Tesla: భారతదేశంలోకి ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం, బిలియన్ ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా ఎంట్రీ ఇవ్వనుంది. వచ్చే ఏడాది భారత్ లోకి టెస్లా కార్లు రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి చర్చలు తుదిదశకు వచ్చాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు భారత్ లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. గుజరాత్, మహారాష్ట్ర లేదా తమిళనాడు రాష్ట్రాల్లోని ఏదో ఒక ప్రాంతంలో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇటీవల గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్-షిఫా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నానుతోంది. ఈ ఆస్పత్రి కిందనే భారీ సొరంగాలు ఉన్నాయని, టెర్రరిస్టుల టన్నెల్ నెట్వర్క్ ఉందని ఇజ్రాయిల్ ఆర్మీ ఆరోపిస్తోంది. తాజాగా ఈ ఆస్పత్రి కిందనే అతిపెద్ద ఉగ్రవాద సొరంగాన్ని ఇజ్రాయిల్ ఆర్మీ కనుగొంది. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసింది.
BJP MP: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ మహువాను విచారించింది. ఆమెను లోక్సభ నుంచి బహిష్కరించాలని సిఫారసు చేసింది. ప్రధాని మోడీ, అదానీ గ్రూప్ని టార్గెట్ చేస్తూ మహువా కావాలనే ప్రశ్నలు అడిగినట్లు తేలింది. ఇదే కాకుండా తన పార్లమెంట్ లాగిన్ వివరాలను వేరే వ్యక్తులతో పంచుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు.
GPS Signal: మిడిల్ ఈస్ట్పై నుంచి వెళ్తున్న విమానాల్లో GPS సిగ్నల్స్ కోల్పోతున్నాయి. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మధ్యప్రాచ్యంపై నుంచి వెళ్తున్న పౌర విమానాల్లో కొన్ని సార్లు జీపీఎస్ సిగ్నల్స్ అందడం లేదని నివేదికలు వచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) భారత విమానయాన సంస్థలకు కీలక సూచనలను జారీ చేసింది.
China H9N2 outbreak: చైనాలో H9N2 ఇన్ఫెక్షన్ వ్యాప్తి ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. ఆ దేశంలో ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ ఇన్ఫెక్షన్కి గురై అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిపై మరోసారి ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గతంలో చైనాలోని వూహాన్ నగరంలో ఇలాగే కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని తాజా అవుట్ బ్రేక్ గుర్తుకు తెచ్చింది.
Deepfake: డీప్ఫేక్పై కేంద్ర సీరియస్ చర్యలకు ఉపక్రమించింది. ఆన్లైన్, సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్స్లో డీప్ఫేక్ ముప్పును పరిశీలించడానికి, అటువంటి కంటెంట్ని గుర్తించడానికి, బాధిత పౌరులకు సాయం చేయడానికి కేంద్రం ప్రత్యేక అధికారిని నియమిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రకి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు.
Uttarakhand tunnel rescue: ఉత్తరాఖండ్ టన్నెల్ కూలిపోయిన ఘటనలో మరో ఇబ్బంది ఎదురైంది. మరికొంత కాలం సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిల్క్యారా సొరంగం కూలిన ప్రదేశంలో దేశంలోని నిపుణులతో పాటు విదేశీ నిపుణులు రెస్క్యూ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. శుక్రవారం నాటికి రెస్క్యూ కార్యక్రమాలు విజయవంతమవుతాయని అధికారులు భావిస్తున్నారు.
Shivraj Singh Chouhan: ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో భారత్ ఆస్ట్రేలియాపై ఓడిపోవడం రాజకీయ అస్త్రంగా మారింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీలు మాటల యుద్ధానికి తెరలేపాయి. ఇటీవల రాజస్థాన్ జలోర్లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీపై ‘పనౌటీ’(చెడుశకునం) అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఘాటుగానే స్పందించింది. రాహుల్ గాంధీ మానసిక స్థితి సరిగా లేదంటూ బీజేపీ విమర్శించింది.
Congress: కేరళలో అధికార సీపీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పాలస్తీనా మద్దతు ర్యాలీలు చేపడుతున్నాయి. గురువారం కాంగ్రెస్ నేతృత్వంలో కోజికోడ్లో పాలస్తీనా సంఘీభావ ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీకి కాంగ్రెస్ కీలక నేత కేసీ వేణుగోపాల్తో పాటు మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ హాజరయ్యారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, భారత ప్రధాని నరేంద్రమోడీలు ఇద్దరు ఒకే రకం అని ఈ ర్యాలీలో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
Israel: ఇరాన్ ప్రాక్సీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దోల్లాహియాన్తో బీరుట్లో సమావేశమయ్యారని లెబనీస్ మూమెంట్ గురువారం తెలిపింది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్, ఇజ్రాయిల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇజ్రాయిల్ ఉత్తర సరిహద్దుపై హిజ్బుల్లా మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు.