Uttarakhand tunnel rescue: రెస్క్యూ ఆపరేషన్కి బ్రేక్.. చెడిపోయిన డ్రిల్లింగ్ మిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand tunnel rescue: ఉత్తరాఖండ్ టన్నెల్ కూలిపోయిన ఘటనలో మరో ఇబ్బంది ఎదురైంది. మరికొంత కాలం సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిల్క్యారా సొరంగం కూలిన ప్రదేశంలో దేశంలోని నిపుణులతో పాటు విదేశీ నిపుణులు రెస్క్యూ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. శుక్రవారం నాటికి రెస్క్యూ కార్యక్రమాలు విజయవంతమవుతాయని అధికారులు భావిస్తున్నారు.
Read Also: Rani Rudrama: కేటీఆర్ను గద్దె దించి సిరిసిల్లలో నన్ను గెలిపించండి
Also Read
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ఇదిలా ఉంటే డ్రిల్లింగ్కి ఎంతో కీలకంగా ఉన్న ఆగర్ డ్రిల్లింగ్ మిషిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఇప్పటి వరకు 46.8 మీటర్ల వరకు డ్రిల్లింగ్ పూర్తైంది. కార్మికులు సొరంగంలో 57 మీటర్ల లోపల ఉన్నారు. మరో 10 మీటర్లు డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది. అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డ్రిక్స్ మాట్లాడుతూ.. కార్మికులకు మరికొన్ని మీటర్ల దూరంలో ఉన్నామని, వారంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఆగర్ మిషిన్ చెడిపోయిందని, దాన్ని సరి చేస్తున్నామని, తిరిగి రేపు పనిచేయాల్సి ఉందని, ఇప్పటి వరకు డ్రిల్లింగ్ మిషన్ మూడు సార్లు చెడిపోయినట్లు తెలిపారు.
కార్మికుల చికిత్స కోసం ఇప్పటికే ప్రమాదం జరిగిన స్థలంలో అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి, వీరికి చికిత్స అందించేందుకు 41 బెడ్లలో ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. నవంబర్ 12న సిల్క్యారా సొరంగం కూలిపోయింది. అందులో పనిచేస్తున్న 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఉత్తర కాశీ జిల్లాలో బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. గత 12 రోజులుగా కార్మికులు సొరంగంలోనే చిక్కుకుపోయారు. వీరికి ఆహారం, మందుల్ని ఓ పైప్ ద్వారా అందిస్తున్నారు. కూలిన సమయంలో కరెంట్ సదుపాయాలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కార్మికులు ఉన్న చోట వెలుతురు ఉంది. వారంతా సురక్షితంగా తిరిగి రావాలని స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజలు దేవతలకు ప్రార్థనలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి బాధితులతో మాట్లాడారు. మేము మీకు మరికొంత దూరంలోనే ఉన్నామని చెప్పారు.
#WATCH | On Silkyara tunnel rescue operation, International Tunneling Expert, Arnold Dix says, "We are only just metres away from finding passage to have the men back. But the men are safe. The auger machine has broken down, it is being repaired and it should be back up tomorrow.… pic.twitter.com/dtX8JtdU61
— ANI (@ANI) November 23, 2023
తాజావార్తలు
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
-
Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!