Rahul Gandhi: పుల్వామా, అదానీ గురించి సత్యపాల్ మాలిక్ నాతో చర్చించారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మధ్య జరిగిన సమావేశం గురించి ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నారు. తామిద్దరం పుల్వామా దాడి, జమ్మూ కాశ్మీర్లో పరిస్థితుల గురించి చర్చించినట్లు వెల్లడించారు. అదానీ వ్యవహారం గురించి చర్చించినట్లు వెల్లడించారు. ఇద్దరి మధ్య ఈ భేటీ ఈడీ, సీబీఐల ప్రయేయాన్ని పెంచుతుందా..? అంటూ కేంద్రంపై వ్యంగాస్త్రాలు సంధించారు.
పుల్వామా, రైతుల నిరసన, అగ్నివీర్ వంటి అంశాలపై గవర్నర్, మాజీ రైతు నాయకుడు, మాజీ ఎంపీ సత్యపాల్ మాలిక్ తో ఆసక్తికరమైన చర్చ అంటూ రాహుల్ గాంధీ అన్నారు. ఇరువురి మధ్య చర్చల సమయంలో రాహుల్ గాంధీ, సత్యపాల్ మాలిక్ రాజకీయ జీవితం గురించి అడిగి తెలుసుకున్నారు. తాను 1973 నుంచి రాజకీయ జీవితంలో ఉన్నానని మాలిక్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్ గురించి అడిగినప్పుడు.. జమ్మూ కాశ్మీర్ ని ఫోర్సెస్, ఆర్మీ కానీ నిర్వహించలేవని ఆయన అన్నారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర హోదా తక్షణమే ఇవ్వాలని, ఆర్టికల్ 370 రద్దు కన్నా, రాష్ట్ర హోదా తీసేయడం వారిని ఎక్కువగా బాధించిందని సత్యపాల్ మాలిక్ అన్నారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు చురుకుగా ఉన్నారు, ప్రతీ చోటా ఉగ్రవాద సంబంధిత సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. తాను పుల్వామా విషయంలో హెచ్చరికలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని రాహుల్ గాంధీతో ప్రస్తావించారు. దీనిని వారు ఓట్ల కోసం ఉపయోగించుకున్నారని పరోక్షంగా బీజేపీని నిందించారు.
పుల్వామా దాడిలో కారణమైన, సీఆర్పీఎఫ్ వాహనంపైకి దూసుకెళ్లిన వాహనం గత 10 రోజులుగా అదే ప్రాంతంలో తిరిగిందని, దాన్ని చెక్ చేసేవారే లేరని, వాహనం డ్రైవర్, ఓనర్ కి ఉగ్రవాద రికార్డులు ఉన్నాయని, వారిని అంతకుముందు అరెస్ట్ చేశారు, విడుదల చేశారు, కానీ ఇంటెలిజెన్స్ రాడార్ లో లేరని, పాకిస్తాన్ నుంచి పేలుడు పదార్థాలు తెప్పించారని మాలిక్ ఆరోపించారు.
అదానీ రైతుల దగ్గర నుంచి పంటలు కొనేందుకు పెద్ద గోడౌన్స్ నిర్మించాడు, దీంతోనే ఎంఎస్పీపై ప్రభుత్వం తన హమీని నిలబెట్టుకోలేదని, అదానీ పేరు ప్రభుత్వంతో నిలిచిపోయిందని, ప్రతీ గ్రామంలో దాని గురించి మాట్లాడుతున్నారు, ప్రభుత్వం డబ్బు అంతా అదానీ వద్ద ఉందని ప్రజలు అంటున్నారని సత్యాపాల్ మాలిక్ అన్నారు. మణిపూర్ హింసపై మాట్లాడుతూ.. ప్రభుత్వానికి నియంత్రణ లేదని దుయ్యబట్టారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి రాదని ఆయన అన్నారు.
क्या ये संवाद ED-CBI की भाग दौड़ बढ़ा देगा?
पुलवामा, किसान आंदोलन और अग्निवीर जैसे महत्वपूर्ण मुद्दों पर राज्यपाल, पूर्व सांसद और किसान नेता, सत्यपाल मलिक जी के साथ दिलचस्प चर्चा!
पूरा वीडियो मेरे यूट्यूब चैनल पर देखिए। pic.twitter.com/tIGkXDRjzD
— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2023
తాజావార్తలు
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!