Pakistan: పెషావర్లో సిక్కు వ్యక్తికి కాల్చి చంపిన దుండగులు.. రెండు రోజుల్లో రెండో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ దేశంలో మైనారిటీలపై దాడులకు అడ్డుకట్టపడటం లేదు. హిందువులు, సిక్కులపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్ నగరంలో సిక్కు వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి రషీద్ గర్హి నుంచి పెషావర్ లోని ఇంటీరియర్ సిటీ ప్రాంతానికి వెళ్తుండగా.. గుల్దారా చౌక్ కక్షల్ సమీపంలో కొందరు సాయుధ వ్యక్తులు అతనిపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతని ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
గత 48 గంటల్లో ఇది రెండో ఘటన. శనివారం యక్కా టూట్ ప్రాంతంలో సిక్కు వ్యక్తిపి ఇలాగే దాడి జరిగింది. శుక్రవారం జరిగిన దాడిలో సిక్కు వ్యక్తి కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. మార్చి నెలలో కూడా సిక్కు వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి హత్య చేశారు. ఖైబర్ ప్రావిన్సులో 15,000 మంది సిక్కులు పెషావర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఎక్కువగా నగరంలోని జోగన్ షా పరిసరాల్లో నివసిస్తున్నారు. పెషావర్ నగరంలో ఎక్కువ మంది సిక్కులు వ్యాపారంలో ఉన్నారు. వీటితో పాటు ఫార్మసీలను నిర్వహిస్తున్నారు.
Also Read
- Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
- Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
- Pakistan Minister: "చేతులు నరికేస్తాం".. సింధు జలాల విషయంలో భారత్కు పాక్ మంత్రి వార్నింగ్!
- Indian Army: అరుణాచల్లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
Read Also: Dowry Harassment: పెళ్లైన ఏడాదికే వివాహిత ఆత్మహత్య.. ఆ వేధింపులు భరించలేకే..
గతేడాది సెప్టెంబర్ లో ప్రముఖ సిక్కు హకీమ్ (యునానీ మెడికల్ ప్రాక్టీషనర్)ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 2018లో, ప్రముఖ సిక్కు కమ్యూనిటీ సభ్యుడు చరణ్జిత్ సింగ్ను పెషావర్లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అదేవిధంగా, న్యూస్ ఛానెల్ యాంకర్ రవీందర్ సింగ్ 2020లో నగరంలో హత్యకు గురయ్యారు. 2016లో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేషనల్ అసెంబ్లీ సభ్యుడు సోరెన్ సింగ్ కూడా పెషావర్లో హత్య చేయబడ్డాడు.
పాకిస్తాన్ జనాభాలో 75 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. మైనారిటీల్లో ఆ తరువాత స్థానాల్లో క్రైస్తవులు, సిక్కులు ఉన్నారు. హిందువులు కూడా పాకిస్తాన్ లో హింసకు గురవుతున్నారు. ముఖ్యంగా హిందువులు ఎక్కువగా సింధ్ ప్రావిన్సులో నివసిస్తున్నారు. ఇక్కడ హిందూ బాలికను కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మార్చి, ముస్లిం వ్యక్తులకు ఇచ్చి వివాహం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!