Food Tips : పురుగులు పట్టకుండా పిండి 6 నెలలు ఫ్రెష్గా ఉండాలంటే… ఈ ట్రిక్ మిస్ చేయకు.!
- పిండికి పురుగులు పడటానికి అసలు కారణం ఏమిటి?
- ఎండలో ఆరబెట్టడం ద్వారా తేమను తొలగించే చిట్కా
- బిర్యానీ ఆకులు, లవంగాలతో పురుగులు దూరం
- ఎయిర్టైట్ డబ్బాలతో పిండి ఎక్కువకాలం ఫ్రెష్గా ఉంచడం
మన వంటగదిలో బియ్యం, గోధుమ పిండి ఎప్పుడూ ఉంటాయి కదా.. చపాతీలు, రొట్టెలు, పూరీలు రోజూ ఉపయోగిస్తాం. కానీ ఒక్కసారి పిండికి పురుగులు పడితే సమస్యే.. తెల్లటి చిన్న పురుగులు (వీవిల్స్ అంటారు) కనిపిస్తాయి, పిండి వాసన వస్తుంది, పాడైపోతుంది. పురుగు పట్టిన పిండితో చేసిన రొట్టెలు తినడానికి కూడా మనసు రాదు. ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా అరికట్టాలో చూద్దాం.
పిండిలో పురుగులు రావడానికి ప్రధాన కారణం ఏంటి?
పిండికి పురుగులు పడటానికి అతి పెద్ద కారణం తేమ. వాతావరణం మారినప్పుడు – ముఖ్యంగా చలికాలం నుంచి వేసవికి, లేదా వర్షాకాలంలో – గాలిలో తేమ ఎక్కువవుతుంది. ఈ తేమ వల్ల పురుగులు, వాటి గుడ్లు సులభంగా పెరిగిపోతాయి. చల్లదనం కోసం పురుగులు పిండి వైపు ఆకర్షితమవుతాయి. ఇలాంటి సమయాల్లో పిండి త్వరగా పురుగు పట్టే అవకాశం ఎక్కువ.
Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!
పురుగుల్ని తొలగించడానికి సులభమైన సహజ మార్గాలు
ముందుగా తేమను తొలగించడం చాలా ముఖ్యం. వారానికి ఒకసారి పిండిని వెడల్పాటి పాత్రలో పలుచగా పరచి, 2-3 గంటలు ఎండలో పెట్టండి. సూర్యరశ్మి తేమను పూర్తిగా ఆరబెడుతుంది, పురుగులు బయటకు పారిపోతాయి లేదా చనిపోతాయి. పురుగులు కనిపించగానే
వెంటనే ఈ పద్ధతి ట్రై చేయండి – చాలా ఎఫెక్టివ్!
పురుగులు, వాటి గుడ్లు పూర్తిగా తొలగాలంటే సన్నని రంధ్రాల జల్లెడతో పిండిని జల్లండి. ఇది కొంచెం టైమ్ తీసుకుంటుంది కానీ పిండి శుభ్రంగా వస్తుంది. పిండిని నిల్వ చేసే డబ్బాలో కొన్ని బిర్యానీ ఆకులు (తెజ్ పత్తా) లేదా 2-3 ఎండు మిరపకాయలు వేయండి. వాటి ఘాటు వాసనకు పురుగులు దూరంగా ఉంటాయి. అలాగే, పిండిని ఎయిర్టైట్ కవర్లో పెట్టి 4-5 గంటలు ఫ్రిజ్లో ఉంచితే చల్లదనానికి పురుగులు, గుడ్లు చనిపోతాయి.
IND vs NZ Final: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే!
పురుగులు మళ్లీ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి
పిండి డబ్బాలో 8-10 లవంగాల్ని అక్కడక్కడ వేయండి. లవంగంలో ఉండే యాంటీ-బాక్టీరియల్ గుణాలు పురుగుల్ని దూరంగా ఉంచుతాయి. బాగా ఎండిన వేపాకుల్ని చిన్న గుడ్డలో కట్టి పిండి మధ్యలో పెట్టండి.. పురుగులు అస్సలు రావు.. కొంచెం కల్లు ఉప్పును చిన్న గుడ్డలో కట్టి డబ్బాలో పెట్టండి. ఇది తేమను పీల్చుకుంటుంది, పురుగులు పట్టే అవకాశం తగ్గుతుంది. పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బల్ని 4-5 పిండిలో వేస్తే దాని వాసన కూడా పురుగులకు నచ్చదు.
ఇకపై పురుగులు రాకుండా జాగ్రత్తలు
పిండిని ఎప్పుడూ గాలి రాకుండా మూసే ఎయిర్టైట్ డబ్బాల్లోనే నిల్వ చేయండి. ఒకేసారి చాలా ఎక్కువ మొత్తంలో పిండి కొనకండి – తక్కువగా తీసుకొని త్వరగా ఉపయోగించండి. పాత పిండి ఎక్కువ కాలం ఉంచకండి, ఎందుకంటే పాతది త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది. కొనేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి మహేశ్కు పాస్పోర్ట్ ఇచ్చేశాడా?
-
RCB vs DC: ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా నయా హిస్టరీ..
-
Melt Belly Fat: రోజూ ఉదయాన్నే ఈ 5 పనులు చేస్తే పొట్ట కరిగిపోవాల్సిందే!
-
Parachute Training: 50 అడుగుల ఎత్తులో పారాచూట్ ఫెయిల్.. ఇద్దరు సైనికులకు గాయాలు
-
PM Modi Apologizes: నారీ సారీ.. మహిళలకు క్షమాపణలు చెప్పిన ప్రధాని మోడీ
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!