Trump-Modi: మోడీకి ఫోన్ చేసి బెదిరించా.. పాక్తో యుద్ధం ఆపేశారు.. ట్రంప్ మళ్లీ అదే పాట
- మోడీకి ఫోన్ చేసి బెదిరించా
- పాక్తో యుద్ధం ఆపేశారు
- ట్రంప్ మళ్లీ అదే పాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచం వ్యాప్తంగా ఆరు యుద్ధాలను తానే ఆపానంటూ ట్రంప్ పదే పదే చెబుతుంటారు. ఇదే క్రమంలో భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని కూడా తానే ఆపానంటూ ట్రంప్ ఎక్కడికెళ్లినా చెబుతున్నారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలను భారత్ పలుమార్లు ఖండించింది. ఇరు దేశాల చర్చలతోనే కాల్పుల విరమణ జరిగిందని భారత్ చెబుతూనే ఉంటోంది. కానీ ట్రంప్ మాత్రం లేదు.. లేదు యుద్ధాన్ని ఆపింది తానేనంటూ చెప్పుకొస్తున్నారు. తాజాగా మరోసారి వైట్హౌస్ వేదికగా మంగళవారం అవే వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: UP: వరకట్న దాహానికి మరో అబల బలి.. భార్యను చంపిన కానిస్టేబుల్
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
మంగళవారం వైట్హౌస్లో కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తిరిగి భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ప్రస్తావించారు. భారత ప్రధాని మోడీకి స్వయంగా ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపించినట్లు చెప్పారు. ‘‘ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడాను. పాకిస్థాన్తో మీకు జరుగుతుందని మోడీని అడిగాను. ఆ తర్వాత పాక్తోనూ చర్చించా. అప్పటికే వారి మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి. ఇది సుదీర్ఘకాలం కొనసాగే ముప్పు ఉందని భావించా. అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండటంతో ఘర్షణలను ఆపాలని కోరా. లేదంటే భారత్, పాక్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించా. నేను విధించే భారీ సుంకాలతో మీ కళ్లు బైర్లు కమ్ముతాయని చెప్పా. కానీ ఐదు గంటల్లోనే అంతా సద్దుమణిగింది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Modi-Trump: టారిఫ్ ఉద్రిక్తతలు.. ట్రంప్ ఫోన్ కాల్స్ పట్టించుకోని మోడీ.. ఎన్ని సార్లు చేశారంటే..!
ట్రంప్ ప్రకటనలను భారత్ పదే పదే ఖండిస్తోంది. అయినా కూడా భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ చెబుతున్నారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు మూడో వ్యక్తి ప్రమేయం లేదని భారత్ ఇప్పటికే పలుమార్లు చెప్పింది. కానీ ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్నట్టుగా ట్రంప్ వ్యవహార శైలి ఉంటుంది.
ఇదిలా ఉంటే బుధవారం భారత్పై ట్రంప్ విధించిన 50 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. ఈ సుంకాలు కారణంగా అమెరికాతో దాదాపు సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం రష్యా, చైనాతో భారత్ సంబంధాలు పెంచుకుంటోంది. చైనాతో సంబంధాలు బలపడితే భారత్ ఆర్థికంగా పుంజుకోవచ్చని తెలుస్తోంది.
#WATCH | "…I am talking to a very terrific man, Prime Minister of India, Narendra Modi. I said what's going on with you and Pakistan. Then I am talking to Pakistan about trade. I said what's going on with you and India? The hatred was tremendous. This has been going on for a… pic.twitter.com/gJVOTmKjXN
— ANI (@ANI) August 27, 2025
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!