Supreme Court: “బుల్డోజర్ యాక్షన్”.. యూపీ సర్కార్పై సుప్రీం తీవ్ర ఆగ్రహం..
- ‘‘ మా మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసింది’’..
- బుల్డోజర్ యాక్షన్పై సుప్రీంకోర్టు సీరియన్..
- యోగి ప్రభుత్వానికి మందలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ని సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. బుల్డోజర్ యాక్షన్పై ప్రయాగ్రాజ్ పరిపాలన విభాగాన్ని తీవ్రంగా విమర్శించింది. కూల్చివేత చర్య ‘‘రాజ్యాంగ విరుద్ధం’’, ‘‘అమానవీయ’’ అని పేర్కొంది. బుల్డోజర్ యాక్షన్ మా మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది’’ అని జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బాధిత ఇంటి యజమానులకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
తగిన చట్టబద్ధమైన ప్రక్రియ పాటించకుండా ఒక న్యాయవాది, ఒక ప్రొఫెసర్, మరికొందరి ఇళ్లను కూల్చివేసినందుకు యూపీ ప్రభుత్వాన్ని కోర్టు తీవ్రంగా విమర్శించింది. తమ ఇళ్లను కూల్చివేసే ఒక రాత్రి ముందు తనకు నోటీసులు అందించినట్లు న్యాయవాది జుల్ఫికర్ హైదర్, ప్రొఫెసర్ అలీ అహ్మద్, మరో ముగ్గురు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 2023లో హత్యకు గురైన గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్కి చెందిన వారిగా తమను పొరపడి అధికారులు తమ ఇళ్లను కూల్చేసినట్లు పిటిషనర్లు కోర్టుకు తెలిపారు.
Also Read
- AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
Read Also: Sanjay Raut: అద్వానీకి షాజహాన్ పరిస్థితి.. మోడీపై సంజయ్ రౌత్ విమర్శలు..
కూల్చివేత నోటీసులు అందించిన విధానంపై కూడా కోర్టు అధికారుల్ని మందలించింది. ఆస్తులపై నోటీసులు అంటించామని రాష్ట్రం తరుపు న్యాయవాది చెప్పగా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపారని కోర్టు ప్రశ్నించింది. వారికి రూ. 10 లక్షలు పరిహారం చెల్లించాలని, దీని వల్ల మరోసారి అధికారులు తగిన ప్రక్రియ అనుసరించాలని గుర్తుంచుకుంటారని జస్టిన్ ఓకా అన్నారు.
ఇళ్లు కూల్చేవేత విషయంలో బాధితులకు ప్రతిస్పందించడానికి సరైన అవకాశం కల్పించలేదని కోర్టు పేర్కొంది. ఆశ్రయం పొందే హక్కు కూడా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో అంతర్భాగమని అధికారులు గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. ఇలా కూల్చివేతలను నిర్వహించడం అధికారం వైపు నుంచి అసమర్థతను చూపుతుందని కోర్టు పేర్కొంది. యూపీ అంబేద్కర్ నగర్లో కూల్చివేత సమయంలో ఒక అమ్మాయి తన పుస్తకాలను పట్టుకుని ఉన్న వీడియో గురించి కూడా కోర్టు ప్రస్తావించింది. ఇలాంటి దృశ్యాల వల్ల అందరూ కలత చెందుతున్నారని జస్టిస్ భూయాన్ అన్నారు.
తాజావార్తలు
-
HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!