Viral Video: బైకులో కనపడకుండా అంత డబ్బు ఎలా దాచవయ్యా.. ఇంత ట్యాలెంట్ గా ఉన్నావేంట్రా..!
- సోషల్ మీడియాలో వీడియో వైరల్.
- బైకులో 56.5 లక్షల మొత్తం నగదు.
- సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: దేశంలో ప్రతిరోజు అనేకచోట్ల ప్రజల వద్ద నుంచి అక్రమంగా లేదా సరైన లెక్కలు లేని ధనాన్ని పోలీసులు చెకింగ్ సమయంలో సీజ్ చేయడం చూసే ఉంటారు. ఇలాంటివి ఎక్కువగా ఎన్నికల సమయంలో కనబడుతుంటాయి. ప్రతిరోజు అనేకమంది వారికి వ్యాపారాల నిమిత్తం లేదా వేరే అవసరాలకైనా పెద్ద మొత్తంలో కొందరు డబ్బులను ఒకచోటి నుంచి మరొక చోటికి తరలిస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించి సరైన ఆధారాలు లేదా బిల్లులను చూపిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా లేనియెడల ఆ డబ్బును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. తాజాగా ఇలాంటి ఘటన తమిళనాడు-కేరళ రాష్ట్రాల సరిహద్దుల్లో చోటు చేసుకుంది.
Also Read
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
- Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
ఎప్పటిలాగే పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి అటుపై బైకులో వెళ్తుండగా.. పోలీసులను చూసి అతడు సడన్ గా బ్రేక్ వేసి వెంటనే యూటర్న్ తీసుకొని పారిపోవడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అనుమానం వచ్చి అతన్ని వెంటాడి పట్టుకున్నారు. అతడిని పోలీసులు ఎక్కడికి పోతున్నావని ప్రశ్నించగా.. అతడు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అతడిపై అనుమానం వచ్చింది. ఇంకేముంది అతడి వద్ద ఉన్న బైకులు క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా సీటుపై చేయి వేయగానే ఏదో కాస్త తేడా శబ్దం రావడంతో పోలీసులు బైక్ సీటును ఓపెన్ చేశారు. ఇంకేముంది ఒక్కసారిగా పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది.
ఆ బైకు సీటులో ఏకంగా లక్షల కొద్ది నోట్లో కట్టలు దర్శనమిచ్చాయి. అంతేకాదు ఆ బైక్ పెట్రోల్ ట్యాంకు ఉన్న చోట కూడా ఓ చిన్న రంధ్రంలో పెద్ద ఎత్తున 500 రూపాయల నోట్ల కట్టాలను ఉంచాడు. ఆ వ్యక్తిని పోలీసులు ఇంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించగా.. తాను బంగారు వ్యాపారనని, కోయంబత్తూర్ లో బంగారం ఆభరణాల అమ్మకం ద్వారా డబ్బులు వచ్చాయని అది తీసుకు వెళుతున్నట్టు తెలిపాడు.
ధరల బాంబు పేల్చిన Honda Cars India.. అమాంతం పెరగనున్న ఆ కార్ల ధరలు..!
ఇందుకు సంబంధించిన సరైన పత్రాలు చూపించకపోవడంతో ఆ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బైక్ లో ఏకంగా రూ 56.5 లక్షల మొత్తం నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ తర్వాత ఆదాయక పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇంకెందుకు ఆలస్యం.. డబ్బులను ఎలా బైకులో దాచిపెట్టాడో ఈ వీడియోలో మీరు కూడా చూసి, మీకు ఏమనిపించిందో ఓ కామెంట్ రూపంలో తెలపండి.
తాజావార్తలు
-
Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
-
Xiaomi TV FX Mini LED Series: షియోమి TV FX Mini LED సిరీస్ విడుదల.. Dolby Vision, Fire TV, 4K డిస్ప్లే
-
Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!