Bihar: ‘‘ఎన్నికల డ్రామా’’.. అన్ని తెలిసీ నాతో ఎందుకు పెళ్లి చేశారు..? లాలూ మాజీ కోడలు ఆగ్రహం..
- కొడుకు బహిష్కరణ అంతా ఎన్నికల డ్రామా..
- లాలూ మాజీ కోడలు ఐశ్వర్య సంచలన వ్యాఖ్యలు..
- అన్ని తెలిసీ నా జీవితం నాశనం చేశారు..
- నన్ను ఎందుకు నిందించారు, కొట్టారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యవహారం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇటీవల, తేజ్ ప్రతాప్ తన ప్రియురాలు అనుష్క యాదవ్ని ఫేస్బుక్ పోస్ట్ ద్వారా పరిచయం చేశాడు. తామిద్దరం 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, రిలేషన్లో ఉన్నామని చెప్పారు. దీని తర్వాత, లాలూ ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ని 6 ఏళ్ల బహిష్కరించారు. పార్టీతో, కుటుంబంతో సంబంధం లేదని చెప్పారు. అతను ‘‘నైతిక ప్రవర్తన ఉల్లంఘన’’ కారణంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
Read Also: India China: చైనా దొంగ బుద్ధి.. ఐదుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఆంక్షలకు మోకాలడ్డు..
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
అయితే, ఈ వ్యవహారంపై తేజ్ ప్రతాప్ యాదవ్ మాజీ భార్య ఐశ్వర్యా రాయ్ స్పందించారు. ‘‘వారిద్దరు కలిసి ఉన్నారు. వారు విడిపోలేదు, ఎన్నికలు దగ్గరపడ్డాయి, అందుకే వారు అలాంటి చర్యలు తీసుకుని డ్రామా సృష్టించారు’’ అని అన్నారు. తన జీవితం ఎందుకు నాశనం చేశారని లాలూ కుటుంబాన్ని ఆమె ప్రశ్నించింది. తాను వివాహ సమయంలో అనేక వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పింది. లాలూ కుటుంబం తనను కొట్టిన సమయంలో సామాజిక న్యాయం ఎక్కడి వెళ్లిందో వారిని అడగాలి అని అన్నారు. నేను చేయని తప్పులకు, వారి కొడుకు చేసిన తప్పులను దాచడానికి నన్ను నిందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘అతను (తేజ్ ప్రతాప్ యాదవ్) 12 ఏళ్ల సుదీర్ఘ ప్రేమ వ్యవహారంలో ఉన్నాడని ఇప్పుడు అందరికి తెలిసింది. లాలూజీ, రబ్రీదేవీ లేదా తేజస్వీలకు తెలియదని మీరు అనుకుంటున్నారా..? వారు ఎల్లప్పుడు స్త్రీలను నిందిస్తుంటారు’’ అని అన్నారు. విడాకుల గురించి వారు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఐశ్వర్య చెప్పారు. ఏం జరిగిందో తనకు అర్థం కాలేదని, తన విడాకుల విషయం మీడియా ద్వారా తెలిసిందని ఆమె చెప్పింది. అన్ని తెలిసి కూడా నాతో అతడికి ఎందుకు వివాహం జరిపించారు..? నన్ను ఎందుకు కొట్టారు..? ప్రతీ దానికి ఎందుకు నన్ను నిందించారు..? అని ప్రశ్నించారు. నాకు న్యాయం ఎప్పుడు లభిస్తుంది..? నేను పోరాటం కొనసాగిస్తాను అని అన్నారు.
#WATCH | Patna, Bihar: "… Why was my life ruined? Why was I beaten? Now they have suddenly had a social awakening. They are all together. They have not separated… The elections are near, that is why they have taken such a step and created this drama…," says RJD leader Tej… pic.twitter.com/DC2BXUdJO2
— ANI (@ANI) May 26, 2025
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..