NTR Death Anniversary: కారణజన్ముడు, యుగ పురుషుడు.. ఎన్టీఆర్ కు ఘన నివాళి తెలిపిన సీఎం చంద్రబాబు..!
NTR Death Anniversary: తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, యుగపురుషుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖులు, తెలుగు తమ్ముళ్లు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్లు X వేదికగా ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ సందేశాలు పోస్ట్ చేశారు.
NTRVardhanthi : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నారా, నందమూరి కుటుంబ సభ్యుల నివాళులు
Also Read
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
సీఎం చంద్రబాబు తన పోస్టులో ఎన్టీఆర్ను “కారణజన్ముడు, పేదల పెన్నిధి, యుగపురుషుడు”గా కొనియాడారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్ చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం పథకం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతులకు విద్యుత్ సరఫరా, మండల వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలతో చరిత్ర గమనాన్ని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన వేసిన బాట నేటికీ అనుసరణీయమని పేర్కొంటూ మరోసారి స్మృత్యంజలి ఘటించారు.
కారణజన్ముడు, యుగ పురుషుడు, పేదల పెన్నిధి, ‘అన్న’ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తున్నాను. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన ‘అన్న’ ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడు. తెలుగు వారి… pic.twitter.com/ZdkJ7VgWC6
— N Chandrababu Naidu (@ncbn) January 18, 2026
DC vs RCB: త్రుటిలో స్మృతి మంధాన సెంచరీ మిస్.. వరుస విజయాలతో ఆర్సీబీ దూకుడు..!
మంత్రి నారా లోకేశ్ కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ను “తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహానాయకుడు”గా అభివర్ణించారు. తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల చిత్రాలను ఇళ్లలో దేవుడిలా పూజించడం ఎన్టీఆర్కు మాత్రమే దక్కిన అరుదైన గౌరవమని అన్నారు. భౌతికంగా దూరమైనా, తెలుగువారి హృదయాల్లో ఎన్టీఆర్ సజీవంగా ఉన్నారని రాసుకొచ్చారు.
తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహా నాయకుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లలో పెట్టుకొని ప్రజలు దేవుడిగా పూజిస్తుండడం ఎన్టీఆర్ గారికి మాత్రమే దక్కిన అరుదైన వరం. మీరు భౌతికంగా… pic.twitter.com/ZdaeHMvZkF
— Lokesh Nara (@naralokesh) January 18, 2026
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!