Telangana Congress : టీకాంగ్రెస్ లో హైదరాబాద్ జిల్లాల విభజన కొత్త తలనొప్పి తెచ్చిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Congress
జుట్టు ఉంటే ఎన్ని కొప్పులైనా పెట్టుకోవచ్చన్నట్టుగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. కాకపోతే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై ముందుగా మొదలయ్యేది తలనొప్పులే. కాంగ్రెస్ను గ్రేటర్ హైదరాబాద్లో బలోపేతం చేసేందుకు సంస్థాగతంగా 3 భాగాలుగా విభజించారు. ఈ నిర్ణయాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. నగరంలో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురావాలంటే మూడు ముక్కలు చేయాల్సిందేనని పార్టీ గట్టిగా భావించి అడుగులు వేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్లుగా విభజించేసింది.
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని భావిస్తోంది పీసీసీ. ఇన్నాళ్లూ నగరంలో పార్టీ బాధ్యతలను అంజన్కుమార్కు అప్పగించినా.. ఆశించిన ప్రయోజనం లేదని చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సైతం గ్రేటర్ హైదరాబాద్లో పూర్గానే ఉంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పార్టీకి సానుకూల వాతావరణం ఉంటే.. సిటీలో అంతా రివర్స్లో ఉందనేది గాంధీభవన్ వర్గాల టాక్. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే హైదరాబాద్ నగరం కూడా చాలా కీలకమన్నది పీసీసీ ఆలోచన. ప్రస్తుతం సిటీ పరిధిలో కాంగ్రెస్కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు.
ఖైరతాబాద్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు ఖైరతాబాద్ జిల్లాను ఏర్పాటు చేశారు. ఇక్కడ పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను రేవంత్కు సన్నిహితంగా ఉండే రోహిన్రెడ్డి, ఫిషర్మెన్ కాంగ్రెస్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ఆశిస్తున్నారు. ఇక హైదరాబాద్ జిల్లాలో చార్మినార్, బర్కత్పురా, మలక్పేట, యాకత్పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలు ఉన్నాయి. పార్టీ నేతలు ఫిరోజ్ఖాన్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు సోహైల్లు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి రెడీగా ఉన్నారు. సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్, సనత్నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాలు సికింద్రాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ పార్టీ బాధ్యతలను ఆశిస్తున్నవారిలో అంజన్ కుమార్ కుమారుడు అనిల్, పార్టీ నేతలు జగదీశ్వర్, ఉత్తమ్ కుమార్కు సన్నిహితంగా ఉండే ఆడం సంతోష్లు ఉన్నారు.
హైదరాబాద్లో కాంగ్రెస్ బలోపేతం కావాలంటే.. నేతల మధ్య పోటీ పెరగాలన్నది పీసీసీ పెద్దల అభిప్రాయంగా ఉంది. ఆలోచనలు అద్భుతంగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో నేతల మధ్య ఉన్న విభేదాలతో ఎంత వరకు ఫలితాలను అందుకుంటారన్నది పెద్ద ప్రశ్న. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదారు మినహాయిస్తే మిగతా చోట్ల పోటీ చేయడానికి చెప్పుకోదగ్గ లీడర్స్ లేరు. అక్కడ ఇంఛార్జులను సిద్ధం చేయడం.. ఆపై అభ్యర్థులను వెతకడం పెద్ద సవాలే. దానికంటే ముందు మూడు కొత్త జిల్లాలకు సారథుల ఎంపిక అంతకంటే సవాల్. మరి..ఈ సమస్యను పీసీసీ ఎలా అధిగమిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
-
Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!