Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Ysrcp 14

Off The Record : ఓటమి పాలయిన మారని చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు

Published Date :April 12, 2025 , 9:28 pm
By Gogikar Sai Krishna
Off The Record : ఓటమి పాలయిన మారని చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

అధికారంలో ఉన్నన్నాళ్ళు ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరించారు. ప్రతిపక్షానికి పరిమితం అయినా…అదే గ్రూపులు మెయింటెన్‌ చేస్తున్నారు. కలిసికట్టుగా పని చేయాల్సిన నేతలు…వర్గాలుగా విడిపోవడంపై సొంత పార్టీ నేతలు కస్సుమంటున్నారు. కేసులు…అరెస్టు భయాలు వెంటాడుతున్న నీ గురించి నేను మాట్లాడను…నా గురించి నువ్వు మాట్లాడొద్దు అనేలా వ్యవహరం మారిపోయింది. ఇంతకీ ఎవరా నేతలు ? ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీకి కంచుకోట. 2019లో 14 స్థానాలకు 13 స్థానాల్లో గెలిచింది. పార్టీకి అత్యధిక స్థానాలు గెలిపించిన జిల్లా మాత్రమే కాదు…ఎందరో కీలక సీనియర్‌ నేతలు చిత్తూరులోనే ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, మిధున్ రెడ్డి, రోజా, నారాయణస్వామి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మధుసూదన రెడ్ఢి లాంటి నేతలు జగన్‌కు సన్నిహితంగా మెలిగే వారే. 2019 ఎన్నికల తర్వాత నేతలు గ్రూపులుగా విడిపోతే…మరికొందరు నేరుగానే ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించారు. గత ఐదేళ్లుగా నగరి కేంద్రంగా జరిగిన రచ్చ అంతా కాదు. వాటి వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారంటూ రోజా బహిరంగంగానే ఆరోపణలు చేశారు. పెద్దిరెడ్డితో పాటు నారాయణస్వామితోనూ రోజాకు గొడవలు ఉండేవి. ఇక చెవిరెడ్డి. భుమన కరుణాకర్ రెడ్డి…సెపరేట్‌ టీమ్‌గా వ్యవహరించేవారు. ఆ గ్రూపులో రోజా కూడా చేరినట్టుగా మధ్యలో ప్రచారం సాగింది. అటు చెవిరెడ్డి వర్సెస్ పెద్దిరెడ్డి మధ్య అంతర్గత వార్‌ నడిచింది. ఇలా ఎవరికి వారే గ్రూపులుగా విడిపోవడంతో…గత ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు వచ్చాయి. కంచుకోట లాంటి చిత్తూరు జిల్లాలో ఇంతటి పరిస్థితి రావడానికి కారణం…నేతల మధ్య గొడవేనని కార్యకర్తలు వాదన.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా…చిత్తూరు జిల్లా వైసీపీ సీనియర్ నేతల్లో ఎలాంటి మార్పు రాలేదంటూ నేతలు, కార్యకర్తలు ఆవేదనలో మునిగిపోయారట. పైకి బాగానే ఉన్నట్టే కనిపిస్తున్నా…లోలోపల మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ జిల్లాలో పార్టీ పరిస్థితి మేడిపండులానే ఉందంటూ బహిరంగంగానే మాట్లాడుతున్నారట‌. దీనికి కారణం కొన్ని నెలలుగా జిల్లాలోని…ఆయా నేతలకు కేసులు, అరెస్టు భయాలు వెంటాడటమే కారణమని తెలుస్తోంది. అయినా కూడా ఒకరి గురించి ఒకరు…మాకెందుకులే అన్నట్లు మిన్నుకుండిపోతున్నారట. రోజాను ఆడుదాం ఆంధ్ర వ్యవహారం, పెద్దిరెడ్డికి లిక్కర్ స్కాం, ల్యాండ్ శ్యాండ్, మంగళంపేట అటవీ భూముల ఆక్రమణ, మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం అగ్ని ప్రమాద ఘటన వ్యవహారం వెంటాడుతున్నాయి‌. చెవిరెడ్డిని…తుడా నిధుల దుర్వినియోగం, భూమనకు టిడిఆర్ బాండ్ల విచారణ, నారాయణ స్వామికి లిక్కర్ కేసు టెన్షన్‌ పట్టుకుందట.

నీ కేసులు గురించి నాకెందుకు…నా కేసుల గురించి మీకెందుకు అన్నట్టుగానే ఉండడంపై జిల్లాలో వైసీపీ క్యాడర్‌కు మింగుడు పడటం లేదు. కనీసం ఓరల్ సపోర్టు కూడా ఇవ్వడానికి నేతలు వెనుకంజ వేయడంపై పార్టీకి డ్యామేజ్ కలిగిస్తుందనేది నేతల ఆవేదన. ఇప్పుడే ఇలా ఉంటే…ఒకవేళ అరెస్టులు పర్వమే మొదలైతే అప్పుడు కూడా ఆ పోతే పోనీలే మనకెందుకు అన్నట్లు ఉంటారా ? అని కేడర్‌ అనుమానం వ్యక్తం చేస్తోందట. కేసులు ఉన్న నేతలు అరెస్టయితే..తమకు ఎంత మేరకు లాభం చేకూరుతుందని కొందరు నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. ఇలాంటి నేతలపై జగన్ దృష్టి పెట్టకపోతే…పార్టీకి తీరని నష్టం కలుగుతుందని కొందరు నేతలు పార్టీ పెద్దలకు చెప్పినట్టు సమాచారం. చిత్తూరు నేతల వ్యవహారశైలిని వైసీపీ అధినేత కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chittoor
  • ntv
  • OTR
  • ycp

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions