Madras High Court: 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్.. ఆస్ట్రేలియా చట్టాన్ని పరిశీలించండి..
- 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్..
- ఆస్ట్రేలియా లాంటి చట్టాన్ని పరిగణించండి..
- కేంద్రాన్ని కోరిన మద్రాస్ హైకోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madras High Court: ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ విధించింది. అయితే, ఆస్ట్రేలియా లాంటి చట్టాన్ని భారత్లో పరిశీలించాలని మద్రాస్ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. పిల్లలు ‘అశ్లీల’ కంటెంట్కు గురికాకుండా నిరోధించడానికి ఇంటర్నెట్ ప్రొవైడర్ సర్వీస్ కంపెనీలకు ‘పేరెంటల్ విండో’ అందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన రిటి పిటిషన్పై విచారణ సందర్భంలో హైకోర్టు ఈ వ్యాఖ్యల్ని చేసింది. జస్టిస్ జి జయచంద్రన్, కెకె రామకృష్ణన్లతో కూడిన మధురై ధర్మాసనం, సురక్షితమైన ఇంటర్నెట్ వాడకంపై, ముఖ్యంగా పిల్లలు, వారి తల్లిదండ్రులలో అవగాహన కల్పించే ప్రచారాన్ని వేగవంతం చేయాలని బాలల హక్కుల సంబంధిత అధికారులకు సూచించింది.
ఇంటర్నెట్ డివైజ్లలో పేరెంటల్ విండో ఉండటం వల్ల పిల్లలకు అందుబాటులో ఉండే అభ్యంతరకరమైన అశ్లీల మెటిరియల్ ముప్పును గణనీయంగా నియంత్రించవచ్చని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 16 ఏళ్లలోపు పిల్లలు ఇంటర్నెట్ను ఉపయోగించకుండా నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన చట్టాన్ని కూడా ఆ న్యాయవాది ప్రస్తావించారు. కేంద్రం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చని కోర్టుకు విన్నవించారు. యూజర్ స్థాయిలో నియంత్రణ ఉండాలని, డివైజ్లో పేరెంట్ కంట్రోల్ యాప్ అందుబాటులో ఉంటేనే ఇది సాధ్యమవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
Read Also: Bollywood : ధురంధర్ సక్సెస్.. బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ నుండి వైదొలిగిన రణవీర్, అక్షయ్ కన్నా
పిల్లలు చాలా సున్నితంగా ఉంటారని, తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువగా ఉందని న్యాయమూర్తులు నొక్కి చెప్పారు. పిటిషనర్ సూచనల్ని పరిగణలోకి తీసుకుంటూ.. ఆస్ట్రేలియా లాంటి చట్టాన్ని ఆమోదించే అవకాశాన్ని పరిశీలించాలని, చట్టం ఆమోదించే వరకు క్షేత్రస్థాయిలో మరింత ప్రభావవంతమైన అవగాహన తప్పనిసరి అని వారు చెప్పారు. పిల్లల అశ్లీలత ముప్పు గురించి మరింత అవగాహన కల్పించడానికి జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్, తమిళనాడు బాలల హక్కుల రక్షణ కమిషన్ ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, దానిని అమలు చేస్తాయని ధర్మాసనం ఆశాభావం వ్యక్తి చేసింది.
16 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలించింది. గతేడాది ఈ చట్టాన్ని ఆస్ట్రేలియా ఆమోదించింది. డిసెంబర్ 10 నుంచి 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యూజర్లకు సోషల్ మీడియాను నిషేధించింది. ఈ సంస్కరణలు ఆస్ట్రేలియాలో పిల్లల జీవితాలను మారుస్తాయని, వారి బాల్యాన్ని గడపడానికి వీలు కల్పిస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అన్నారు. అయితే, యూట్యూబ్, మెటా వంటి సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు ఈ నిషేధాన్ని ఖండించాయి. చాలా మంది టీనేజర్లు కూడా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు.
తాజావార్తలు
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!