Yogi Adityanath: ‘‘మోడీ తర్వాత ప్రధాని యోగి ఆదిత్య నాథ్.?’’ ఆయన ఏమన్నారంటే..
- ప్రధాని మోడీ రిటైర్మెంట్ వాదనలు..
- సంజయ్ రౌత్ వ్యాఖ్యల నేపథ్యంలో వారసుడిపై చర్చ..
- యోగి ఆదిత్య నాథ్ తరుపరి ప్రధాని అభ్యర్థి..?
- ఈ వాదనపై యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు..
Yogi Adityanath: బీజేపీలో 75 ఏళ్ల వయో పరిమితి పదవులకు అడ్డంకిగా మారింది. దీనిని చూపుతూ పలువురు సీనియర్లకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. అయితే, తాజాగా ఉద్ధవ్ ఠాక్రే నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబర్లో రిటైర్ అవబోతున్నారని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఈ వాదనల నేపథ్యంలో మోడీ వారసుడు యోగి ఆదిత్యనాథ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా, ఈ వాదనలపై యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బీజేపీ కేంద్ర నాయకత్వంలో విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలను యోగి తోసిపుచ్చారు. ఒక వేళ విభేదాలే ఉంటే యూపీ సీఎంగా ఇన్నాళ్లు ఉండేవాడిని కాదని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. భవిష్యత్ ప్రధాన మంత్రి అనే వార్తల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలు తన పూర్తికాల ఉద్యోగం కాదని స్పష్టం చేశారు. ‘‘నేను యూపీ సీఎంని, పార్టీ నన్ను యూపీ ప్రజల కోసం ఇక్కడ ఉంచింది. రాజకీయాలు నాకు పూర్తికాల ఉద్యోగం కాదు. ప్రస్తుతం మేము యూపీలో పని చేస్తున్నాము, కానీ వాస్తవానికి నేను ఒక యోగిని’’ అని ఆయన అన్నారు.
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
Read Also: Waqf Bill: “వక్ఫ్ బిల్లు” పాస్ అవుతుందా.. బీజేపీ, ఇండీ కూటమి బలాబలాలు ఎంత..?
‘‘నేను ఇక్కడ ఉన్నంత కాలం పనిచేస్తాను. దీనికి కూడా ఒక కాల పరిమితి ఉంటుంది’’ అని తన రాజకీయ భవిష్యత్తు, అవకాశాల గురించి చెప్పారు. బీజేపీ హైకమాండ్తో విభేదాల గురించి ప్రశ్నించినప్పుడు.. ‘‘విభేదాల ప్రశ్నే లేదని, అన్నింటి కంటే ముఖ్యంగా, పార్టీ వల్లే నేను సీఎంగా ఇక్కడ ఉన్నాను. హైకమాండ్తో విభేదాలు ఉంటే నేను ఇక్కడ కూర్చోవడం సాధ్యమా..? ’’ అని ఆయన అడిగారు. ‘‘రెండో విషయం ఏంటంటే, టిక్కెట్ల నిర్ణయాన్ని పార్లమెంటరీ బోర్డు నిర్ణయింస్తుంది. అన్ని విషయాలు పార్లమెంటరీ బోర్డులో చర్చిస్తాను. సరైన స్క్రీనింగ్ ద్వారా విషయాలు ఇక్కడికి చేరుతాయి. కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడుతారు, వారి నోరు మూయించడం ఎవరికి సాధ్యం కాదు’’ అని యోగి అన్నారు.
ప్రధాని మోడీ తర్వాత ఆయన వారసుడిగా యోగి ఆదిత్యనాథ్ ప్రధాని అవుతారనేది సాధారణ ప్రజల్లో ఉన్న ఒక వాదన. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ మోడీ రిటైర్మెంట్ గురించి వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, బీజేపీ నేతలు రౌత్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. 2029లో కూడా ప్రధానిగా నరేంద్రమోడీనే ఉంటారని అన్నారు
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?