పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా కోసం ఇద్దరు అగ్ర సంగీత దర్శకులు చేతులు కలపడం అభిమానులకు డబుల్ ధమాకా అని చెప్పవచ్చు. ఈ సినిమాకి ఇప్పటికే రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలను అందించారు. ఇటీవల విడుదలైన ‘దేఖ్ లేంగే సాలో’, ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ వంటి ట్రాక్స్కి ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) బాధ్యతలను ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ చేపట్టనున్నారు.
Also Read : Ayesha Khan : రోజూ రేప్ చేస్తామంటున్నారు.. నటి సెన్సేషనల్ కామెంట్స్
సినిమా నిర్మాణంలో జరిగిన కొన్ని సాంకేతిక జాప్యాల కారణంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం కావాల్సిన రీల్స్ను పంపడంలో ఆలస్యమైంది. దీనివల్ల డీఎస్పీ ముందుగా అనుకున్న కాల్ షీట్స్, ఇతర ప్రాజెక్టుల బిజీ షెడ్యూల్ కారణంగా ఈ చిత్రానికి సమయం కేటాయించలేకపోయారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ.. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇకపై ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో పాటలు దేవి శ్రీ ప్రసాద్ మార్క్ మాస్ బీట్స్తో అలరించనున్నాయి. నేపథ్య సంగీతం (BGM) థమన్ తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్లకు పవర్ఫుల్ మ్యూజిక్ను అందించబోతున్నారు. నిర్మాతలు మరియు దర్శకుడు హరీష్ శంకర్ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా, సరైన సమయానికి థియేటర్లలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ‘మ్యూజికల్ కాంబినేషన్’ను సెట్ చేశారు. ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఒకే సినిమాకు పనిచేస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. టాక్సిక్ వాయిదాతో సినిమా ఒకవారం ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తమన్ ను రంగంలోకి దించారని తెలుస్తోంది.