Lok Sabha Election 2024: ప్రతిపక్షాల కూటమి పేరు పీడీఏ..? అన్ని పక్షాలు అంగీకరించినట్లుగా టాక్..
Lok Sabha Election 2024: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని NDA (నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్)ను అడ్డుకునేందుకు విపక్షాలు కూటమి కట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వారం పాట్నా వేదికగా బీహార సీఎం అధ్యక్షతన విపక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన 17 పార్టీలు విభేదాలను పక్కనపెట్టి అంతా కూటమిగా పోరాడాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ కూటమి పేరును PDA(పేట్రియాటిక్ డెమొక్రాటిక్ అలయన్స్)గా పేరు పెట్టినట్లు సమాచారం. జూలై నెలలో సిమ్లాలో జరిగే సమావేశంలో అధికారికంగా ఈ పేరును ప్రకటించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఏ రాజకీయ పార్టీ కూడా స్పష్టత ఇవ్వలేదు. బహిరంగంగా ప్రకటించలేదు.
Read Also: Mehbooba Mufti: “జై శ్రీరాం” నినాదాలు చేయాలని ముస్లింలను సైన్యం బలవంతం చేసింది..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
శుక్రవారం పాట్నా వేదికగా జరిగిన ఈ సమావేశానికి ఎన్డీయేతర పార్టీలైన టీఎంసీ, ఆప్, కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, జేడీఎం, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు హాజరయ్యారు. జేడీయూ నుంచి సీఎం నితీష్ కుమార్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఆప్ నుంచి భగవంత్ మన్, అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ నుంచి సీనియర్ నేత శరద్ పవార్, కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు ఈ సమావేశానికి వచ్చారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా పోరాడాలని అంగకీరించాయి. అయితే విధివిధానాలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. తదుపరి సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఈ సమావేశంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. దొంగలంతా ఒకే చోటుకు చేరుతున్నారంటూ పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా ఆరోపించారు. పాట్నాలో ఫోటో సెషన్ జరిగిందిన కేంద్ర మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. బీజేపీని ఒంటరిగా ఎదుర్కోలేననే బహిరంగ రహస్యాన్ని కాంగ్రెస్ బయటపెట్టిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది.
తాజావార్తలు
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!