Pakistan: పెషావర్లో సిక్కు వ్యక్తికి కాల్చి చంపిన దుండగులు.. రెండు రోజుల్లో రెండో ఘటన
Pakistan: పాకిస్తాన్ దేశంలో మైనారిటీలపై దాడులకు అడ్డుకట్టపడటం లేదు. హిందువులు, సిక్కులపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్ నగరంలో సిక్కు వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి రషీద్ గర్హి నుంచి పెషావర్ లోని ఇంటీరియర్ సిటీ ప్రాంతానికి వెళ్తుండగా.. గుల్దారా చౌక్ కక్షల్ సమీపంలో కొందరు సాయుధ వ్యక్తులు అతనిపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతని ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
గత 48 గంటల్లో ఇది రెండో ఘటన. శనివారం యక్కా టూట్ ప్రాంతంలో సిక్కు వ్యక్తిపి ఇలాగే దాడి జరిగింది. శుక్రవారం జరిగిన దాడిలో సిక్కు వ్యక్తి కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. మార్చి నెలలో కూడా సిక్కు వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి హత్య చేశారు. ఖైబర్ ప్రావిన్సులో 15,000 మంది సిక్కులు పెషావర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఎక్కువగా నగరంలోని జోగన్ షా పరిసరాల్లో నివసిస్తున్నారు. పెషావర్ నగరంలో ఎక్కువ మంది సిక్కులు వ్యాపారంలో ఉన్నారు. వీటితో పాటు ఫార్మసీలను నిర్వహిస్తున్నారు.
Also Read
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
Read Also: Dowry Harassment: పెళ్లైన ఏడాదికే వివాహిత ఆత్మహత్య.. ఆ వేధింపులు భరించలేకే..
గతేడాది సెప్టెంబర్ లో ప్రముఖ సిక్కు హకీమ్ (యునానీ మెడికల్ ప్రాక్టీషనర్)ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 2018లో, ప్రముఖ సిక్కు కమ్యూనిటీ సభ్యుడు చరణ్జిత్ సింగ్ను పెషావర్లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అదేవిధంగా, న్యూస్ ఛానెల్ యాంకర్ రవీందర్ సింగ్ 2020లో నగరంలో హత్యకు గురయ్యారు. 2016లో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేషనల్ అసెంబ్లీ సభ్యుడు సోరెన్ సింగ్ కూడా పెషావర్లో హత్య చేయబడ్డాడు.
పాకిస్తాన్ జనాభాలో 75 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. మైనారిటీల్లో ఆ తరువాత స్థానాల్లో క్రైస్తవులు, సిక్కులు ఉన్నారు. హిందువులు కూడా పాకిస్తాన్ లో హింసకు గురవుతున్నారు. ముఖ్యంగా హిందువులు ఎక్కువగా సింధ్ ప్రావిన్సులో నివసిస్తున్నారు. ఇక్కడ హిందూ బాలికను కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మార్చి, ముస్లిం వ్యక్తులకు ఇచ్చి వివాహం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!