Off The Record : అడ్రస్ లేకుండా పోయిన బీఆర్ఎస్ అభ్యర్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాడు ఎంపీ టికెట్ల కోసం పోటీ పడ్డారు. పార్టీ కార్యాలయంతో పాటు అధినేత చుట్టూ చక్కర్లు కొట్టారు. అధికారం కోల్పోయి…తాము ఓడిపోగానే…ముఖం చాటేశారు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరమయ్యారు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన నేతలు…అడ్రస్ లేకుండా పోయారు. పదేళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యం సాగించిన బిఆర్ఎస్కు…అధికారం కోల్పోగానే సొంత నాయకులే దూరమైపోతున్నారు. నాడు టికెట్ల కోసం తెలంగాణ భవన్ చుట్టూ ప్రదర్శనలు చేసిన ఎంపీ అభ్యర్ధులు…ఓటమి తరువాత ముఖం చాటేశారు. తెలంగాణ గళం, బలం ఢిల్లీలో వినిపించాలంటే…బిఆర్ఎస్ ఎంపీలు గెలవాలని గులాబీ బాస్ కేసీఆర్ భావించారు. సామాజిక సమీకరణాలు లెక్కలేసుకొని..సీట్లు కేటాయించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేకపోయింది. ఖమ్మం లోక్సభ నుంచి పోటీ నామా నాగేశ్వరరావు…ఎన్నికల తర్వాత తెలంగాణ భవన్ మెట్లు ఎక్కిన దాఖలాలే కనపడలేదు. భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేష్…ఎక్కడున్నారో తెలియడం లేదు. చేవెళ్ళ నుంచి పోటీ చేసిన కాసాని జ్ఞానేశ్వర్…పరిస్థితి అంతే. పాలమూరు నుంచి పోటీ చేసిన మన్నె శ్రీనివాస రెడ్డి…ఓడిపోయిన తర్వాత అసలు కనబడలేదు. ఇక హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగిన గడ్డం శ్రీనివాస్ యాదవ్, మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సక్కు…పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. జహీరాబాద్ అభ్యర్ధిగా పోటీ చేసిన గాలి అనిల్ కుమార్… పార్టీ ఓటమి తరువాత కాంగ్రెస్ గూటికి చేరారు.
అటు నల్లగొండ నుంచి పోటీ చేసిన కంచర్ల కృష్ణారెడ్డి భవన్ వైపు చూడడమే మానేశారు. అడపదడప ఏదో చిన్న చిన్న పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే ప్రత్యక్షం అవుతున్నారు. కరీంనగర్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశాలకే పరిమితం అవుతున్నారనే విమర్శను ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన పద్మారావు వాళ్ళ నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు. నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, వరంగల్ అభ్యర్థి మారపల్లి సుధీర్ కూమార్, మహబూబాబాద్ పోటీ చేసిన మాలోత్ కవిత… అడపాదడప పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే కవిత హైదరాబాద్ కే పరిమితం అవుతుందని విమర్శలు ఉన్నాయి. నాగర్కర్నూలు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి…మిగిలిన వారి కంటే యాక్టివ్ వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ చుట్టూ తెలంగాణ భవన్ చుట్టూ ప్రదర్శనలు చేసిన నాయకులు.. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత ముఖం చాటేశారు. బెల్లం ఉన్నప్పుడే ఈగలు వాలినట్లు…అధికారంలో ఉన్నప్పుడు ప్రదక్షిణలు చేశారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే…తెలంగాణ భవన్వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకులకే సీట్లు ఇస్తే…పార్టీకి పూర్వ వైభవం వస్తుందని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్చేస్తే..
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
తాజావార్తలు
-
Producer Narsamma: సినిమా తీసి సర్వం కోల్పోయాం.. ‘ప్రభాస్’ గారు మాకు మీరే దిక్కు: మహిళా రైతు నిర్మాత
-
Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్చేస్తే..
-
KCC New Rules 2026: కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాలలో అనుకూలం!
-
Gautham Gambhir: ఆ విజయాలతో గంభీర్ కి ఏం సంబంధం లేదు.. నిప్పు రాజేసిన శ్రీశాంత్ కామెంట్స్
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!