Kerala: కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర.. తొలిసారి తిరువనంతపురంలో..!
- కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర
- వామపక్షాల కంచుకోటను బద్దలు కొట్టిన కాషాయ పార్టీ
- అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి బూస్టింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. నాలుగు దశాబ్దాల వామపక్షాల కంచుకోటను బద్దలు కొట్టింది. తొలిసారి తిరువనంతపురం మేయర్ స్థానాన్ని కాషాయ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ నేత వీవీ.రాజేష్ మేయర్గా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన పార్టీ కౌన్సిలర్లు వీవీ.రాజేష్ను మేయర్గా ఎంచుకున్నారు. దీంతో కేరళ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి బూస్ట్ వచ్చినట్లైంది.
ఇది కూడా చదవండి: Lalu Prasad Yadav: లాలూ ఫ్యామిలీకి ఝలక్.. ప్రభుత్వ బంగ్లా నుంచి వస్తువులు తరలింపు!
Also Read
- Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
- Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
వీవీ.రాజేష్కు 50 మంది బీజేపీ కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర సభ్యుడు మద్దతు తెలిపారు. దీంతో రాజేష్ మేయర్గా ఎన్నికై కొత్త చరిత్ర సృష్టించారు. ఇక యూడీఎఫ్ అభ్యర్థి కేఎస్ శబరినాథన్కు 17 ఓట్లు, ఎల్డీఎఫ్ మేయర్ అభ్యర్థి ఆర్పీ శివాజీకి 29 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో వామపక్షాల కంచుకోటను బీజేపీ బద్ధలు కొట్టింది.
వీవీ.రాజేష్ బ్యాగ్రౌండ్ ఇదే..
వీవీ.రాజేష్ (50) ప్రస్తుతం తిరువనంతపురం కార్పొరేషన్లో కౌన్సిలర్గా రెండోసారి పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొడుంగనూర్ వార్డు నుంచి 515 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. వృత్తిరీత్యా న్యాయవాది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. గతంలో తిరువనంతపురం జిల్లా అధ్యక్షుడిగా.. బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వట్టియూర్కావు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 39,596 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. సీపీఐ(ఎం) అభ్యర్థి వీకే ప్రశాంత్పై ఓడిపోయారు. 1996 నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. పార్టీ నిర్మాణం, ప్రజా జీవితంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఈ నేపథ్యమే మేయర్గా ఎన్నిక కావడానికి దారి తీశాయి.
Meet the BJP/NDA candidates for Mayor and Deputy Mayor of Thiruvananthapuram – Shri VV Rajesh and Smt. Asha Nath.
Both are committed karyakartas who are committed to serve the people of our capital city and solve the unsolved problems of decades.
And realize our goal of… pic.twitter.com/fwRrTaMmqB
— Rajeev Chandrasekhar 🇮🇳 (@RajeevRC_X) December 25, 2025
తాజావార్తలు
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
-
Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
-
Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
ట్రెండింగ్
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి