Venu Goapl Reddy
Author- NTV Telugu-
PM Modi: “సిందూర్” తర్వాత తొలి విదేశీ పర్యటన.. మూడు దేశాలకు వెళ్తున్న ప్రధాని మోడీ..
PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. వచ్చే వారం కెనడాలో జరగబోయే జీ-7 సదస్సుకు ప్రధాని హాజరు కానున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా మోడీకి ఫోన్ చేసి ఆహ్వానించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తొలిసారి ప్రధాని మోడీ కెనడా వెళ్తున్నారు. -
Israeli Operation: 1981లో ఇరాక్, 2025లో ఇరాన్.. ఇజ్రాయిల్ డేరింగ్ ఆపరేషన్స్..
Israeli Operation: ఇజ్రాయిల్ ఇరాన్ని తన అస్తిత్వానికి ముప్పుగా చూస్తోంది. ఇరాన్ చేతికి న్యూక్లియర్ ఆయుధాలు రావద్దనేది ఇజ్రాయిల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో, తాజాగా ఇజ్రాయిల్ ఇరాన్ మీద విరుచుకుపడుతోంది. ముఖ్యంగా, ఇరాన్ అణు కార్యక్రమాలపై, వారి సైంటిస్టులను టార్గెట్ చేసి దాడులు చేసింది. 2005 నుంచి ఇజ్రాయిల్ ఇరాన్ అణు కార్యక్రమాలను నిశితంగా గమనిస్తోంది. ప్రస్తుతం, ఇరాన్ అణ్వాస్త్రాలకు అవసరమయ్యే యూరేనియాన్ని శుద్ధి చేసినట్లు అనుమానిస్తున్న ఇజ్రాయిల్, భారీ దాడులు చేసింది. -
India Canada: దారికి వచ్చిన కెనడా.. ఇండియా దౌత్య విజయం..
India Canada: కెనడా ఇప్పుడిప్పుడే దారికి వస్తోంది. గతంలో, జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతుగా నిలిచాడు. తన రాజకీయాల కోసం భారత్తో సంబంధాలను పణంగా పెట్టాడు. ప్రస్తుతం, మార్క్ కార్నీ ప్రధానిగా గెలిచిన తర్వాత భారత్తో కెనడా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. జీ -7 సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీని కెనడా ఆహ్వానించింది. స్వయంగా కెనడా ప్రధాని కార్నీ మోడీకి ఫోన్ చేశారు. -
Rajasthan: భార్య తప్పుడు కట్నం ఆరోపణలు.. అత్తింటి ముందే ‘‘టీ’’ స్టాల్ పెట్టి భర్త నిరసన ..
Rajasthan: ఈ మధ్య కాలంలో కొందరు మహిళలు భర్తలపై అక్రమ గృహహింస కేసుల పెట్టి వేధిస్తున్నారు. దీంతో పలువురు మగాళ్లు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసు ఇందుకు మంచి ఉదాహరణ. ఇదిలా ఉంటే, రాజస్థాన్కి చెందిన కృష్ణ కుమార్ ధాకడ్ కూడా తన భార్య నుంచి ఇలాంటి వేధింపులను ఎదుర్కొంటున్నాడు. తప్పుడు కేసులో విసిగిపోయిన కృష్ణ వినూత్నంగా తన నిరసన తెలుపుతున్నాడు. -
Israel Iran Conflict: ఇరాన్తో సంఘర్షణ.. భారత్కు క్షమాపణ చెప్పిన ఇజ్రాయిల్..
Israel Iran Conflict: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య తీవ్ర సంఘర్షణ జరుగుతోంది. ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా శుక్రవారం ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ లోని అతిపెద్ద నగరమైన టెల్ అవీవ్ని ఇరాన్ క్షిపణులతో టార్గెట్ చేసింది. అయితే, ఇప్పుడు ఇజ్రాయిల్ పొరపాటున చేసిన పనికి భారతదేశానికి ‘‘క్షమాపణలు’’ చెప్పింది. భారతదేశ పటాన్ని ఇజ్రాయిల్ తప్పుగా చూపించింది. జమ్మూ కాశ్మీర్ ని పాకిస్తాన్లో భాగంగా, ఈశాన్య రాష్ట్రాలు నేపాల్లో భాగంగా చూపించింది. -
Israel Iran Conflict: టెల్ అవీవ్పై ఇరాన్ క్షిపణి దాడులు..
