Bangladesh: ఈశాన్య రాష్ట్రాలే టార్గెట్.. భారత్ని బెదిరించేలా మహ్మద్ యూనస్ కామెంట్స్..
- ఈశాన్య రాష్ట్రాలను ప్రస్తావిస్తూ బంగ్లాదేశ్ వ్యాఖ్యలు..
- ఆందోళనకరంగా చైనా పర్యటనలో మహ్మద్ యూనస్ తీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్ చైనా పర్యటనలో ఉన్నాడు. ఇప్పటికే, పాకిస్తాన్తో స్నేహం చేస్తున్న బంగ్లాదేశ్, ఇప్పుడు చైనాతో చెలిమిని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఇదిలా ఉంటే, మహ్మద్ యూనస్ భారత్ని బెదిరించేలా చైనాలో కామెంట్స్ చేయడమే ఇప్పుడు సంచలనంగా మారింది. భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలకు లక్ష్యంగా చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఈ ప్రాంతంలో విస్తరించాలని చైనాను యూనస్ కోరాడు. ‘‘భారతదేశంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఏడు రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్గా ఉన్నాయి. వాటికి సముద్రాన్ని చేరుకునే అవకాశం లేదు. మొత్తం ఈ ప్రాంతానికి (ఈశాన్య భారతదేశం) కోసం మనం(బంగ్లాదేశ్) సముద్రానికి ఏకైక సంరక్షులం’’ అని యూనస్ చెప్పాడు. ఇది చైనాకు భారీ అవకాశాన్ని తెరుస్తుందని, ఇది చైనా ఆర్థిక వ్యవస్థ మరింత విస్తరించేందుకు సాయపడుతుందని, వస్తువుల్ని తయారు చేయండి, వాటిని మార్కెట్ చేయండి, చైనాకు తీసుకెళ్లండి లేదా ప్రపంచంలో మిగిలిన ప్రాంతాలకు ఎగుమతి చేయండి అని యూనస్ కోరాడు.
Also Read
Read Also: Waqf bill : ఏప్రిల్ 2న లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు..
బంగ్లాదేశ్లో చైనా పెట్టుబడులు పెట్టాలని కోరుతూ.. ఈశాన్య రాష్ట్రాల గురించి ప్రస్తావించడంలో ప్రాముఖ్యత ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. యూనస్ కావాలనే భారత్ని బెదిరించే విధంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలే కాకుండా, యూనస్ నేపాల్, భూటాన్ దేశాలను కూడా ప్రస్తావించారు. బంగ్లాదేశ్లో చైనా పెట్టుబడులను ఆకర్షించాడు. యూనస్ చేసిన ఈ వ్యాఖ్యలు చాలా ఆందోళనకరంగా ఉందని, స్పష్టత అవసరమని భారత విదేశాంగ నిపుణులు అడిగారు. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో చైనా పాల్గొనాలని యూనస్ బహిరంగంగా పిలుపునిస్తున్నారా.? అని ప్రశ్నిస్తున్నారు.
భారత సరిహద్దుల్లో చైనా విస్తరణ మనదేశానికి ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్, సీపెక్తో పాగా వేసింది. బంగ్లాదేశ్లో మోంగ్లా ఓడరేవును ఆధునీకీకరించేందుకు ఒప్పందం చేసుకుంది. దీంతో పాటు నదీ జలాల నిర్వహణపై బంగ్లాదేశ్కు 50 ఏళ్ల సాయం అందించాలని యూనస్ చైనాని కోరాడు. గతంలో పలుమార్లు, బంగ్లాదేశ్ నేతలు భారత్ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ‘‘సిలిగురి కారిడార్(చికెన్స్ నెక్)’’ బ్లాక్ చేస్తామని కామెంట్స్ చేశారు. దీనిని బట్టి చూస్తే యూనస్తో పాటు బంగ్లా నాయకులు భారత్కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!