Venu Goapl Reddy
Author- NTV Telugu-
AI Summit: కాంగ్రెస్ కార్యకర్తలను చితక్కొట్టిన ప్రజలు.. వీడియో వైరల్..
AI Summit: ప్రపంచ వేదికపై భారతదేశ పరువు పోయే విధంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రవర్తించారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సమావేశంలో ఊహించని సంఘటన జరిగింది. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు తమ టీ షర్టుల్ని తీసేసి, నినాదాలు చేశారు. ఏఐ ఎక్స్పో హాల్లోకి ప్రవేశించి, ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ను ఉద్దేశిస్తూ, టీషర్టులు ప్రదర్శించారు. ప్రధాని మోడీ ట్రంప్నకు లొంగిపోయారని అన్నారు. Read Also: […] -
Accenture: ప్రమోషన్ కావాలంటే AI వాడాలి.. ఉద్యోగులకు యాక్సెంచర్ వార్నింగ్..
Accenture: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) వచ్చిన తర్వాత, టెక్ రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాలు దినదిన గండం నూరేళ్ల ఆయుషుగా మారింది. ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. టెక్ కంపెనీలు కూడా ఉద్యోగులు అంతా AIకి అలవాటుపడాలని చెబుతున్నాయి. ప్రముఖ టెక్ దిగ్గజం యాక్సెంచర్ 11,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఇప్పుడు మరో సంచలనం నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఉద్యోగులు ఏఐ వాడకపోతే ప్రమోషన్లు ఉండవని స్పష్టం చేసింది. […] -
Bangladesh: బంగ్లా విద్యార్థి నేతలు ఇక మారరా.. బీఎన్పీ విజయానికి భారత్ కారణమట..
Bangladesh: ఎన్నికల్లో అవామీలీగ్ అరాచకాలక పాల్పడిందని బంగ్లాదేశ్ విద్యార్థి నేతలు ఆరోపించి, షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చేలా చేశారు. ఆ తర్వాత మహ్మద్ యూనస్ను తాత్కాలిక దేశాధినేతగా చేశారు. ఈయన హయాంలో నిర్వహించిన ఎన్నికల్లో ఇటీవల బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఘన విజయం సాధించింది. -
Tamil Nadu: తమిళనాడులో సంచలనం.. స్టాలిన్ పార్టీలోకి ఓపీఎస్.!
Tamil Nadu: తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్నాకొద్ది రాజకీయ ముఖచిత్రం మారుతోంది. గతంలో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య ఉన్న ద్విముఖ పోరు ఇప్పుడు, యాక్టర్ విజయ్ పార్టీ టీవీకే ఎంట్రీతో త్రిముఖపోరుగా మారింది. ఈ ఎన్నికల వేడిలో రాజకీయం హాట్ హాట్గా మారింది. -
T20 World Cup: పాకిస్తాన్ ట్రాప్లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్.. యూనస్ సంతోషం కోసమే డ్రామా..
T20 World Cup: భారతదేశానికి వ్యతిరేకంగా, భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత వేదికలపై ఆడనంటూ రచ్చ చేసింది. తమ వేదికల్ని శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది. దీనికి ఐసీసీ(ICC) ఒప్పుకోలేదు. ఫలితంగా బంగ్లాదేశ్ ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్( T20 World Cup 2026) నుంచి బయటకు వెళ్లింది. అయితే, అప్పటి బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ పాకిస్తాన్తో కలిసి భారత్కు వ్యతిరేకంగా ఆడిన ఆటలో బంగ్లాదేశ్ క్రికెట్ బలైంది. -
Donald Trump: 10 రోజులు టైమ్ ఇస్తున్నా.. ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం..
Donald Trump: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. వాషింగ్టన్లో ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’ తొలి సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. మిడిల్ ఈస్ట్లో భారీ స్థాయిలో అమెరికా సైనిక సమీకరణ జరుగుతోందని, ఇరాన్ త్వరగా ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని, అప్పటికీ ఒప్పుకోకపోతే అమెరికా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని, ఏమి జరుగుతోందో వచ్చే 10 రోజుల్లో మీరే తెలుసుకుంటారు అని అల్టిమేటం జారీచేశారు. ఇరాన్తో అర్థవంతమైన ఒప్పందా చేయడం కష్టమని చెప్పారు. […] -
Donald Trump: 11 యుద్ధ విమానాలు కూలిపోయాయి.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట..
Donald Trump: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నాడు. ‘‘మీరు (భారత్, పాక్) ఘర్షణ పడితే ప్రతీ దేశంపై 200 శాతం సుంకాలు విధిస్తానని నేను చెప్పాను. డబ్బు కోల్పోయే పరిస్థితి వస్తే మనం పోరాడాలని అనుకోము’’ అని అమెరికా అధ్యక్షుడు బోర్డ్ ఆఫ్ పీస్ ప్రారంభ సమావేశంలో అన్నారు. గతేడాది ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ , పాక్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానే అని […] -
Oil Imports: భారత్-అమెరికా ఆయిల్ ఘర్షణలో గెలిచిన సౌదీ అరేబియా..
Oil Imports: భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందనే కోపంతో గతంలో అమెరికా భారత్పై 25 శాతం అదనపు సుంకంతో పాటు మొత్తం 50 శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత పరస్పర సుంకాలను 18 శాతానికి తగ్గించింది. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేస్తానని హామీ ఇచ్చిందని అమెరికా చెబుతోంది. మరోవైపు, భారత్ తమ నుంచి చమురు కొనుగోలును ఎక్కడా ఆపేస్తామని చెప్పలేదని […] -
Delhi: బంగ్లాదేశ్లో హిందూ ఎస్ఐ హత్య కేసు.. ఢిల్లీలో నిందితుడి అరెస్ట్..
Delhi: బంగ్లాదేశ్లో మోస్ట్ వాంటెడ్ నిందితుడు, హిందూ పోలీస్ అధికారిని హత్య కేసులో నిందితుడిగా ఉన్న విద్యార్థి నాయకుడిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఇతను యూరప్ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్పోర్టులో అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని అహ్మద్ రజా హసన్ మెహదీగా గుర్తించారు. ఇతడిని బంగ్లాదేశ్కు బహిష్కరించారు. -
Emmanuel Macron: ‘‘రాఫెల్తో మీ దేశానికే లాభం, విమర్శలు ఎందుకు.?’’
Emmanuel Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ భారత్ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన పాల్గొన్నారు. గురువారం మక్రాన్ భారత్తో 114 రాఫెల్ జెట్ల కొనుగోలు ఒప్పందాన్ని సమర్థించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. రాఫెల్ యుద్ధవిమానాలు భారత్ను బలమైన సైనిక శక్తిగా మారుస్తాయని, ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుతాయని అన్నారు. ఈ ఒప్పందం భారత్లో మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని కూడా చెప్పారు. Read Also: […]
తాజావార్తలు
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!