Xi Jinping: “డ్రాగన్-ఏనుగు కలిసి డ్యాన్స్ చేయాలి”.. భారత్కి జిన్పింగ్ స్నేహహస్తం..
- భారత్, చైనాలు కలిసి పనిచేయాలి..
- డ్రాగన్-ఎలిఫెంట్ కలిసి ఉండాలి..
- చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xi Jinping: చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ మరోసారి భారత్కి స్నేహ సందేశం పంపాడు. భారత్ , చైనాలు మరింత దగ్గరగా కలిసి పనిచేయాలని అన్నారు. చైనా అధ్యక్షుడు, భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో మాట్లాడారు. రెండు దేశాల ప్రస్తావిస్తూ.. డ్రాగన్-ఏనుగు డ్యాన్స్ చేయాలని అన్నారు. ‘‘డ్రాగన్-ఏనుగు టాంగో’’ రూపంలో ఉండాలని చెప్పారు.
Read Also: Asaduddin Owaisi: అది ‘‘వక్ఫ్ బిల్లు’’ కాదు, ‘‘వక్ఫ్ విధ్వంస బిల్లు’’..
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
- Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
2020లో గల్వాన్ ఘర్షణల తర్వాత ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు నార్మల్ అవుతున్నాయి. తాజాగా, భారత్-చైనాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 75వ ఏళ్లు అవుతున్న నేపథ్యంలో మంగళవారం ఆయన అభినందను సందేశాలను పంపారు. పొరుగువారితో శాంతియుత సహజీవనం చేయడానికి మార్గాలను కనుగొనాలని, ప్రధాన అంతర్జాతీయ వ్యవహారాల్లో సమన్వయాన్ని మరింత పెంచుకోవడానికి, సరిహద్దు ప్రాంతాలలో శాంతిని సంయుక్తంగా కాపాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని జిన్పింగ్ అన్నారు.
రెండు దేశాలు సంయుక్తంగా బహుళ ధ్రువ ప్రపంచాన్ని, అంతర్జాతీయ సంబంధాల్లో గొప్ప ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించాలని జిన్పింగ్ అన్నారు. భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత కాపాడటానికి భారత్తో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని జిన్పింగ్ అన్నారు. రెండు దేశాల స్నేహ సంబంధం ప్రపంచ శాంతికి, శ్రేయస్సుకు దోహదపడాలని కాంక్షించారు. రెండు దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు, గ్లోబల్ సౌత్లో కీలకంగా ఉన్నాయని జిన్పింగ్ అన్నారు.
2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. దౌత్య సంబంధాలు కనిష్టానికి చేరుకున్నాయి. ఇటీవల రష్యా కజాన్లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ముందు సరిహద్దుల్లో ఘర్షణకు కేంద్రాలుగా ఉన్న తూర్పు లడఖ్లో డెప్సాంగ్, డెమ్చోక్ నుంచి సైనికులు వెనక్కి వెళ్లారు. ఐదేళ్ల తర్వాత మోడీ, జిన్పింగ్ సమావేశమైన తర్వాత, చైనా తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా సుంకాలు భయం, అతిపెద్ద మార్కెట్గా ఎదుగుతున్న భారత్తో ఘర్షణ కన్నా మిత్రుత్వమే నయమని భావిస్తోంది.
తాజావార్తలు
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
-
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!