Bihar: ‘‘ఎన్నికల డ్రామా’’.. అన్ని తెలిసీ నాతో ఎందుకు పెళ్లి చేశారు..? లాలూ మాజీ కోడలు ఆగ్రహం..
- కొడుకు బహిష్కరణ అంతా ఎన్నికల డ్రామా..
- లాలూ మాజీ కోడలు ఐశ్వర్య సంచలన వ్యాఖ్యలు..
- అన్ని తెలిసీ నా జీవితం నాశనం చేశారు..
- నన్ను ఎందుకు నిందించారు, కొట్టారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యవహారం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇటీవల, తేజ్ ప్రతాప్ తన ప్రియురాలు అనుష్క యాదవ్ని ఫేస్బుక్ పోస్ట్ ద్వారా పరిచయం చేశాడు. తామిద్దరం 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, రిలేషన్లో ఉన్నామని చెప్పారు. దీని తర్వాత, లాలూ ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ని 6 ఏళ్ల బహిష్కరించారు. పార్టీతో, కుటుంబంతో సంబంధం లేదని చెప్పారు. అతను ‘‘నైతిక ప్రవర్తన ఉల్లంఘన’’ కారణంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
Read Also: India China: చైనా దొంగ బుద్ధి.. ఐదుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఆంక్షలకు మోకాలడ్డు..
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
అయితే, ఈ వ్యవహారంపై తేజ్ ప్రతాప్ యాదవ్ మాజీ భార్య ఐశ్వర్యా రాయ్ స్పందించారు. ‘‘వారిద్దరు కలిసి ఉన్నారు. వారు విడిపోలేదు, ఎన్నికలు దగ్గరపడ్డాయి, అందుకే వారు అలాంటి చర్యలు తీసుకుని డ్రామా సృష్టించారు’’ అని అన్నారు. తన జీవితం ఎందుకు నాశనం చేశారని లాలూ కుటుంబాన్ని ఆమె ప్రశ్నించింది. తాను వివాహ సమయంలో అనేక వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పింది. లాలూ కుటుంబం తనను కొట్టిన సమయంలో సామాజిక న్యాయం ఎక్కడి వెళ్లిందో వారిని అడగాలి అని అన్నారు. నేను చేయని తప్పులకు, వారి కొడుకు చేసిన తప్పులను దాచడానికి నన్ను నిందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘అతను (తేజ్ ప్రతాప్ యాదవ్) 12 ఏళ్ల సుదీర్ఘ ప్రేమ వ్యవహారంలో ఉన్నాడని ఇప్పుడు అందరికి తెలిసింది. లాలూజీ, రబ్రీదేవీ లేదా తేజస్వీలకు తెలియదని మీరు అనుకుంటున్నారా..? వారు ఎల్లప్పుడు స్త్రీలను నిందిస్తుంటారు’’ అని అన్నారు. విడాకుల గురించి వారు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఐశ్వర్య చెప్పారు. ఏం జరిగిందో తనకు అర్థం కాలేదని, తన విడాకుల విషయం మీడియా ద్వారా తెలిసిందని ఆమె చెప్పింది. అన్ని తెలిసి కూడా నాతో అతడికి ఎందుకు వివాహం జరిపించారు..? నన్ను ఎందుకు కొట్టారు..? ప్రతీ దానికి ఎందుకు నన్ను నిందించారు..? అని ప్రశ్నించారు. నాకు న్యాయం ఎప్పుడు లభిస్తుంది..? నేను పోరాటం కొనసాగిస్తాను అని అన్నారు.
#WATCH | Patna, Bihar: "… Why was my life ruined? Why was I beaten? Now they have suddenly had a social awakening. They are all together. They have not separated… The elections are near, that is why they have taken such a step and created this drama…," says RJD leader Tej… pic.twitter.com/DC2BXUdJO2
— ANI (@ANI) May 26, 2025
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!