Operation Sindoor: దాడులపై 30 నిమిషాల్లోనే పాకిస్తాన్కి సమాచారం అందింది: జైశంకర్..
- ఆపరేషన్ సిందూర్ గురించి కీలక విషయాలు వెల్లడించిన జైశంకర్..
- దాడులు ప్రారంభమైన 30 నిమిషాల్లోనే పాక్కి సమాచారం ఇచ్చాం..
- ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసినట్లు చెప్పాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్, పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రారంభించింది. మొత్తం 09 లష్కరేతోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, భారతదేశం ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత 30 నిమిషాల్లోనే పాకిస్తాన్ అప్రమత్తమైందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీకి తెలియజేసినట్లు తెలిసింది. మే 07 రాత్రి ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
‘‘ ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన అరగంటలోపు, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పాకిస్తాన్కి సమాచారం ఇచ్చాం. భారతదేశం, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆప్ మిలిటరీ ఆపరేషన్స్(DGMOలు) మధ్య ప్రత్యక్ష సంభాషణ తర్వాత రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ముందుగా పాకిస్తాన్ ఈ ప్రతిపాదన చేసింది’’ అని జైశంకర్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఆపరేషన్ సిందూర్ మరియు పాకిస్తాన్ నుండి ఉద్భవించే సీమాంతర ఉగ్రవాదం గురించి చర్చించడానికి ఎస్ జైశంకర్ అధ్యక్షత వహించిన విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో కెసి వేణుగోపాల్, మనీష్ తివారీ, ముకుల్ వాస్నిక్, ప్రియాంక చతుర్వేది, అప్రజిత సారంగి, గుర్జిత్ ఆజ్లా వంటి ఎంపీలు పాల్గొన్నారు. భారతదేశం ఖచ్చితత్వంతో వ్యవహరించిందని, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని, పరిస్థితి తీవ్రతరం కాకుండా ఉండటానికి పాకిస్తాన్కు వెంటనే ఈ విషయాన్ని తెలియజేసిందని జైశంకర్ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. పాకిస్తాన్ పెద్ద ఎత్తున ప్రతీకారం తీర్చుకోవచ్చని అమెరికా విదేశాంగ కార్యదర్శి నిఘా వర్గాలకు సమాచారం అందించినప్పుడు భారత్ తీవ్రంగా స్పందించిందని జైశంకర్ చెప్పారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!