Israel Iran Conflict: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రెండు దేశాలు కూడా క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము ఇజ్రాయిల్ ఇరాన్ అణు కేంద్రాలను, కీలక శాస్త్రవేత్తలు, అధికారులను టార్గెట్ చేస్తూ దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా శనివారం, ఇజ్రాయిల్ అతిపెద్ద నగరం టెల్ అవీవ్పై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. టెల్ అవీవ్తో పాటు రాజధాని జెరూసలెంలో కూడా పేలుళ్లు జరిగాయి. మరోవైపు, 24 గంటల్లోనే ఇజ్రాయిల్ మరోసారి ఇరాన్పై భీకర దాడి చేసింది. రాజధాని టెహ్రాన్ లోని ఎయిర్… -
Bangladesh: బంగ్లాదేశ్లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇళ్లు ధ్వంసం.. ఘాటుగా స్పందించిన భారత్..
Bangladesh: బంగ్లాదేశ్లోని కవి, బహుభాషావేత్త, నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై మతోన్మాదులు దాడులు చేశారు. సిరాజ్గంజ్ జిల్లాలోని ప్రస్తుతం మ్యూజియంగా ఉన్న ఇంటిపై దాడి జరిగింది. ఆదివారం ఒక సందర్శకుడు, మ్యూజియం సిబ్బందికి పార్కింగ్ ఫీజు విషయంలో జరిగిన వివాదం తర్వాత, ఒక గుంపు దాడికి పాల్పడింది. సందర్శకుడిని నిర్బంధించిన తర్వాత దాడి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. దీంతో ఒక గుంపు ఆవరణలోకి చొరబడి మ్యూజియం, ఆడిటోరియంపై దాడులకు పాల్పడింది. -
Air India Crash: విషాదం.. అమ్మకు భోజనం తీసుకెళ్లిన కొడుకు మృతి..
Air India Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 274 మంది మరణించారు. ఇందులో విమానంలో ఉన్న 241 మందితో పాటు విమానం కూలిన ప్రదేశంలో ఉన్నవారు కూడా మరణించారు. విమానం ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే అహ్మదాబాద్లోని మేఘనినగర్ ప్రాంతంలోని BJ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో, హాస్టల్లోని మెడికోలు మరణించారు. -
Air India Plane Crash: 2000 మందిని రక్షించిన ఎయిర్ ఇండియా పైలట్లు..
Air India Plane Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం యావత్ దేశాన్ని విషాదంలోకి నెట్టింది. గురువారం మధ్యాహ్నం లండన్ బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో 241 మంది మరణించారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. విమానం డాక్టర్ హాస్టల్ భవనంపై కూలడంతో 24 మంది మెడికోలు మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది మరణించారు. -
Israel Strikes: ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
Israel Strikes: ఇజ్రాయిల్ ఇరాన్పై విరుచుకుపడుతోంది. 24 గంటల్లో మరోసారి క్షిపణులతో దాడి చేసింది. రాజధాని టెహ్రాన్తో సహా పలు ప్రాంతాలపై ఎటాక్ చేసింది. ఇరాన్లోని అణు, సైనిక స్థావరాలతో సహా 200కి పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఇస్ఫహాన్ అణు కేంద్రంపై దాడులు చేసినట్లు తెలిపింది.
తాజావార్తలు
-
Raaka : దీపికా డెడికేషన్ కు యూనిట్ ఫిదా.. రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ
-
Telangana Vahan Portal: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వాహన్ పోర్టల్.. ఇక మీ ఇంటి నుంచే వాహన సేవలు!
-
Coriander Rice Recipe: ఈజీ అండ్ క్విక్ రెసిపీ.. సింపుల్ ఇంగ్రిడియెంట్స్తో స్పెషల్ ‘కొత్తిమీర రైస్’ చేసేయండి ఇలా.!
-
PM Modi: మే 4న అటవిక పాలనకు డెత్ డే.. టీఎంసీ గూండాలను తరిమికొడతామన్న మోడీ
-
SRH vs RR: బుడ్డోడు వైభవ్ vs ప్రఫుల్ హింగే.. రేపు రాజస్థాన్ సొంత గడ్డపై అసలైన ‘ప్రతీకార’ పోరు!
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!