Transfers : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ
- 11 మంది కమిషనర్ల బదిలీ
- MA&UD శాఖ ఉత్తర్వులు
- కొత్త పోస్టింగ్లు ఖరారు
- పురపాలక పరిపాలన బలోపేతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Transfers : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పరిపాలన విభాగంలో ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న 11 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ, వారికి కొత్త పోస్టింగ్లు కల్పిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనను మరింత వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఉత్తర్వుల ప్రకారం, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ బాధ్యతలను డి. పావనికి అప్పగించగా, అనంతపురం డిప్యూటీ కమిషనర్ పోస్టులో ఎం. అంజయ్య నియమితులయ్యారు. అలాగే, నరసాపూర్ మున్సిపల్ కమిషనర్గా ఆర్. వెంకట్రామిరెడ్డి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్గా యు. శారదాదేవిని ప్రభుత్వం నియమించింది. కృష్ణా జిల్లా పెడన మున్సిపల్ కమిషనర్గా డి. కొండయ్య బాధ్యతలు చేపట్టనున్నారు.
Also Read
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
Kerala: కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర.. తొలిసారి తిరువనంతపురంలో..!
మరికొన్ని కీలక మార్పులను పరిశీలిస్తే, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ సహాయ కమిషనర్గా ఎం. మంజునాథ్ గౌడ్, రాజంపేట మున్సిపల్ కమిషనర్గా లక్ష్మీనారాయణ, గ్రేటర్ విశాఖ (GVMC) జోనల్ కమిషనర్గా వి. ఇపి నాయుడులను కేటాయించారు. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కమిషనర్గా డానియల్ జోషప్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు అక్కడ బాధ్యతలు నిర్వహించిన అబ్దుల్ రషీద్ను బదిలీ చేస్తూ, ఆయనను తక్షణమే ఎంఏయూడి (MA&UD) కమిషనరేట్లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్గా జి. వెంకట రామిరెడ్డి బాధ్యతలు స్వీకరించనుండగా, ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న ఎస్. బేబిని ఆమె మాతృశాఖ అయిన రెవెన్యూ విభాగానికి ప్రభుత్వం వెనక్కి పంపింది. కనిగిరి మున్సిపల్ కమిషనర్గా పి. శ్రీధర్ నియామకం కాగా, ప్రస్తుత కమిషనర్ పి. కృష్ణమోహన్ రెడ్డిని సాధారణ పరిపాలన శాఖ (GAD)లో రిపోర్టు చేయాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో మున్సిపల్ యంత్రాంగాన్ని బలోపేతం చేసే క్రమంలో ఈ బదిలీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
KTR: నేను మా నాన్న పేరు చెప్పుకుంటే తప్పేమిటి?.. తెలంగాణ తెచ్చిన మొనగాని పేరు చెప్పుకుంటే తప్పా?
తాజావార్తలు
-
Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
-
Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
-
Karuppu : వీరవిహారం చేస్తున్న వీరభద్రుడు.. వర్కింగ్ డే రోజు భారీ వసూళ్లు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!