Mahua Moitra: మహువా మోయిత్రా ఢిల్లీలో ఉంటే, దుబాయ్లో ఎలా లాగిన్ అయ్యారు..? బీజేపీ ఎంపీ మరో ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ‘ ప్రశ్నకు డబ్బు’ కేసులో చిక్కుకుపోయారు. వ్యాపారవేత్త నుంచి డబ్బులు, విలువైన గిఫ్టులను తీసుకుని పార్లమెంట్లో అదానీ గ్రూపుకు వ్యతిరేకంగా, ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడిగారనే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి సదరు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి లేఖ రాయడంతో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. లేఖలో ఎంపీ మహువామోయిత్రా తనతో చేయకూడని పనులు చేయించిందని ఆయన ఆరోపించారు.
Read Also: Swiss woman’s murder: ఢిల్లీలో స్విట్జర్లాండ్ మహిళ హత్య.. అనుమానమే కారణం..
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
దీంతో పాటు మహువా మోయిత్రా తన వ్యక్తిగత పార్లమెంట్ లాగిన్ ఐడీని ఇతరులకు అప్పగించిందని నిషికాంత్ దూబే ఆరోపించిన నేపథ్యంలో తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు. మహుమా మోయిత్రా భారతదేశంలో ఉన్నప్పుడు దుబాయ్ నుంచి ఆమె పార్లమెంట్ ఐడీని ఉపయోగించారని, ఈ విషయాన్ని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్(ఎన్ఐసీ), విచారణ సంస్థలకు అందించిందని నిషికాంత్ దూబే ఆమె పేరును నేరుగా ప్రస్తావించకుండా పరోక్షంగా అన్నారు. ఇప్పటికీ ఈ వ్యవహారంపై టీఎంసీ, ఇతర ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని అనుకుంటున్నాయా.? ఇక దీనిపై నిర్ణయం ప్రజలదే అని నిషికాంత్ దూబే మహువా పేరు చెప్పకుండా పరోక్షంగా ఆరోపణలు చేశారు.
ఒక ఎంపీ దేశ భద్రతను డబ్బుల కోసం తాకట్టు పెట్టారు, ఎంపీ భారత్ లో ఉన్నప్పుడు దుబాయ్ నుంచి ఐడీ ఓపెన్ చేసింది. ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ, కేంద్ర సంస్థలు సహా మొత్తం భారత ప్రభుత్వం ఈ ఎన్ఐసీని ఉపయోగిస్తుంది అని ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాకు, కేంద్ర ఐటీ శాఖ మంత్రికి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లేఖలు రాశారు.
తాజావార్తలు
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!