Venu Goapl Reddy
Author- NTV Telugu-
Parasakthi: “పరాశక్తి” బ్యాన్ చేయాలి.. కాంగ్రెస్ డిమాండ్.. కారణాలు ఇవే..
Parasakthi: తమిళనాడులో పొంగల్ బరిలో నిలిచిన సినిమాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే స్టార్ హీరో విజయ్ నటించిన ‘‘జన నాయగన్’’ సెన్సార్ కష్టాలను ఎదుర్కొంటోంది. తాజాగా మరో శివకార్తికేయన్ ‘‘పరాశక్తి’’ సినిమాపై వివాదం ముదురుతోంది. కాంగ్రెస్కు సంబంధించిన చారిత్రక సంఘటనలను వక్రీకరించారని ఆరోపిస్తూ, పరాశక్తి సినిమాపై బ్యాన్ విధించాలని తమిళనాడు యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. 1960లలో విద్యార్థి ఉద్యమం, హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పరాశక్తి తెరకెక్కింది. ఈ సినిమా జనవరి 10న థియేటర్లలోకి వచ్చింది. […] -
Trump Tariffs: భారత్పై టారిఫ్ 75% అవుతుందా.. ఇరాన్పై ట్రంప్ నిర్ణయంతో ఆందోళన..
Trump Tariffs: ఇరాన్ ప్రజాతిరుగుబాటు నేపథ్యంలో, ఆ దేశంతో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలను విధిస్తామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయం భారత్పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇరాన్ టాప్-5 వాణిజ్య భాగస్వాముల్లో భారత్ ఉంది. -
Giriraj Singh: ‘‘పందుల పెంపకం’’ అంటూ కేంద్రమంత్రి వ్యాఖ్యలు.. ఒక వర్గాన్ని అవమానించారని విమర్శలు..
Giriraj Singh: బీహార్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేశారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్జేడీ, ఇతర ప్రతిపక్ష నేతలు కేంద్రమంత్రి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. జనవరి 10న బెగుసరాయ్ జిల్లాలోని బచ్వారాలో జరిగిన సమావేశానికి బీహార్ పశుసంవర్ధక మంత్రి, బచ్వార ఎమ్మెల్యే సురేంద్ర మెహతా నిర్వహించారు. గిరిరాజ్ సింగ్ సహా సీనియర్ NDA నాయకులు హాజరయ్యారు. Read Also: […] -
Iran: ఉరిశిక్షలతో అణచివేత.. 26 ఏళ్ల నిరసనకారుడికి ఇరాన్ మరణశిక్ష..
Iran: దేశ వ్యాప్తంగా చెలరేగుతున్నఆందోళనల్ని ఇరాన్ అణచివేయాలని చూస్తోంది. అయతొల్లా అలీ ఖమేనీ మతపాలనకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. వందలాది మంది ఇప్పటికే మరణించారు. అయితే, ఈ నిరసనలతో సంబంధం ఉన్నవారిని అక్కడి ప్రభుత్వ కఠినంగా శిక్షించేందుకు సిద్ధమైంది. తాజాగా, మొదటి ఉరిశిక్షను అమలు చేయాడానికరి ఇరాన్ అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 26 ఏళ్ల ఎర్ఫాన్ సొల్తానీకి త్వరలో మరణశిక్ష అమలు చేయనున్నారు. -
Iran protests: “అమెరికన్లు వెంటనే ఇరాన్ను వదిలేయండి”.. దాడికి సిద్ధమైన యూఎస్..!
Iran protests: ఇరాన్ వ్యాప్తంగా సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం అవుతున్నాయి. వందలాది మందిని అక్కడి పాలకులు చంపుతున్నప్పటికీ, ప్రజలు ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. ఈ నిరసనల్ని ఎలాగైనా అణిచివేయాలని అక్కడి మత పాలకుడు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, అమెరికా ఇరాన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే, ట్రంప్ ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలను ప్రకటించారు. Read Also: Rakesh Sharma: […] -
Bangladesh: బంగ్లాదేశ్లో మరో హిందూ ఆటోడ్రైవర్ హత్య..
Bangladesh: బంగ్లాదేశ్లో హిందువుల హత్యలు ఆగడం లేదు. మరో హిందూ యువకుడిని కొట్టి చంపారు. ఆటోడ్రైవర్ అయిన 28 ఏళ్ల సమీర్ కుమార్ దాస్ను పథకం ప్రకారం కొట్టి చంపినట్లు తేలుస్తోంది. ఈ ఘటన ఆదివారం రాత్రి చిట్టగాంగ్లోని దగన్భూయాన్లో జరిగింది. -
Trump: ఇరాన్కు బిగ్ షాక్ ఇచ్చిన ట్రంప్.. ఆ దేశాలపై 25% సుంకాలు..
Trump: ప్రజా ఉద్యమంతో ఇరాన్ అట్టుడుకుతోంది. సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మతపాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చారు. రాజధాని టెహ్రాన్తో పాటు అన్ని ప్రావిన్సుల్లో ప్రజాందోళన ఎగిసిపడుతోంది. ఇదిలా ఉంటే, ఈ ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేసేందుకు ఖమేనీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. -
Electric Cars: ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్.. ఏకంగా 77% పెరుగుదల..
Electric Cars: భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ 2025లో భారీ వృద్ధిని సాధించింది. 2024తో పోలిస్తే 2025లో 77శాతం వృద్ధి నమోదు చేసింది. మొత్తం ఈవీ అమ్మకాలు 2024లో 99,875 యూనిట్ల నుండి 2025లో 176,815 యూనిట్లకు పెరిగాయి. ఇది ఈవీ మార్కెట్ డిమాండ్ను సూచిస్తోంది. -
Indore: 8 ఏళ్లుగా సె*క్స్కు నిరాకరిస్తుందని, భార్య హత్య..
Indore: 8 ఏళ్లుగా తనతో శృంగారానికి నిరాకరిస్తుందనే కోపంతో ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. మధ్యప్రదేశ్ ఇండోర్లో ఈ ఘటన జరిగింది. నిందితుడిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. 40 ఏళ్ల మహిళ జనవరి 9న ఏరో డ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరణించిందని డీసీపీ శ్రీకృష్ణ లాల్చందానీ మీడియాకు తెలిపారు. -
Bangladesh: మతోన్మాద జమాత్ అధినేతతో చైనా రాయబారి భేటీ.. బంగ్లాలో ఏం జరుగుతోంది.?
Bangladesh: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), జమాతే ఇస్లామీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే, తాజాగా జమాతే ఇస్లామి అధినేత షఫీకుర్ రెహమాన్ను చైనా రాయబారి యావో వెన్ సోమవారం కలవడం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!