Rajasthan: రాజస్థాన్లో దారుణం.. ట్రాక్టర్తో 8 సార్లు తొక్కించి సోదరుడి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్ లో దారుణం జరిగింది. భూమి విషయంలో తగాదా ఒకరి దారుణ హత్యకి కారణమైంది. ఒక వ్యక్తి తన సోదరుడిపై నుంచి ట్రాక్టర్ పోనిచ్చి హత్య చేశాడు. ఒకసారి కాదు 8 సార్లు అతనిని ట్రాక్టర్ తో తొక్కించాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ఘటన రాజస్థాన్ లోని భరత్పూర్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే బహదూర్ సింగ్, అతర్ సింగ్ కుటుంబాల మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ రోజు ఉదయం బహదూర్ సింగ్ కుటుంబం ట్రాక్టర్ తో వివాదాస్పద భూమి వద్దకు చేరుకున్నారు. కాసేపటికి అదే ప్రాంతానికి అతర్ సింగ్ కుటుంబం వచ్చింది. కొద్ది సేపటి తర్వాత భూమి విషయమై ఇరు కుటుంబాలు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలోనే తుపాకీ శబ్ధాలు వినిపించాయని గ్రామస్తులు ఆరోపించారు.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్డ్రింక్తో హత్య
Read Also: Israel: ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే ప్రధాని నెతన్యాహు కుమారుడెక్కడ.?
ఈ దాడి సమయంలో అతర్ సింగ్ కుమారుల్లో ఒకరైన నిర్పత్ నేతలపై పడిపోయాడు. నిందితుడు దామోదర్, నిర్పత్ చనిపోయే దాకా ట్రాక్టర్ తో అతనిని తొక్కించాడు. ఇరు కుటుంబాలకు చెందినవారు వారించినప్పటికీ కూడా నిందితుడు దామోదర్ ట్రాక్టర్ ఆపకుండా 8 సార్లు తొక్కిస్తూనే ఉన్నాడు. దీంతో నిర్ఫత్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘర్షణల్లో దాదాపుగా 10 మంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని నలుగురిని అరెస్ట్ చేశారు.
ఈ ఘటనకు ఐదు రోజుల మందు ఇలాగే రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ సమయంలో బహదూర్ సింగ్, అతని తమ్ముడు జనాక్ పై అతర్ సింగ్, అతని కొడుకు నిర్పత్ దాడి చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఈ దారుణ సంఘటనపై అధికార కాంగ్రెస్ పార్టీపై బీజేపీ విరుచుకుపడింది. బీజేపీ నేత సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీకి ఈ దారుణ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లే దమ్ముందా..? అంటూ సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!