ఫలానా పాత్రకు ఎవరెవరిని తీసుకోవాలన్న నిర్ణయాలు.. దాదాపు దర్శకులే చేస్తారు. ఆయా పాత్రల్లో ఎవరు సెట్ అవుతారో దర్శకులుగా వాళ్లకి బాగా అవగాహన ఉంటుంది కాబట్టి, నిర్మాతలు వారికే ఆ బాధ్యతలు అప్పగిస్తారు. కానీ, పక్కా కమర్షియల్ సినిమా కోసం హీరోయిన్ విషయంలో తాను జోక్యం చేసుకున్నానంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కుండబద్దలు కొట్టారు నిర్మాత అల్లు అరవింద్. మారుతి తనకు కథ చెప్తున్నప్పుడు.. కథానాయిక పాత్రలో తనకు రాశీ ఖన్నానే కనిపించిందని, ఆమెనే ఇందులో…
పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తొలుత అభిమానుల్లో జోష్ నింపేశారు. తానొచ్చింది యూనిట్ కోసం కాదని, మీకోసమేనంటూ అభిమానుల్ని ఉద్దేశంచి చెప్పగానే.. ఆ వేదిక ఒక్కసారిగా ఫ్యాన్స్ కేరింతలతో హోరెత్తిపోయింది. ఈ సినిమా కోసం పని చేసిన వాళ్లందరూ తన కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లేనని, వాళ్ల కోసం తను తప్పకుండా రావాల్సిందేనని నిర్ణయించుకొని ఈ ఈవెంట్ కి వచ్చానన్నారు. అయితే.. ఈ ఈవెంట్ కి వచ్చి, మిమ్మల్ని…
‘పక్కా కమర్షియల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన గోపీచంద్.. తొలుత ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు తెలిపాడు. అలాగే గతంలో సినిమాల కోసం చిరు పడిన కష్టాల గురించి వేదికపై చెప్పుకొచ్చాడు. ఈరోజుల్లో తాము స్టంట్స్ చేయాలంటే, టెక్నికల్ గా ఎన్నో అందుబాటులో ఉన్నాయని.. కానీ అప్పట్లో రోప్స్ లేకుండానే చాలా కష్టపడ్డారని, అందుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని అన్నాడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనడానికి చిరు నిలువెత్తు నిదర్శనమని.. ఇప్పటికీ చాలామంది ఇండస్ట్రీలో రావడానికి…
మారుతి, గోపీచంద్ కాంబోలో రూపొందిన ‘పక్కా కమర్షియల్’ సినిమా జులై 1వ తేదీన విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను భారీఎత్తున హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన అడుగుపెట్టడమే ఆలస్యం.. వేదిక మొత్తం ఈలలు, అరుపులతో హోరెత్తిపోయింది. వేదికలో ఉన్న అభిమానులు మొత్తం ‘మెగాస్టార్’ అంటూ కేకలు వేశారు. కాసేపు అక్కడ సందడి వాతావరణం నెలకొంది.…
బుల్లితెర వీక్షకుల కోసం యాంకర్ కమ్ ప్రొడ్యూసర్ ఓంకార్ ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలను, షోస్ ను నిర్వహించాడు. తాజా ఈ క్రేజీ అండ్ పాపురల్ యాంకర్ ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు. అందుకు ఆహా వేదిక కానుండటం విశేషం. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఓంకార్ ‘డాన్స్ ఐకాన్’ అనే డాన్స్ షోకు శ్రీకారం చుట్టబోతున్నాడు. దీని గురించి ఓంకార్ మాట్లాడుతూ, ”ఆహా, ఓక్ ఎంటర్ టైన్మెంట్ కలిసి సమర్పిస్తున్న కార్యక్రమం ‘డాన్స్ ఐకాన్’. దీని ద్వారా…
గోపీచంద్ సాలీడ్ హిట్ అందుకొని చాలాకాలం అయింది. అయితే, ఈ హీరోకు ఇప్పుడు జూలై సెంటిమెంట్ కలిసొస్తుందా..! అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఆయన నటించిన సినిమాలు కొన్ని జూలైలో రిలీజై హిట్ అందుకున్నాయి. అందుకే, జూలై నెలలో రిలీజ్ కాబోతున్న ‘పక్కా కమర్షియల్స సినిమాకు కలిసొస్తుందని నమ్మకంతో ఉన్నారట. ‘యజ్ఞం’, ‘సాహసం’, ‘లక్ష్యం’.. లాంటి సినిమాలు జూలైలోనే రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచాయి. అందుకే, మరోసారి అదే సెంటిమెంట్ను రిపీట్ చేస్తూ…
ఇటీవల కాలంలో సినిమాలు విడుదలై రెండువారాలకే ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి. అవి చిన్న సినిమాలు అయితే ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఏకంగా స్టార్ హీరోల సినిమాలకే ఇలా జరుగుతోంది. అయితే ఓటీటీలో పే ఫర్ వ్యూ లెక్కన రిలీజ్ చేస్తున్న ఈ సినిమాలకు సరైన స్పందన కూడా రావటం లేదన్నది వేరే సంగతి. అయితే ఈ ట్రెండ్ థియేటర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందన్నది మెల్లమెల్లగా అందరికీ అర్థం అవుతోంది. అసలే స్టార్ హీరోల సినిమాలకు రేట్లు…
సినీ నిర్మాత అల్లు అరవింద్ సినిమా పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే సినిమాల పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది.కరోనా వైరస్ ఎఫక్ట్తో రెండేళ్ల పాటు.. జనం చాలావరకు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఏకంగా ఇంటి నుంచే పని మొదలు పెట్టారు. దీంతో జనం ఇంటి నుండే వినోదం కోరుకోవడంతో OTT ఊపందుకుంది. అందరూ OTT వేదికగా వెబ్ సిరీస్ లు , సినిమాలు విడుదల చేయడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు అదే సినీ…
టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. అల్లు అర్జున్ తండ్రిగా, గీతా ఆర్ట్స్ ప్రొడ్యూసర్ గా విజయవంతమైన బిజినెస్ మ్యాన్ గా టాలీవుడ్ లో ఆయనకొక గుర్తింపు ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలను నిర్మిస్తున్న గీతా ఆర్ట్స్ ఇటీవల ‘గని’ చిత్రంతో నష్టాలను చవిచూసిన విషయం విదితమే. ఇక ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం అల్లు అరవింద్ ఇండస్ట్రీపై సంచలనం వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.…
అచ్చ తెలుగు ఓటీటీ ‘ఆహా’ తన ప్రసార సామ్రాజ్యాన్నే కాదు… వివిధ భాషల్లోకీ విస్తరించడం మొదలు పెట్టింది. తెలుగు సినిమాలు, వెబ్ సీరిస్ లు, ఓటీటీ చిత్రాలతో పాటు డబ్బింగ్ మూవీస్ నూ ‘ఆహా’ ఓటీటీ తెలుగువారి ముంగిట్లోకి తీసుకొస్తోంది. అయితే తమ కార్యక్రమాలను తమిళంలోకీ విస్తరింప చేయాలని గత కొంతకాలంగా అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఈ యేడాది ఫిబ్రవరిలో లోగో లాంచ్ కార్యక్రమాన్ని చెన్నయ్ లో జరిపారు. ఇక ఈ రోజు తమిళ…