NEET: నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడులో డీఎంకే సంతకాల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి వ్యతిరేకంగా తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల ప్రచారాన్ని ప్రారంభించింది. సీఎం ఎంకే స్టాలిన్ తొలి సంతకం చేశారు. నీట్ పరీక్షను గత కొంత కాలంగా తమిళనాడు వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా అధికార డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్ ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రచారం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల్లో 50 లక్షల సంతకాలు సేకరించాలని డీఎంకే లక్ష్యంగా పెట్టుకుంది.
నీట్ పరీక్షను బీజేపీ రాజకీయం చేసిందని ఆరోపిస్తూ.. గత కొన్ని నెలలుగా నీట్ పరీక్ష నిర్వహణకు వ్యతిరేకంగా స్టాలిన్ నిరసనలు తెలుపుతున్నారు. నీట్ సామాజిక విరుద్ధమని, ఇది పట్టణ విద్యార్థులకు, కోచింగ్ సెంటర్లలో చదువుకునే అవకాశం ఉన్న విద్యార్థులకు మాత్రమే అనుకూలంగా ఉందని డీఎంకే పార్టీ ఆరోపిస్తోంది. నీట్ పరీక్ష కారణంగా తమిళనాడు వ్యాప్తంగా 22 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. గతంలో డీఎంకే పార్టీ నీట్ పరీక్షను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఒక రోజు నిరాహార దీక్ష చేసింది.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
Read Also: Israeli–Palestinian conflict: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఇరాన్ ఎంటరైతే..!
పరీక్షకు వ్యతిరేకంగా డీఎంకే ఈ సిగ్నేచర్ క్యాంపెన్ ప్రారంభించింది. ఈ సంతకాల పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపనున్నారు. రాష్ట్ర మంత్రి, సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నీట్ నుంచి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) వరకు ఫాసిస్టులు మా విద్యాహక్కును హరించడానికి ప్రయత్నిస్తున్నారు, మేము వారిపై నిరంతరం పోరాడుతాము, నీట్ నిషేధించాలన్న మా డిమాండును వ్యతిరేకిస్తే జల్లికట్టు తరహాలో పెద్ద ఎత్తున నిరసన చేపడుతామని కేంద్ర ప్రభుత్వానికి ఉదయనిధి హెచ్చరికలు చేశారు. అన్నాడీఎంకే పార్టీ, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి కూడా ఈ ఉద్యంలో పాల్గొనాలని ఆయన కోరారు. తమిళనాడు హక్కుల్ని కాపాడుకునేందుకు బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చామని చెబుతున్న ఏఐడీఎంకే పార్టీ కూడా ఈ ప్రచారంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!