపింది. 50 శాతం భారీ సుంకం కారణంగా 48 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఎగుమతులపై ప్రభావం చూపునున్నట్లు తెలుస్తోంది. వస్త్రాలు/దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యలు, తోలు, పాదరక్షలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్, యాంత్రిక యంత్రాలపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్లో అరుదైన సంఘటన.. 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
భారత్పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం మరో బాంబ్ పేల్చారు. రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆగస్టు 27 నుంచి 50 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోడీ కారణంగానే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆపడం లేదని అమెరికా పదే పదే ఆరోపిస్తోంది. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడం ఆపేస్తే.. రష్యా దిగొస్తుందని అంటోంది.
తాజావార్తలు
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
-
Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
-
Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో ‘లగ్జరీ’ ఫోన్.. రేపు అందుబాటులోకి..
-
Prasanna Kumar: టాలీవుడ్లో ముగిసిన యూనియన్ వార్.. రంగంలోకి దిగిన బాలయ్య!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!