Yogi Adityanath: ‘‘మోడీ తర్వాత ప్రధాని యోగి ఆదిత్య నాథ్.?’’ ఆయన ఏమన్నారంటే..
- ప్రధాని మోడీ రిటైర్మెంట్ వాదనలు..
- సంజయ్ రౌత్ వ్యాఖ్యల నేపథ్యంలో వారసుడిపై చర్చ..
- యోగి ఆదిత్య నాథ్ తరుపరి ప్రధాని అభ్యర్థి..?
- ఈ వాదనపై యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: బీజేపీలో 75 ఏళ్ల వయో పరిమితి పదవులకు అడ్డంకిగా మారింది. దీనిని చూపుతూ పలువురు సీనియర్లకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. అయితే, తాజాగా ఉద్ధవ్ ఠాక్రే నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబర్లో రిటైర్ అవబోతున్నారని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఈ వాదనల నేపథ్యంలో మోడీ వారసుడు యోగి ఆదిత్యనాథ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా, ఈ వాదనలపై యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బీజేపీ కేంద్ర నాయకత్వంలో విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలను యోగి తోసిపుచ్చారు. ఒక వేళ విభేదాలే ఉంటే యూపీ సీఎంగా ఇన్నాళ్లు ఉండేవాడిని కాదని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. భవిష్యత్ ప్రధాన మంత్రి అనే వార్తల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలు తన పూర్తికాల ఉద్యోగం కాదని స్పష్టం చేశారు. ‘‘నేను యూపీ సీఎంని, పార్టీ నన్ను యూపీ ప్రజల కోసం ఇక్కడ ఉంచింది. రాజకీయాలు నాకు పూర్తికాల ఉద్యోగం కాదు. ప్రస్తుతం మేము యూపీలో పని చేస్తున్నాము, కానీ వాస్తవానికి నేను ఒక యోగిని’’ అని ఆయన అన్నారు.
Also Read
- Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
- Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: కాక్రోచ్ ఉద్యమం ఎటు పోతోంది.? పేపర్ లీక్పై నిరసన అయితే దాడులు, విద్వేష నినాదాలు ఎందుకు.?
Read Also: Waqf Bill: “వక్ఫ్ బిల్లు” పాస్ అవుతుందా.. బీజేపీ, ఇండీ కూటమి బలాబలాలు ఎంత..?
‘‘నేను ఇక్కడ ఉన్నంత కాలం పనిచేస్తాను. దీనికి కూడా ఒక కాల పరిమితి ఉంటుంది’’ అని తన రాజకీయ భవిష్యత్తు, అవకాశాల గురించి చెప్పారు. బీజేపీ హైకమాండ్తో విభేదాల గురించి ప్రశ్నించినప్పుడు.. ‘‘విభేదాల ప్రశ్నే లేదని, అన్నింటి కంటే ముఖ్యంగా, పార్టీ వల్లే నేను సీఎంగా ఇక్కడ ఉన్నాను. హైకమాండ్తో విభేదాలు ఉంటే నేను ఇక్కడ కూర్చోవడం సాధ్యమా..? ’’ అని ఆయన అడిగారు. ‘‘రెండో విషయం ఏంటంటే, టిక్కెట్ల నిర్ణయాన్ని పార్లమెంటరీ బోర్డు నిర్ణయింస్తుంది. అన్ని విషయాలు పార్లమెంటరీ బోర్డులో చర్చిస్తాను. సరైన స్క్రీనింగ్ ద్వారా విషయాలు ఇక్కడికి చేరుతాయి. కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడుతారు, వారి నోరు మూయించడం ఎవరికి సాధ్యం కాదు’’ అని యోగి అన్నారు.
ప్రధాని మోడీ తర్వాత ఆయన వారసుడిగా యోగి ఆదిత్యనాథ్ ప్రధాని అవుతారనేది సాధారణ ప్రజల్లో ఉన్న ఒక వాదన. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ మోడీ రిటైర్మెంట్ గురించి వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, బీజేపీ నేతలు రౌత్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. 2029లో కూడా ప్రధానిగా నరేంద్రమోడీనే ఉంటారని అన్నారు
తాజావార్తలు
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!