Sanjay Raut: అద్వానీకి షాజహాన్ పరిస్థితి.. మోడీపై సంజయ్ రౌత్ విమర్శలు..
- అద్వానీని షాజహాన్లా దూరం చేశారు..
- మోడీ ఎవరికీ బాస్ కాదు..
- బీజేపీకి ఆర్ఎస్ఎస్ మాతృసంస్థ..
- మరోసారి సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్గా శివసేన ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ విరుచుకుపడుతున్నారు. మోడీ సెప్టెంబర్లో రిటైర్ అవుతారని, అందుకే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చారని వ్యాఖ్యానించిన ఆయన ఈ రోజు మరిన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రౌత్ మాట్లాడుతూ.. మోడీ కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమే అని, ఎవరికి బాస్ కాదని అన్నారు. దశాబ్దాలుగా పనిచేసిన అద్వానీ వంటి అగ్ర నేతల కారణంగా బీజేపీ అధికార శిఖరానికి చేరుకుందని అన్నారు.
Read Also: Bengaluru: విద్యార్థి తండ్రితో టీచర్ ఎఫైర్.. చివరికి ఏమైందంటే..!
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
రౌత్ మాట్లాడుతూ.. ‘‘ఎవరికి ఎవరు బాస్..? మోడీ ప్రధాని కావడం తాత్కాలిక ఏర్పాటు. రాముడు, కృష్ణుడు కూడా తమ పని పూర్తి చేసిన తర్వాత వెళ్లిపోయారు. మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు షాజహాన్ లాగా అద్వానీని దూరం ఉంచారు. ’’ అని ఔరంగజేబు రాజు అయిన తర్వాత షాజహాన్ని బంధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రిగా అద్వానీకి హక్కు ఉంది, కానీ మొఘల్ తరహాలో అధికారం చేపట్టినట్లుగానే ఆయనను పక్కన పెట్టారని అన్నారు.
వారసుడిని నిర్ణయించడం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల్లో లేదని రౌత్ అన్నారు. ‘‘మోడీకి సెప్టెంబర్లో 75 ఏళ్లు నిండుతాయి. పార్టీ నియమం ప్రకారం ఆయన పదవీ విరమణ చేయాలి. నరేంద్రమోడీ తన పార్టీలో 75 ఏళ్లు దాటిన వారికి పదవి ఉండదనే నియమాన్ని స్వయంగా ప్రవేశపెట్టారు. ఈ నియమాన్ని ఎల్కే అద్వానీకి, మురళీ మనోహర్ జోషి వంటి నాయకులకు వర్తింపచేశారు’’ అని రౌత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ మాతృసంస్థ అని, వారి భవిష్యత్తు మార్గాన్ని నిర్ణయిస్తుందని చెప్పారు. వక్ఫ సవరణ బిల్లుపై మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, అప్నాదళ్ వంటి ఎన్డీయే మిత్రపక్షాలు బిల్లుపై ఒక వైఖరి తీసుకోవాలని, ఆ తర్వాతే ఇతర పార్టీలను అడగాలని అన్నారు.
- Tags
- bjp
- LK Advani
- PM Modi
- RSS
- Sanjay Raut
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!