Allu Aravind: స్టేజ్పై మహేష్ డాన్స్ చేయడానికి అసలు కారణం అదే.. అల్లు అరవింద్ హాట్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ నిర్మాత అల్లు అరవింద్ సినిమా పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే సినిమాల పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది.కరోనా వైరస్ ఎఫక్ట్తో రెండేళ్ల పాటు.. జనం చాలావరకు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఏకంగా ఇంటి నుంచే పని మొదలు పెట్టారు. దీంతో జనం ఇంటి నుండే వినోదం కోరుకోవడంతో OTT ఊపందుకుంది. అందరూ OTT వేదికగా వెబ్ సిరీస్ లు , సినిమాలు విడుదల చేయడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు అదే సినీ పరిశ్రమకు పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టింది, ప్రస్తుతం పరిస్థితి చక్కబడినా..జనం థియేటర్లకు వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. కొత్త సినిమా విడుదలైనా థియేటర్లకు వచ్చేందుకు అంతగా ఆసక్తి కనబరచడం లేదు. రెండు మూడు వారాల్లో OTT లోకి వచ్చేస్తుంది.. ఇంట్లోనే సినిమా చూసేద్దామన్న ఆలోచనలో పడ్డారు జనాలు . ఈక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.
సినిమాలు థియేటర్లలోనే చూడాలని సూచించారు నిర్మాత అల్లు అరవింద్. “టికెట్ రేట్లు తగ్గించాలి, OTT ని కాస్త దూరం పెట్టాలి” అంటూ సింపుల్ గా స్టేట్ మెంట్ ఇచ్చారు అరవింద్. సినీ పరిశ్రమ ఇప్పుడు నేర్చుకున్న పాఠం ఏమిటంటే.. టికెట్ రేట్లు తగ్గించాలి, OTT లలో ఆలస్యంగా సినిమా వేయాలని తెలిపారు. ఈ మధ్య ఆడియన్స్ థియేటర్స్ కు రావడంలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు..సినిమా ప్రమోషన్స్ కోసం హిరోలు కూడా రావాలన్నారు. ఈ మధ్య స్టేజ్ మీద ఓ పెద్ద హిరో డాన్స్ కూడా చేశాడని అన్నారు. ఆడియన్స్ థియేటర్స్ కు రప్పించడానికి హీరో, హీరోయిన్స్ ప్రమోషన్ చేసుకోవాలని చెప్పారు నిర్మాత అల్లు అరవింద్. ఇక ఇటీవలే సర్కారు వారి పాట సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమం కర్నూలు లో జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేజ్ పై మహేష్ బాబు తొలిసారిగ డాన్స్ వేసి తన ఫ్యాన్స్ ను అలరించారు.
Also Read
అయితే KGF, RRR వంటి బడా సినిమాలకు టికెట్ రేట్లు పెంచేశారు. అది నిర్మాతలకు వర్క్ అవుట్ అయ్యింది. కానీ అదే ప్లాన్ ఆచార్య విషయంలో బెడిసి కొట్టింది. దీంతో మొదటికే మోసం వచ్చిందని గ్రహించి టికెట్ రేట్లు మళ్లీ తగ్గించడం మొదలు పెట్టారు. F3 సినిమాకు సాధారణ టికెట్ రేట్లు ఉంచారు. ఇక మేజర్ సినిమాకైతే ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే తక్కువ ధరలకే టికెట్ రేట్లు ఫిక్స్ చేశారు. మరోవైపు OTT కూడా స్పీడ్ అందుకుంది. విడుదలైన వారం రోజులకే OTT లో స్ట్రీమింగ్ కు ఇచ్చేయడం లాంటివి జరిగాయి. దీంతో ప్రేక్షకులు థియేట్లకు దూరం అయ్యారు. అయితే తాజాగా అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలతో ప్రతీ సినిమాకు టికెట్ రేట్లు తగ్గే అవకాశం ఉందని టాలీవుడ్ లో జోరుగా చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!