Lok Sabha Election 2024: ప్రతిపక్షాల కూటమి పేరు పీడీఏ..? అన్ని పక్షాలు అంగీకరించినట్లుగా టాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Election 2024: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని NDA (నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్)ను అడ్డుకునేందుకు విపక్షాలు కూటమి కట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వారం పాట్నా వేదికగా బీహార సీఎం అధ్యక్షతన విపక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన 17 పార్టీలు విభేదాలను పక్కనపెట్టి అంతా కూటమిగా పోరాడాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ కూటమి పేరును PDA(పేట్రియాటిక్ డెమొక్రాటిక్ అలయన్స్)గా పేరు పెట్టినట్లు సమాచారం. జూలై నెలలో సిమ్లాలో జరిగే సమావేశంలో అధికారికంగా ఈ పేరును ప్రకటించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఏ రాజకీయ పార్టీ కూడా స్పష్టత ఇవ్వలేదు. బహిరంగంగా ప్రకటించలేదు.
Read Also: Mehbooba Mufti: “జై శ్రీరాం” నినాదాలు చేయాలని ముస్లింలను సైన్యం బలవంతం చేసింది..
Also Read
- Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
- Yogi Adityanath: మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పించమంటారా.? అఖిలేష్కు సీఎం యోగి వార్నింగ్..
- Rahul Gandhi: ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికలు మనవే.. కానీ ఎన్నికలు సజావుగా జరగవు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
- Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
శుక్రవారం పాట్నా వేదికగా జరిగిన ఈ సమావేశానికి ఎన్డీయేతర పార్టీలైన టీఎంసీ, ఆప్, కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, జేడీఎం, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు హాజరయ్యారు. జేడీయూ నుంచి సీఎం నితీష్ కుమార్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఆప్ నుంచి భగవంత్ మన్, అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ నుంచి సీనియర్ నేత శరద్ పవార్, కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు ఈ సమావేశానికి వచ్చారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా పోరాడాలని అంగకీరించాయి. అయితే విధివిధానాలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. తదుపరి సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఈ సమావేశంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. దొంగలంతా ఒకే చోటుకు చేరుతున్నారంటూ పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా ఆరోపించారు. పాట్నాలో ఫోటో సెషన్ జరిగిందిన కేంద్ర మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. బీజేపీని ఒంటరిగా ఎదుర్కోలేననే బహిరంగ రహస్యాన్ని కాంగ్రెస్ బయటపెట్టిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది.
తాజావార్తలు
-
Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
-
Trump: రేపు ట్రంప్ 80వ బర్త్డే.. వైట్హౌస్లో ప్రత్యేక ఏర్పాట్లు
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Missing Girl: ఆ చిన్నారి నవ్వులు ఏ క్రూరులు లాగేసుకున్నారు..? అంతుచిక్కని తుని మిస్టరీ.. ఏం జరిగింది..?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!