Hyderabad : ఈరోజు ట్రాఫిక్ ఆంక్షలు.. హై అలర్ట్.. ఈ ఫ్లైఓవర్ల మూసివేత.. పాతబస్తీలో భారీ భద్రత.!
- షబ్ ఎ మెరాజ్ వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- ఓల్డ్ సిటీలో హై అలర్ట్ భద్రత
- ఫ్లైఓవర్ల మూసివేతతో మారిన రూట్లు
- సోషల్ మీడియా పుకార్లపై కఠిన చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో పవిత్రమైన ‘షబ్-ఎ-మెరాజ్’ పర్వదినాన్ని పురస్కరించుకుని, ఇటీవల పాతబస్తీలో చోటుచేసుకున్న మతపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఒకవైపు ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ వేళ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడటంతో పాటు, మరోవైపు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ విభాగం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా యువత అర్ధరాత్రి వేళ బైక్ రేసింగ్లు చేయడం, మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రాణాపాయం కొని తెచ్చుకోవడం వంటి ఘటనలను అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు ఈ ఆంక్షలను అమలులోకి తెస్తున్నారు.
ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ వెల్లడించిన వివరాల ప్రకారం, శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి నగరంలోని ప్రధాన ఫ్లైఓవర్లన్నింటినీ మూసివేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్డును కూడా వాహనాల రాకపోకల కోసం పూర్తిగా నిలిపివేయనున్నారు. అయితే, అత్యవసర సేవలకు , సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలగకుండా గ్రీన్ల్యాండ్స్ ఫ్లైఓవర్, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే , లంగర్ హౌస్ ఫ్లైఓవర్లకు మాత్రం ఈ ఆంక్షల నుండి మినహాయింపు కల్పించారు. వీటితో పాటు తెలంగాణ తల్లి, షేక్పేట్ , బహదూర్పురా ఎక్స్ రోడ్ వంటి ప్రధాన ఫ్లైఓవర్లను ఆయా సమయాల్లో ఉండే రద్దీని , భద్రతా అవసరాలను బట్టి మూసివేసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే సహాయం కోసం 9010203626 అనే హెల్ప్లైన్ నంబర్కు సంప్రదించాలని కోరారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
మరోవైపు, పాతబస్తీలోని పురానాపూల్ ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో పోలీసులు ‘హై అలర్ట్’ ప్రకటించారు. జనవరి 14వ తేదీ రాత్రి ఒక గుర్తుతెలియని వ్యక్తి స్థానిక మైసమ్మ ఆలయంలోని ఫ్లెక్సీలను , విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ వార్త తెలియగానే సుమారు 300 మందితో కూడిన ఒక గుంపు సమీపంలోని ఒక ‘చిల్లా’పై దాడికి పాల్పడటంతో పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఏర్పడింది. దీనిపై తక్షణమే స్పందించిన పోలీసు యంత్రాంగం, ఆలయ విధ్వంసానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి లోతైన విచారణ చేపట్టింది. ప్రస్తుతం పాతబస్తీలోని సున్నితమైన ప్రదేశాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను మోహరించి నిరంతరం పహారా కాస్తున్నారు.
పవిత్రమైన ప్రార్థనల సమయంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా చూడటం తమ ప్రాధాన్యత అని పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా పుకార్లను వ్యాప్తి చేసే వారిపై , మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా పండుగ రాత్రి వేళ వాహనదారులు సంయమనం పాటించాలని, కేవలం భద్రతా కారణాల దృష్ట్యానే ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలోని అన్ని మతాల ప్రజలు శాంతియుతంగా ఉండాలని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించకుండా సహకరించాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను అధిగమించవచ్చని , ఈ కఠిన నిర్ణయాలు ప్రజల క్షేమం కోసమేనని వారు పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!