Venu Goapl Reddy
Author- NTV Telugu-
Covid-19 cases: భారత్లో కొత్తగా 628 కరోనా కేసులు.. 4000 దాటిన యాక్టీవ్ కేసుల సంఖ్య..
Covid-19 cases: దేశంలో కరోనా కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా కేసులం సంఖ్య పెరుగుతోంది. దీనికి కొత్త వేరియంట్ JN.1 కూడా కారణమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 22 JN.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. గోవాలో 21 కేసులు, కేరళలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. . -
Pakistan: పాకిస్తాన్లో మరొక టెర్రరిస్ట్ ఖతం.. ఈ సారి మాత్రం చంపే స్టైల్ మారింది..
Pakistan: పాకిస్తాన్లో ఉగ్రవాదులు బయలకు రావాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. టెర్రరిస్టులకు స్వర్గధామంగా ఉన్న పాక్లో జిహాదీలు భయపడి చస్తున్నారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చి చంపేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తులు బైకుపై వచ్చి, అత్యంత సమీపం నుంచి చంపిపారిపోవడం అక్కడ నిత్యకృత్యంగా మారింది. -
Israel-Hamas War: హమాస్ టెన్నెల్స్లో ఐదుగురు బందీల మృతదేహాలు.. గాజా దాడిలో 78 మంది మృతి
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. హమాస్ ఉగ్రసంస్థను నేలమట్టం చేసేదాకా యుద్ధాన్ని ఆపేది లేదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రపంచదేశాల నుంచి వస్తున్న ఒత్తిడిని సైతం లెక్క చేయకుండా హమాస్పై పోరుసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే గాజాలోని హమాస్ కీలక టన్నెల్ వ్యవస్థనున కుప్పకూల్చేందుకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఆ టన్నెల్స్ని సముద్ర నీరుతో ముంచేయాలని ప్లాన్ చేసింది. -
Christmas: ఏసుక్రీస్తు జన్మస్థలం బెత్లెహమ్లో “నో క్రిస్మస్”.. కారణం ఏంటంటే..?
Christmas: ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. కానీ ఏసు క్రీస్తు పుట్టిన బెత్లెహమ్లో మాత్రం ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు జరగడం లేదు. సాధారణంగా ప్రతీ ఏడాది క్రిస్మస్ పండగ రోజు బెత్లెహమ్ క్రీస్తు ఆరాధకులతో ఎంతో రద్దీగా ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం అక్కడి నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. హోటళ్లు, రెస్టారెంట్లు వ్యాపారం అంతా నిలిచింది. -
Atal Bihari Vajpayee: వాజ్పేయి జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోడీ.. పలువురు ప్రముఖులు..
Atal Bihari Vajpayee: మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. వాజ్పేయి 99వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పలువురు నివాళులు అర్పించారు. ఆయన స్మారక చిహ్నం ‘ సదైవ్ అటల్’ వద్దకు చేరుకున్న బీజేపీ నేతలు ఘనంగా నివాళి అర్పించారు. ప్రధానితో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాలు నివాళులు అర్పించారు. -
Delhi Airport: ఢిల్లీలో దట్టంగా పొగమంచు.. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం..
Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా పలు చోట్ల విజిబిలిటీ మందగించింది. పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయంలో రన్వే విజువల్ రేంజ్(ఆర్వీఆర్)ని పొగమంచు ప్రభావితం చేస్తుందని ఐఎండీ తెలిపింది. దీంతో విమానాల ల్యాండింగ్, టేకాఫ్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. సోమవారం ఉదయం 9.45 గంటల వరకు రన్ వే విజిబిటిలీ 500 మీటర్ల కంటే ఎక్కువగా ఉంది. -
France: ఫ్రాన్ నుంచి వెళ్లేందుకు 303 మంది భారతీయులకు అనుమతి.. ఎక్కడికి వెళ్తారనేది ఇంకా సందేహమే..
France: మానవ అక్రమ రవాణా అనుమానంతో దుబాయ్ నుంచి 303 మంది భారతీయులతో సెంట్రల్ అమెరికా దేశం నికరాగ్వాకు వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు అడ్డుకున్నారు. అయితే ప్రస్తుతం భారతీయులను ఫ్రాన్స్ నుంచి పంపించేందుకు అనుమతించినట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ఈ రోజు అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది. -
Delhi: వ్యక్తిని పొడిచి చంపిన ముగ్గురు మైనర్లు.. లైంగిక వేధింపులకు ప్రతీకారం..
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు మైనర్లు కలిసి ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. ఆ తర్వాత శవాన్ని ఎండు గడ్డితో కాల్చినట్లు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తి ముగ్గురు టీనేజ్ నిందితులలో ఒకరిపై మృతుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతీకారంగానే నిందితులు ముగ్గురు, అతడినిపై ప్రతీకారం తీర్చుకునేందుకు హత్య చేశారు. -
Bhagavad Gita: లక్ష మంది భగవద్గీత పఠనం.. బెంగాల్లో టీఎంసీ వర్సెస్ బీజేపీ
Bhagavad Gita: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్వహించిన ‘భగవద్గీత పఠనం’ బీజేపీ, టీఎంసీల మధ్య రాజకీయ దుమారాన్ని రేపుతోంది. బీజేపీ హిందూ ఐక్యతను ప్రోత్సహిస్తోందని, హిందూ ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కోల్కతాలో బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో భగద్గీత పఠనానికి లక్ష మంది ప్రజలు హాజరయ్యారు. భగవద్గీతలోని శ్లోకాలను పఠించారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ బీజేపీ యూనిట్, -
Seema Haider: భారత్-పాకిస్తాన్ “సరిహద్దు”పై ప్రశ్న..స్టూడెంట్ ఏం రాశాడో తెలుసా..? చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Seema Haider: భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు సంబంధించి పరీక్షలో ప్రశ్న అడగడం, దీనికి ఓ విద్యార్థి రాసిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజెన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. రాజస్థాన్ ధోల్పూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో పొలిటికల్ సైన్స్ పరీక్షల్లో ఓ ప్రశ్నకు విద్యార్థి రాసిన సమాధానం చూస్తే నవ్వాపుకోలేరు. అంతలా ఇంటర్నెట్ని ఆకట్టుకుంటుంది ఈ సమాధానం. విషయానికి వస్తే.. పరీక్షలో ‘‘ భారత్- పాకిస్తాన్ కే బీచ్ కౌన్సీ సీమా హై, లంబే […]
తాజావార్తలు
-
CJP Protest: సీజేపీ నిరసనల్లో మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుమార్తెకు లైంగిక వేధింపులు..
-
Anna Konidela: ఇకపై అన్నా లెజినోవా కాదు.. నన్ను ఇలా పిలవండి అంటూ పవన్ భార్య స్పెషల్ రిక్వెస్ట్!
-
Netanyahu: వస్తున్నా.. దమ్ముంటే అరెస్ట్ చేయండి.. న్యూయార్క్ మేయర్కు నెతన్యాహు సవాల్
-
Vastu Tips for Money: అప్పులు తీరాలంటే.. ఈ రూల్స్ పాటించండి.!
-
Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!