Sanjay Raut: అద్వానీకి షాజహాన్ పరిస్థితి.. మోడీపై సంజయ్ రౌత్ విమర్శలు..
- అద్వానీని షాజహాన్లా దూరం చేశారు..
- మోడీ ఎవరికీ బాస్ కాదు..
- బీజేపీకి ఆర్ఎస్ఎస్ మాతృసంస్థ..
- మరోసారి సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్గా శివసేన ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ విరుచుకుపడుతున్నారు. మోడీ సెప్టెంబర్లో రిటైర్ అవుతారని, అందుకే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చారని వ్యాఖ్యానించిన ఆయన ఈ రోజు మరిన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రౌత్ మాట్లాడుతూ.. మోడీ కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమే అని, ఎవరికి బాస్ కాదని అన్నారు. దశాబ్దాలుగా పనిచేసిన అద్వానీ వంటి అగ్ర నేతల కారణంగా బీజేపీ అధికార శిఖరానికి చేరుకుందని అన్నారు.
Read Also: Bengaluru: విద్యార్థి తండ్రితో టీచర్ ఎఫైర్.. చివరికి ఏమైందంటే..!
Also Read
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
- Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
రౌత్ మాట్లాడుతూ.. ‘‘ఎవరికి ఎవరు బాస్..? మోడీ ప్రధాని కావడం తాత్కాలిక ఏర్పాటు. రాముడు, కృష్ణుడు కూడా తమ పని పూర్తి చేసిన తర్వాత వెళ్లిపోయారు. మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు షాజహాన్ లాగా అద్వానీని దూరం ఉంచారు. ’’ అని ఔరంగజేబు రాజు అయిన తర్వాత షాజహాన్ని బంధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రిగా అద్వానీకి హక్కు ఉంది, కానీ మొఘల్ తరహాలో అధికారం చేపట్టినట్లుగానే ఆయనను పక్కన పెట్టారని అన్నారు.
వారసుడిని నిర్ణయించడం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల్లో లేదని రౌత్ అన్నారు. ‘‘మోడీకి సెప్టెంబర్లో 75 ఏళ్లు నిండుతాయి. పార్టీ నియమం ప్రకారం ఆయన పదవీ విరమణ చేయాలి. నరేంద్రమోడీ తన పార్టీలో 75 ఏళ్లు దాటిన వారికి పదవి ఉండదనే నియమాన్ని స్వయంగా ప్రవేశపెట్టారు. ఈ నియమాన్ని ఎల్కే అద్వానీకి, మురళీ మనోహర్ జోషి వంటి నాయకులకు వర్తింపచేశారు’’ అని రౌత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ మాతృసంస్థ అని, వారి భవిష్యత్తు మార్గాన్ని నిర్ణయిస్తుందని చెప్పారు. వక్ఫ సవరణ బిల్లుపై మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, అప్నాదళ్ వంటి ఎన్డీయే మిత్రపక్షాలు బిల్లుపై ఒక వైఖరి తీసుకోవాలని, ఆ తర్వాతే ఇతర పార్టీలను అడగాలని అన్నారు.
- Tags
- bjp
- LK Advani
- PM Modi
- RSS
- Sanjay Raut
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
-
Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
-
China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
-
DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!