Venu Goapl Reddy
Author- NTV Telugu-
Deepfake video: సచిన్ టెండూల్కర్ డీప్ఫేక్ వీడియోపై స్పందించిన కేంద్ర ఐటీ మంత్రి..
Deepfake video: ఇటీవల కాలంలో దేశంలో ప్రముఖుల డీప్ఫేక్ వీడియోలో ఆందోళన కలిగిస్తు్న్నాయి. ఏఐ టెక్నాలజీ సాయంతో వీడియోలను మార్ఫింగ్ చేస్తున్నారు. గతంలో రష్మికా మందన్న, కత్రినా కైఫ్, కాజోల్ వంటి మూవీ స్టార్స్ డీప్ఫేక్కి బారినపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా క్రికెట్ స్టార్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా డీప్ఫేక్ బాధితుడయ్యారు. సచిన్ ఆన్లైన్ గేమ్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వాయిస్తో ఓ వీడియో వైరల్ అవుతోంది. డీప్పేక్ టెక్నాలజీతో ఈ వీడియోను రూపొందించారు. దీనిపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. సోషల్… -
Vegetarian Hotel: ప్రపంచంలో మొట్టమొదటి సెవన్ స్టార్ వెజిటేరియన్ హోటల్ అయోధ్యలోనే..
Vegetarian Hotel: భవ్య రామమందిర నిర్మాణంతో అయోధ్య రూపురేఖలు మారిపోతున్నాయి. రానున్న కాలంలో ప్రముఖ పర్యాటక క్షేత్రంగా, ప్రపంచంలోనే తీర్థయాత్ర గమ్యస్థానంగా మార్చేందుకు ఉత్తర్ ప్రదేశ్ కృషి చేస్తోంది. జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరగబోతోంది. -
Shiv Sena: శివసేన పార్టీపై సుప్రీంకోర్టుకు ఉద్ధవ్ ఠాక్రే..
Shiv Sena: మహారాష్ట్రలో శివసేన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజమైన శివసేన తమదే అంటూ ఇటు ఉద్ధవ్ ఠాక్రే, అటు సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు పోటీ పడుతున్న నేపథ్యంలో ఇటీవల స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. నిజమైన శివసేన ఏక్నాథ్ షిండే వర్గమే అని తీర్పు చెప్పారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ.. ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
Man plugs kettle in train: రైలులోని మొబైల్ ఛార్జింగ్ సాకెట్లో నీటిని మరిగించేందుకు కెటిల్ పెట్టాడు.. ఆ తర్వాత జరిగింది ఇది..
Man plugs kettle in train: కదులుతున్న ట్రైన్లో ప్రయాణికుడు తెలియక చేసిన తప్పిదం అతను అరెస్ట్ అయ్యేందుకు కారణమైంది. రైలులో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కోసం వాడే సాకెట్ని నీటిని వేడిచేసుకునేందుకు ఎలక్ట్రిక్ కెటిల్ కోసం వాడాడు. దీంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. ఈ ఘటన జరిగిన తర్వాత సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. -
Maldives Row: భారత్తో వివాదం నేపథ్యంలో చైనా, జిన్పింగ్పై మాల్దీవ్స్ అధ్యక్షుడి ప్రశంసలు..
