Malaria: దోమల ద్వారా సంక్రమించే మలేరియా వ్యాధి అమెరికాను గడగడలాడిస్తోంది. దాదాపుగా 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా యూఎస్ఏలో మలేరియా కేసులు నమోదు అవుతున్నాయి. రెండు నెలల్లో 5 కేసులు నమోదయ్యాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDS) ప్రకారం, నాలుగు కేసులు ఫ్లోరిడాలో కనుగొనబడ్డాయి. ఐదో కేసు టెక్సాస్ లో కొనుగొనబడింది. రోగులు విదేశాలకు వెళ్లిన దాఖలాలు లేకపోవడంతో ఈ వ్యాధి స్థానికంగానే సంక్రమించిందని వైద్యాధికారులు తెలిపారు.
Pune: తనతో సంబంధాన్ని నిరాకరించినందుకు ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ పై దాడికి తెగబడ్డాడు. మంగళవారం ఈ ఘటన పూణేలోని సదాశివపేట ప్రాంతంలో జరిగింది. బాధితురాలు, నిందితుడు ఇద్దరు మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. తనతో సన్నిహితంగా ఉండేందుకు నిరాకరించినందుకు సదరు వ్యక్తి యువతిపై దాడికి చేశాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Uttar Pradesh: 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తీవ్రగాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో హిందూ సంస్థలు, విశ్వహిందూ పరిషత్ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడంతో ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ బుల్డోజర్ యాక్షన్ తీసుకుంది. మంగళవారం ఫతేపూర్ లోని నిందితుడి ఇంటిని అధికారులు బుల్డోజర్ తో కూల్చేశారు.
PM Modi: 2014, 2019 ఎన్నికల్లో లేని భయం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల్లో కనిపిస్తోందని, 2024లో బీజేపీకి ఓటేయాలనే ప్రజల సంక్షల్పాన్ని విపక్షాలు చూస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
Lok Sabha Election 2024: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని NDA (నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్)ను అడ్డుకునేందుకు విపక్షాలు కూటమి కట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వారం పాట్నా వేదికగా బీహార సీఎం అధ్యక్షతన విపక్షాల సమావేశం జరిగింది.
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) నాయకురాలు మెహబూబా ముఫ్తీ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం రోజున 50 ఆర్ఆర్కు చెందిన ఆర్మీ దళాలు పుల్వామాలోని మసీదులోకి ప్రవేశించి, అక్కడి ముస్లింలను ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేయమని బలవంతం చేశారని ఆరోపించారు. రెచ్చగొట్టే విధంగా సైన్యం ప్రవర్తించిందని దీనిపై విచారణ ప్రారంభించాలని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘైనీని ఆమె కోరారు.
Russia: రష్యాకు వ్యతిరేకంగా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ అక్కడి ప్రభుత్వం, అధ్యక్షుడు పుతిన్ కి ఎదురుతిరిగారు. ఆ సంస్థ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ రష్యాలో మిలిటరీ పాలనను గద్దె దించుతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించాడు. అయితే ప్రస్తుతం బెలారస్ మధ్యవర్తిత్వంతో ఈ తిరుగుబాటు ముగిసింది.
PM Modi: భారతదేశంలో చీకటి అధ్యాయానికి 48 ఏళ్ల నిండాయి. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించింది. దీంతో ఈ చర్యను నిరసిస్తూ బీజేపీ, ఆ నాటి రోజుల్ని వ్యతిరేకించిన వారికి నివాళులు అర్పిస్తోంది
Pakistan: పాకిస్తాన్ దేశంలో మైనారిటీలపై దాడులకు అడ్డుకట్టపడటం లేదు. హిందువులు, సిక్కులపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్ నగరంలో సిక్కు వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు.
Cement Rates: గత కొంత కాలంగా సిమెంట్ రేట్లు పెరిగిపోతున్నాయి. సామాన్యుడి ఇల్లు కట్టుకునే కలను కలగానే మిగులుస్తున్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం సిమెంట్ ధరలు దిగి వస్తాయిని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. గత నాలుగేళ్లలో 4 శాతం వార్షికి వృద్ధి రేటుతో సిమెంట్ ధరలు పెరిగాయి. తాజా పరిణామాల వల్ల కొంత తగ్గుతాయని అంచాన వేస్తోంది.