ఐకాన్ స్టార్ అల్లు అర్జున నటించిన ‘సరైనోడు’ చిత్రం విడుదలై 5 ఏళ్ళు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఈ చిత్రానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “సరైనోడుకు 5 ఏళ్ళు. నా కెరీర్లో ఒక మైలురాయి ఈ చిత్రం. నా కెరీర్లో చిరస్మరణీయమైన చిత్రాలలో ఒకటిగా ‘సరైనోడు’ నిలిచినందుకు దర్శకుడు బోయపాటి శ్రీను,రకుల్ ప్రీత్, కేథరీన్ ట్రెసా, ఆది, థమన్, గీతాఆర్ట్స్… ఇంకా చిత్రబృందం, సిబ్బంది అందరికీ…