Rinku Singh: టీ20 వరల్డ్ కప్కు ముందు.. వివాదంలో చిక్కుకున్న రింకూ సింగ్!
- వివాదంలో చిక్కుకున్న రింకూ సింగ్
- ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కర్ణిసేన డిమాండ్
- పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిక
2026 టీ20 వరల్డ్ కప్కు ముందు టీమిండియా యువ క్రికెటర్, టీ20 క్రికెట్లో మ్యాచ్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. రింకూ తన ఫేస్బుక్ ఖాతాలో కొన్ని రోజుల పోస్ట్ చేసిన ఏఐ జనరేటెడ్ వీడియోపై కర్ణిసేన తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. రింకూ సనాతన ధర్మానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, పోలీసులు వెంటనే అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కర్ణిసేన డిమాండ్ చేసింది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించింది. అలీగఢ్లోని సస్నీ గేట్ పోలీస్ స్టేషన్లో రింకూపై ఫిర్యాదు నమోదైంది.
రింకూ సింగ్ ఫేస్బుక్ వీడియోలో అతడు సిక్సర్లు బాదుతున్న దృశ్యాలతో పాటు, నిన్ను క్రికెటర్గా ఎవరు చేశారో తెలుసా? అనే టెక్స్ట్ ఉంది. హిందూ దేవుళ్లు విష్ణువు, శివుడు, గణేశుడు సన్గ్లాసెస్ పెట్టుకుని కారులో కూర్చున్నట్లు.. ఆ కారును హనుమంతుడు డ్రైవ్ చేస్తున్నట్లు ఏఐ వీడియోను రింకూ క్రియేట్ చేశారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. దేవుడి అనుగ్రహంతోనే తన విజయం సాధ్యమైందనే ఉద్దేశంతో రింకూ ఆ వీడియో పోస్ట్ చేసినా.. కొందరు అభ్యంతరకరంగా భావిస్తున్నారు. ఈ వీడియోపై కర్ణిసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందూ మత భావాలను కించపరిచారంటూ రింకూపై ఫిర్యాదు దాఖలు చేసింది. కర్ణిసేన జిల్లా అధ్యక్షుడు సుమిత్ తోమర్ మాట్లాడుతూ.. రింకూ సింగ్ షారుక్ ఖాన్లాగే జిహాదీ మనస్తత్వాన్ని ప్రదర్శించాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవుళ్లకు నల్ల కళ్లజోడు పెట్టడం, థార్ కారులో చూపించడం, ఇంగ్లిష్ పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించడం మాత విశ్వాసంతో ఆటలాడటమే అని పేర్కొన్నారు.
Also Read
- RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
- Muttiah Muralitharan: "ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?".. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
- RCB Vs GT: ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ.. మరో రికార్డు బద్దలు కొట్టిన విరాట్..
- Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్లో పస తగ్గిందా..? ఈ IPL లో విఫలం అవ్వడానికి కారణం ఇదే..
అలీగఢ్లోని సస్నీ గేట్ పోలీస్ స్టేషన్లో రింకూపై ఫిర్యాదు నమోదైంది. స్టేషన్ ఇన్చార్జ్ దైనిక్ భాస్కర్కు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆ వీడియో నిజంగా ఎవరు పోస్ట్ చేశారో, దాని ప్రామాణికత ఏమిటో ముందుగా విచారిస్తామని చెప్పారు. అన్ని అంశాలు ధృవీకరించిన తర్వాతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్ణిసేనకు తెలిపారు. రింకూ ప్రస్తుతం నాగ్పూర్లో ఉన్నారు. న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు సిద్ధమవుతున్నారు. ఆ వెంటనే ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో పాల్గొననున్నారు. కీలక వరల్డ్ కప్కు ముందు ఈ వివాదం ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
-
IPL 2026 Playoffs Chances: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేస్.. గుజరాత్కు చిగురించిన ఆశలు, ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?
-
Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన ‘సూసైడ్ లేటర్’.. ప్రపంచ కుబేరులకు దడ!
-
TG DGP C.V. Anand: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ..
-
Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!