Maldives Row: భారత్-మాల్దీవుల మధ్య వివాదం నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనా, ఆ దేశ అధ్యక్షుడు జి జిన్పింగ్పై ప్రశంసలు కురిపించాడు. చైనాతో తమ దేశ సంబంధాల గురించి గొప్పగా చెప్పారు. రెండు దేశాలు ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నాయని.. మాల్దీవ్స్ సార్వభౌమాధికారానికి పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. 1972లో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నప్పటి నుండి మాల్దీవుల అభివృద్ధికి చైనా సహాయం అందించిందని ప్రశంసలు కురిపించాడు. -
Artificial intelligence(AI): ఏఐలో 40 శాతం ఉద్యోగాలు ఖతం.. ఐఎంఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Artificial intelligence(AI): భవిష్యత్ కాలమంతా టెక్నాలజీదే. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) విస్తరిస్తోంది. ప్రతీ రంగంలో కూడా రానున్న కాలంలో ఏఐ కీలక ప్రభావం చూపించనుంది. అయితే ఏఐ వల్ల ప్రమాదం ఉందనే టెక్ ప్రముఖులు కూడా ఉన్నారు. మరికొందరు దీని వల్ల ప్రజల జీవితం మరింతగా సులువు అవుతుందని మరికొందరు చెబుతున్నారు. ఎలా ఉన్నా ఏఐ పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉద్యోగులపై ప్రభావం తప్పకుండా ఉంటుందని పలువరు ప్రముఖులు చెబుతున్నారు. Read […] -
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట విషాదం..
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమిత్ షా అక్క రాజుబెన్ సోమవారం ముంబైలోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గత కొన్ని నెలల క్రితం ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమెకు లంగ్స్ మార్పిడి జరిగింది. ఈ సర్జరీ తర్వాత ఆమె కోలుకునే దశలో ఉన్నారు. ఈలోపే ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించారు. -
Kite String Slits Throat: గాలిపటం దారం గొంతును కోయడంతో 4 ఏళ్ల బాలుడి మృతి..
Kite String Slits Throat: గాలి పటాలు ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా మరో పిల్లాడు గాలిపటానికి బలైపోయాడు. గుజరాత్ రాష్ట్రంలోని మహిసాగర్ జిల్లాలో గాలిపటం దారం గొంతును కోయడంతో తీవ్ర రక్తస్రావంతో 4 ఏళ్ల పిల్లాడు మరణించాడు. ఉత్తరాయణ పండుగ(మకర సంక్రాంతి) గాలిపటాలను ఎగరేస్తుంటారు. అయితే ఈ సరదా పలువురి పాలిట శాపంగా మారుతోంది. -
Tamil Nadu: త్యాగమూర్తివమ్మ..కోట్ల విలువైన భూమి పాఠశాలకు విరాళం..
Tamil Nadu: సామాన్యంగా గజం భూమిని కూడా ఫ్రీగా ఇచ్చే రోజులు కావు. భూమి అంటే గౌరవం.. తులం బంగారం పోయినా పర్వాలేదు కానీ, ఇంచు భూమి కోసం హత్యలు జరిగే కాలం ఇది. అయితే తమిళనాడులో ఓ మహిళ మాత్రం చేసిన పనిని చూస్తే నువ్వు త్యాగమూర్తివమ్మ అని అనకుండా ఉండలేదు. ఏకంగా కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వ పాఠశాల కోసం విరాళంగా ఇచ్చేసింది. -
China-Taiwan Conflict: అలాంటి చర్యలకు పాల్పడితే తైవాన్ని కఠినంగా శిక్షిస్తాం.. చైనా వార్నింగ్..
China-Taiwan Conflict: తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకి అయిన లై చింగ్-తే అధ్యక్షుడిగా విజయం సాధించడం డ్రాగన్ కంట్రీకి మింగుడుపడటం లేదు. లీ చింగ్-తే గెలిచినప్పటి నుంచి తైవాన్ని బెదిరించేందుకు చైనా ప్రకటనలు చేస్తోంది. చైనా హెచ్చరికలను ధిక్కరిస్తూ.. సార్వభౌమాధికారం, స్వాతంత్య్రం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తీవ్రంగా శిక్షించబడుతుందని చైనా విదేశాంగ మంత్రి ఆదివారం హెచ్చరించారు.
తాజావార్తలు
-
High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
-
KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
-
Iran: ఉరిశిక్షలతో హడలెత్తిస్తున్న ఇరాన్..
-
Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్’ వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
-
Lavanya : మా రామ్ చరణ్ బావకి థాంక్స్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!