Food Tips : పురుగులు పట్టకుండా పిండి 6 నెలలు ఫ్రెష్గా ఉండాలంటే… ఈ ట్రిక్ మిస్ చేయకు.!
- పిండికి పురుగులు పడటానికి అసలు కారణం ఏమిటి?
- ఎండలో ఆరబెట్టడం ద్వారా తేమను తొలగించే చిట్కా
- బిర్యానీ ఆకులు, లవంగాలతో పురుగులు దూరం
- ఎయిర్టైట్ డబ్బాలతో పిండి ఎక్కువకాలం ఫ్రెష్గా ఉంచడం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన వంటగదిలో బియ్యం, గోధుమ పిండి ఎప్పుడూ ఉంటాయి కదా.. చపాతీలు, రొట్టెలు, పూరీలు రోజూ ఉపయోగిస్తాం. కానీ ఒక్కసారి పిండికి పురుగులు పడితే సమస్యే.. తెల్లటి చిన్న పురుగులు (వీవిల్స్ అంటారు) కనిపిస్తాయి, పిండి వాసన వస్తుంది, పాడైపోతుంది. పురుగు పట్టిన పిండితో చేసిన రొట్టెలు తినడానికి కూడా మనసు రాదు. ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా అరికట్టాలో చూద్దాం.
పిండిలో పురుగులు రావడానికి ప్రధాన కారణం ఏంటి?
పిండికి పురుగులు పడటానికి అతి పెద్ద కారణం తేమ. వాతావరణం మారినప్పుడు – ముఖ్యంగా చలికాలం నుంచి వేసవికి, లేదా వర్షాకాలంలో – గాలిలో తేమ ఎక్కువవుతుంది. ఈ తేమ వల్ల పురుగులు, వాటి గుడ్లు సులభంగా పెరిగిపోతాయి. చల్లదనం కోసం పురుగులు పిండి వైపు ఆకర్షితమవుతాయి. ఇలాంటి సమయాల్లో పిండి త్వరగా పురుగు పట్టే అవకాశం ఎక్కువ.
Also Read
- Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
- Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
- Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!
పురుగుల్ని తొలగించడానికి సులభమైన సహజ మార్గాలు
ముందుగా తేమను తొలగించడం చాలా ముఖ్యం. వారానికి ఒకసారి పిండిని వెడల్పాటి పాత్రలో పలుచగా పరచి, 2-3 గంటలు ఎండలో పెట్టండి. సూర్యరశ్మి తేమను పూర్తిగా ఆరబెడుతుంది, పురుగులు బయటకు పారిపోతాయి లేదా చనిపోతాయి. పురుగులు కనిపించగానే
వెంటనే ఈ పద్ధతి ట్రై చేయండి – చాలా ఎఫెక్టివ్!
పురుగులు, వాటి గుడ్లు పూర్తిగా తొలగాలంటే సన్నని రంధ్రాల జల్లెడతో పిండిని జల్లండి. ఇది కొంచెం టైమ్ తీసుకుంటుంది కానీ పిండి శుభ్రంగా వస్తుంది. పిండిని నిల్వ చేసే డబ్బాలో కొన్ని బిర్యానీ ఆకులు (తెజ్ పత్తా) లేదా 2-3 ఎండు మిరపకాయలు వేయండి. వాటి ఘాటు వాసనకు పురుగులు దూరంగా ఉంటాయి. అలాగే, పిండిని ఎయిర్టైట్ కవర్లో పెట్టి 4-5 గంటలు ఫ్రిజ్లో ఉంచితే చల్లదనానికి పురుగులు, గుడ్లు చనిపోతాయి.
IND vs NZ Final: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే!
పురుగులు మళ్లీ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి
పిండి డబ్బాలో 8-10 లవంగాల్ని అక్కడక్కడ వేయండి. లవంగంలో ఉండే యాంటీ-బాక్టీరియల్ గుణాలు పురుగుల్ని దూరంగా ఉంచుతాయి. బాగా ఎండిన వేపాకుల్ని చిన్న గుడ్డలో కట్టి పిండి మధ్యలో పెట్టండి.. పురుగులు అస్సలు రావు.. కొంచెం కల్లు ఉప్పును చిన్న గుడ్డలో కట్టి డబ్బాలో పెట్టండి. ఇది తేమను పీల్చుకుంటుంది, పురుగులు పట్టే అవకాశం తగ్గుతుంది. పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బల్ని 4-5 పిండిలో వేస్తే దాని వాసన కూడా పురుగులకు నచ్చదు.
ఇకపై పురుగులు రాకుండా జాగ్రత్తలు
పిండిని ఎప్పుడూ గాలి రాకుండా మూసే ఎయిర్టైట్ డబ్బాల్లోనే నిల్వ చేయండి. ఒకేసారి చాలా ఎక్కువ మొత్తంలో పిండి కొనకండి – తక్కువగా తీసుకొని త్వరగా ఉపయోగించండి. పాత పిండి ఎక్కువ కాలం ఉంచకండి, ఎందుకంటే పాతది త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది. కొనేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!