Quad: భారత్కు దౌత్య విజయం.. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్ నేతలు..
- భారత్కు అతిపెద్ద దౌత్య విజయం..
- పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్ కూటమి..
- ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలన్న ఆస్త్రేలియా, అమెరికా, జపాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Quad: భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం దక్కింది. క్వాడ్ గ్రూప్ (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించింది. 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని క్వాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రులు కోరారు. ఉగ్రదాడి నేరస్తులు, నిర్వాహకులు, ఫైనాన్షియర్లపై చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. వాషింగ్టన్లో జరిగిన సంయుక్త ప్రకటనలో.. సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: Jagapathi Babu : బుల్లితెరపై కొత్త అవతారంలో జగ్గూభాయ్..
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
‘‘పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దారుణమైన చర్యకు పాల్పడిన వారిని, నిర్వాహకులను, ఆర్థిక సహాయం చేసిన వారిని ఎటువంటి ఆలస్యం లేకుండా న్యాయం ముందు నిలబెట్టాలి. అంతర్జాతీయ చట్టం, సంబంధిత UNSCRల ప్రకారం వారి బాధ్యతలకు అనుగుణంగా, ఈ విషయంలో అన్ని సంబంధిత అధికారులతో చురుకుగా సహకరించాలని అన్ని UN సభ్య దేశాలను కోరుతున్నాము’’ అని ప్రకటన పేర్కొంది.
ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో పాటు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ పాల్గొన్నారు. ప్రపంచ సమస్యలు, ఉగ్రవాద నిరోధక సహకారంపై నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు విస్తృతంగా చర్చించారు. ఉగ్రవాదంపై ప్రపంచం ‘‘జీరో టాలరెన్స్’’తో ఉండాలని, బాధితులను, నేరస్తులను ఎప్పుడూ సమానం చూడొద్దని, ఉగ్రవాదం నుంచి తమ పౌరుల్ని రక్షించుకునే బాధ్యత భారత్కు ఉందని జైశంకర్ అన్నారు.
తాజావార్తలు
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..