Supreme Court: “బుల్డోజర్ యాక్షన్”.. యూపీ సర్కార్పై సుప్రీం తీవ్ర ఆగ్రహం..
- ‘‘ మా మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసింది’’..
- బుల్డోజర్ యాక్షన్పై సుప్రీంకోర్టు సీరియన్..
- యోగి ప్రభుత్వానికి మందలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ని సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. బుల్డోజర్ యాక్షన్పై ప్రయాగ్రాజ్ పరిపాలన విభాగాన్ని తీవ్రంగా విమర్శించింది. కూల్చివేత చర్య ‘‘రాజ్యాంగ విరుద్ధం’’, ‘‘అమానవీయ’’ అని పేర్కొంది. బుల్డోజర్ యాక్షన్ మా మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది’’ అని జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బాధిత ఇంటి యజమానులకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
తగిన చట్టబద్ధమైన ప్రక్రియ పాటించకుండా ఒక న్యాయవాది, ఒక ప్రొఫెసర్, మరికొందరి ఇళ్లను కూల్చివేసినందుకు యూపీ ప్రభుత్వాన్ని కోర్టు తీవ్రంగా విమర్శించింది. తమ ఇళ్లను కూల్చివేసే ఒక రాత్రి ముందు తనకు నోటీసులు అందించినట్లు న్యాయవాది జుల్ఫికర్ హైదర్, ప్రొఫెసర్ అలీ అహ్మద్, మరో ముగ్గురు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 2023లో హత్యకు గురైన గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్కి చెందిన వారిగా తమను పొరపడి అధికారులు తమ ఇళ్లను కూల్చేసినట్లు పిటిషనర్లు కోర్టుకు తెలిపారు.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
Read Also: Sanjay Raut: అద్వానీకి షాజహాన్ పరిస్థితి.. మోడీపై సంజయ్ రౌత్ విమర్శలు..
కూల్చివేత నోటీసులు అందించిన విధానంపై కూడా కోర్టు అధికారుల్ని మందలించింది. ఆస్తులపై నోటీసులు అంటించామని రాష్ట్రం తరుపు న్యాయవాది చెప్పగా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపారని కోర్టు ప్రశ్నించింది. వారికి రూ. 10 లక్షలు పరిహారం చెల్లించాలని, దీని వల్ల మరోసారి అధికారులు తగిన ప్రక్రియ అనుసరించాలని గుర్తుంచుకుంటారని జస్టిన్ ఓకా అన్నారు.
ఇళ్లు కూల్చేవేత విషయంలో బాధితులకు ప్రతిస్పందించడానికి సరైన అవకాశం కల్పించలేదని కోర్టు పేర్కొంది. ఆశ్రయం పొందే హక్కు కూడా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో అంతర్భాగమని అధికారులు గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. ఇలా కూల్చివేతలను నిర్వహించడం అధికారం వైపు నుంచి అసమర్థతను చూపుతుందని కోర్టు పేర్కొంది. యూపీ అంబేద్కర్ నగర్లో కూల్చివేత సమయంలో ఒక అమ్మాయి తన పుస్తకాలను పట్టుకుని ఉన్న వీడియో గురించి కూడా కోర్టు ప్రస్తావించింది. ఇలాంటి దృశ్యాల వల్ల అందరూ కలత చెందుతున్నారని జస్టిస్ భూయాన్ అన్నారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!